Movie News

దృశ్యం 3… వెంకీ మామదే ఆలస్యం

ఫ్యామిలీ థ్రిల్లర్స్ అనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన దృశ్యం మూడో భాగానికి రంగం సిద్ధమవుతోంది. ఇవాళ మోహన్ లాల్ అధికారికంగా పార్ట్ 3 ని లాంచ్ చేయగా హిందీలో అజయ్ దేవగన్ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది విడుదలకు రెడీ కాబోతున్నాయి. ఒకటే కథా కాదానేది ఇంకా తెలియాల్సి ఉంది. కానీ తెలుగులో వెంకటేష్ చేయడం గురించి ఇంకా ఎలాంటి అప్డేట్ లేకపోవడం ఫ్యాన్స్ ని అయోమయంలో నెడుతోంది. ప్రస్తుతం మెగా 157, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కమిట్ మెంట్స్ ఉన్న వెంకీ మామ వీటితో పాటు దృశ్యం 3 చేయాలని మూవీ లవర్స్ డిమాండ్ చేస్తున్నారు.

ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు మాయమైన శవం చుట్టూ తిరిగే దృశ్యం కథ పార్ట్ 3తో ముగింపుకు రానుంది. డెడ్ బాడీని ఇంత కాలం దాచి పెట్టిన హీరో చివరికి దాన్ని తల్లి తండ్రులకు అప్పగించడంతో పాటు వేరొక క్రైమ్ లో ఇరుక్కుపోవడం లాంటి పాయింట్ తో దీన్ని మరింత ఇంటెన్స్ తో తీస్తారట. దర్శకుడు జీతూ జోసెఫ్ టెర్రిఫిక్ స్క్రీన్ ప్లే సిద్ధం చేశారని కేరళ మీడియా టాక్. అక్టోబర్ నుంచి మోహన్ లాల్ దృశ్యం 3 షూటింగ్ కు వెళ్లనున్నారు. అజయ్ దేవగన్ 2026 అక్టోబర్ 2 విడుదల తేదీని లక్ష్యంగా పెట్టుకుని పనులు ప్రారంభించబోతున్నాడు. కానీ వెంకీ మామ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే పెండింగ్ ఉంది.

రాంబాబుగా వెంకటేష్ తప్ప ఆ పాత్రని ఇంకెవరూ చేయలేరన్నంత గొప్పగా దృశ్యం మనకు రిజిస్టర్ అయ్యింది. దృశ్యం 2 ఓటిటిలో రావడం బాక్సాఫీస్ రన్ మిస్సయ్యిందని ఫ్యాన్స్ ఫీలయ్యారు కానీ ఇప్పుడా టెన్షన్ అక్కర్లేదు. దృశ్యం 3 నిజంగా కార్యరూపం దాలిస్తే థియేటర్ లోనే ఎక్స్ పీరియన్స్ చేయొచ్చు. ప్రస్తుతానికి వెంకటేష్ దగ్గర ప్రతిపాదన ఉంది కానీ చేస్తారా చేయరా అనే దాని మీద క్లారిటీ లేదంటున్నారు. కొద్దిరోజులు వేచి చూడాల్సి రావొచ్చు. సంక్రాంతికి వస్తున్నాంతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకటేష్ ఇటీవలే రానా నాయుడు 2 వెబ్ సిరీస్ లో కనిపించారు కాని పెద్దగా రెస్పాన్స్ రాలేదు.

This post was last modified on June 21, 2025 6:08 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

39 minutes ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

1 hour ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

1 hour ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

3 hours ago

జేడీ లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

3 hours ago