కేవలం యాభై శాతం సీట్లు మాత్రమే అమ్మడానికి సినిమా థియేటర్ల ఓనర్లు ఓకే అంటున్నారు. అయితే ఎప్పటిలా ఫుల్ థియేటర్ రెంట్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. సగం టికెట్లు మాత్రమే అమ్ముకుని మొత్తం రెంట్ ఎలా ఇస్తామని డిస్ట్రిబ్యూటర్లు అభ్యంతరం చెబుతున్నారు. టికెట్ రేట్లు డబుల్ చేసుకోవడానికి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ లేదు.
ఒకవేళ పర్మిషన్ ఇచ్చినా కానీ పెద్ద సినిమాలకు తప్ప ఈ డబుల్ రేట్లు చిన్న చిత్రాలకు వర్కవుట్ అవ్వవు. అందుకే సంక్రాంతికి రిలీజ్ డేట్లు ప్రకటించినప్పటికీ సినిమాలు యథావిధిగా విడుదలవుతాయనే నమ్మకం లేదు. వంద శాతం టికెట్లు అమ్ముకోవడానికి పర్మిషన్ రాని పక్షంలో కొత్త సినిమాల విడుదల వేసవికి వాయిదా పడవచ్చు.
ఢిల్లీలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలైందనే వార్తలు టాలీవుడ్కి గుబులు పుట్టిస్తున్నాయి. అంతా భయపడుతున్నట్టు డిసెంబర్ నాటికి తెలుగు రాష్ట్రాలలో మళ్లీ కేసులు పెరిగినట్టయితే ఇక సంక్రాంతి సీజన్పై పూర్తిగా ఆశలు వదిలేసుకోవచ్చు. సంక్రాంతికి నాలుగైదొందల కోట్ల బిజినెస్ చేసే కెపాసిటీ వుందని ప్రూవ్ అయిన సందర్భంలో సంక్రాంతి సీజన్ని కూడా మిస్ అయితే తెలుగు చిత్ర పరిశ్రమ కోలుకోవడం చాలా కష్టతరమవుతుంది.
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…
పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…