థియేటర్లు ఎప్పటికి స్టార్ట్ అవుతాయో తెలియని పరిస్థితుల్లో ఆర్థిక భారం మోయలేని నిర్మాతలు ఓటిటీ వేదిక ద్వారా తమ సినిమాలు విడుదల చేసేస్తున్నారు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల నుంచి తొలి డిజిటల్ రిలీజ్ జరిగిపోయింది. తెలుగు నుంచి అమృతరామమ్ సినిమా వస్తే, తమిళం నుంచి ఆర్.కే. నగర్ రిలీజ్ అయ్యాయి. డిజిటల్ డెబ్యూ జరిగిపోయిందని సంబరపడడమే కానీ ఈ రెండు చిత్రాలూ తుస్సుమన్నాయి.
ఫ్రీగా కూడా చూడడం దండగ అన్నట్టున్న సినిమాల కోసం ప్రత్యేకించి సుబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే మాత్రం ఎవరూ ముందుకు రారు. ఆల్రెడీ ఆయా ఓటిటీలకు సబ్స్క్రయిబ్ అయిన వాళ్ళు మాత్రం ఈ కొత్త సినిమాలో ఏముందని కాసేపు చుడొచ్చేమో కానీ లేదంటే ఈ డిజిటల్ రిలీజ్ లు నామ్ కే వాస్తే అనిపిస్తాయంతే. అందుకే ఓటిటీ సంస్థలు కూడా పేరున్న నటీనటులు నటించిన సినిమాల హక్కుల కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అనుష్క నిశబ్దం చిత్రం ఓటిటీలో రిలీజ్ అవుతుందని బాగా ప్రచారం జరుగుతోంది.
This post was last modified on April 30, 2020 8:26 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…