‘పెళ్ళిచూపులు’ సినిమాతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసి, ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. తన రెండో చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’ థియేటర్లలో అనుకున్నంతగా ఆడలేదు కానీ.. ఓటీటీలో, టీవీల్లో ఈ సినిమాను జనం బాగానే చూశారు. కాల క్రమంలో దానికి కల్ట్ స్టేటస్ వచ్చింది. గత ఏడాది ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తే తెలుగు ప్రేక్షకులు ఎగబడి చూశారు. యూత్ ఊగిపోయారు. థియేటర్లలో సెలబ్రేషన్స్ చూసి అందరూ షాకయ్యారు.
ఫస్ట్ టైం థియేటర్ల నుంచి వచ్చిన ఆదాయం కంటే రీ రిలీజ్ కలెక్షన్ ఎక్కువ కావడం విశేషం. ఈ ఉత్సాహంలో ఈ చిత్రానికి సీక్వెల్ చేయడానికి రెడీ అయ్యాడు తరుణ్. అఫీషియల్గా ప్రకటించకపోయినా.. ఈ సీక్వెల్ గురించి ఎప్పటికప్పుడు అతను హింట్స్ ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు అఫీషియల్ అప్డేట్తో రాబోతున్నాడు తరుణ్. ఈ నెల 29న ‘ఈ నగరానికి ఏమైంది-2’ను అధికారికంగా ప్రకటించబోతున్నాడు తరుణ్ భాస్కర్.
దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్తో హింట్ ఇచ్చాడు తరుణ్. ‘ఈ నగరానికి ఏమైంది’ ప్రధాన పాత్రధారులు విశ్వక్సేన్, సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమానులను ట్యాగ్ చేసి.. ఈ నెల 29వ తేదీకి ఎగ్జైటెడ్గా ఉన్నారా అని అడిగాడు తరుణ్. అతను ట్యాగ్ చేసిన వ్యక్తులను బట్టి ఇది ‘ఈ నగరానికి ఏమైంది-2’ గురించి ప్రకటనే అని అర్థమైంది. తొలి చిత్రంలో ప్రధాన పాత్రధారులందరూ సీక్వెల్లోనూ నటించబోతున్నారని కూడా స్పష్టమైంది. ఇది ‘ఈ నగరానికి ఏమైంది’ అభిమానులను మరింత ఎగ్జైట్ చేసే విషయం.
బహుశా ఇది ప్రాపర్ సీక్వెల్ అయి ఉండొచ్చు. ఆయా వ్యక్తుల జీవితాలు కొన్నేళ్ల తర్వాత ఎలా ఉన్నాయో చూపిస్తూ ఈ సినిమా తీయబోతున్నాడన్నమాట తరుణ్. దర్శకుడిగా గొప్ప అభిరుచి ఉన్నా.. తరచుగా సినిమాలు చేయడన్నది తరుణ్ మీద తన అభిమానుల్లో ఉన్న కంప్లైంట్. చివరగా ‘కీడాకోలా’తో ఓ మోస్తరు ఫలితాన్నందుకున్న తరుణ్.. ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండాలే కానీ పెద్ద సక్సెసే అయ్యే అవకాశముంది.
This post was last modified on June 22, 2025 5:03 pm
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…