తమిళ నటుడు విజయ్ సేతుపతికి ఆ రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ముఖ్యంగా తెలుగు వాళ్లలో అతణ్ని అభిమానించే వారి సంఖ్య పెద్దదే. ఇతర భాషా చిత్రాలను కూడా బాగా చూసే తెలుగు వారికి సేతుపతి ‘సైరా’, ‘ఉప్పెన’ చిత్రాల్లో నటించడానికి ముందే పరిచయం. ఇక ఈ రెండు చిత్రాలతో అతను మనవాళ్లకు మరింత చేరువ అయ్యాడు. ముఖ్యంగా ‘ఉప్పెన’ అతడికి ఇక్కడ మాంచి ఫాలోయింగ్ సంపాదించిపెట్టింది. ఆ తర్వాత తమిళంలో అతను నటించే సినిమాలు వరుసగా తెలుగులోకి అనువాదం అవుతున్నాయి. ఐతే మిగతా చిత్రాలేవీ వర్కవుట్ కాలేదు కానీ.. గత ఏడాది పెద్దగా అంచనాలు లేకుండా రిలీజైన ‘మహారాజ’ మాత్రం మన వాళ్లకు తెగ నచ్చేసింది.
థియేటర్లలో మంచి ఫలితాన్నందుకున్న ఈ చిత్రం.. ఓటీటీలో రిలీజయ్యాక అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. కొన్ని నెలల పాటు ఓటీటీలో ‘మహారాజ’ తెలుగు వెర్షన్ సైతం బాగా ట్రెండ్ అయింది. ఈ రోజుల్లో ప్రతి హిట్ సినిమాకూ ప్రేక్షకులు సీక్వెల్ ఆశిస్తున్నారు. ‘మహారాజా’ ఫ్యాన్స్కు కూడా ఆ ఆశ ఉంది. దాన్ని విజయ్ సేతుపతి, దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ నెరవేర్చబోతున్నారన్నది కోలీవుడ్ టాక్.
‘మహారాజ’తోనే దర్శకుడిగా పరిచయం అయిన నిథిలన్కు స్టార్ల నుంచి చాలానే ఆఫర్లు వచ్చినా అతను కొత్త సినిమాను ప్రకటించలేదు. నిథిలన్ మళ్లీ సేతుపతితోనే సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అది కూడా మహారాజ సీక్వెలేనట. ప్రస్తుతం స్క్రిప్టు పనులు చివరి దశలో ఉన్నాయని.. నిథినల్ ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్లు ఇవ్వడానికి సేతుపతి రెడీగా ఉన్నాడని.. త్వరలోనే సీక్వెల్ను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. ‘మహారాజ’ సౌత్ ఇండియాలోనే కాదు.. చైనాలోనూ అదిరిపోయే వసూళ్లు సాధించడం విశేషం. ఈసారి చాలా పెద్ద స్థాయిలో సినిమా రిలీజవుతుందనడంలో సందేహం లేదు. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండాలే కానీ.. వందల కోట్లు వసూళ్లు రావడం లాంఛనమే.
This post was last modified on June 20, 2025 1:54 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…