తమిళ నటుడు విజయ్ సేతుపతికి ఆ రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ముఖ్యంగా తెలుగు వాళ్లలో అతణ్ని అభిమానించే వారి సంఖ్య పెద్దదే. ఇతర భాషా చిత్రాలను కూడా బాగా చూసే తెలుగు వారికి సేతుపతి ‘సైరా’, ‘ఉప్పెన’ చిత్రాల్లో నటించడానికి ముందే పరిచయం. ఇక ఈ రెండు చిత్రాలతో అతను మనవాళ్లకు మరింత చేరువ అయ్యాడు. ముఖ్యంగా ‘ఉప్పెన’ అతడికి ఇక్కడ మాంచి ఫాలోయింగ్ సంపాదించిపెట్టింది. ఆ తర్వాత తమిళంలో అతను నటించే సినిమాలు వరుసగా తెలుగులోకి అనువాదం అవుతున్నాయి. ఐతే మిగతా చిత్రాలేవీ వర్కవుట్ కాలేదు కానీ.. గత ఏడాది పెద్దగా అంచనాలు లేకుండా రిలీజైన ‘మహారాజ’ మాత్రం మన వాళ్లకు తెగ నచ్చేసింది.
థియేటర్లలో మంచి ఫలితాన్నందుకున్న ఈ చిత్రం.. ఓటీటీలో రిలీజయ్యాక అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. కొన్ని నెలల పాటు ఓటీటీలో ‘మహారాజ’ తెలుగు వెర్షన్ సైతం బాగా ట్రెండ్ అయింది. ఈ రోజుల్లో ప్రతి హిట్ సినిమాకూ ప్రేక్షకులు సీక్వెల్ ఆశిస్తున్నారు. ‘మహారాజా’ ఫ్యాన్స్కు కూడా ఆ ఆశ ఉంది. దాన్ని విజయ్ సేతుపతి, దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ నెరవేర్చబోతున్నారన్నది కోలీవుడ్ టాక్.
‘మహారాజ’తోనే దర్శకుడిగా పరిచయం అయిన నిథిలన్కు స్టార్ల నుంచి చాలానే ఆఫర్లు వచ్చినా అతను కొత్త సినిమాను ప్రకటించలేదు. నిథిలన్ మళ్లీ సేతుపతితోనే సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అది కూడా మహారాజ సీక్వెలేనట. ప్రస్తుతం స్క్రిప్టు పనులు చివరి దశలో ఉన్నాయని.. నిథినల్ ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్లు ఇవ్వడానికి సేతుపతి రెడీగా ఉన్నాడని.. త్వరలోనే సీక్వెల్ను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. ‘మహారాజ’ సౌత్ ఇండియాలోనే కాదు.. చైనాలోనూ అదిరిపోయే వసూళ్లు సాధించడం విశేషం. ఈసారి చాలా పెద్ద స్థాయిలో సినిమా రిలీజవుతుందనడంలో సందేహం లేదు. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండాలే కానీ.. వందల కోట్లు వసూళ్లు రావడం లాంఛనమే.
This post was last modified on June 20, 2025 1:54 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…