తమిళ నటుడు విజయ్ సేతుపతికి ఆ రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ముఖ్యంగా తెలుగు వాళ్లలో అతణ్ని అభిమానించే వారి సంఖ్య పెద్దదే. ఇతర భాషా చిత్రాలను కూడా బాగా చూసే తెలుగు వారికి సేతుపతి ‘సైరా’, ‘ఉప్పెన’ చిత్రాల్లో నటించడానికి ముందే పరిచయం. ఇక ఈ రెండు చిత్రాలతో అతను మనవాళ్లకు మరింత చేరువ అయ్యాడు. ముఖ్యంగా ‘ఉప్పెన’ అతడికి ఇక్కడ మాంచి ఫాలోయింగ్ సంపాదించిపెట్టింది. ఆ తర్వాత తమిళంలో అతను నటించే సినిమాలు వరుసగా తెలుగులోకి అనువాదం అవుతున్నాయి. ఐతే మిగతా చిత్రాలేవీ వర్కవుట్ కాలేదు కానీ.. గత ఏడాది పెద్దగా అంచనాలు లేకుండా రిలీజైన ‘మహారాజ’ మాత్రం మన వాళ్లకు తెగ నచ్చేసింది.
థియేటర్లలో మంచి ఫలితాన్నందుకున్న ఈ చిత్రం.. ఓటీటీలో రిలీజయ్యాక అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. కొన్ని నెలల పాటు ఓటీటీలో ‘మహారాజ’ తెలుగు వెర్షన్ సైతం బాగా ట్రెండ్ అయింది. ఈ రోజుల్లో ప్రతి హిట్ సినిమాకూ ప్రేక్షకులు సీక్వెల్ ఆశిస్తున్నారు. ‘మహారాజా’ ఫ్యాన్స్కు కూడా ఆ ఆశ ఉంది. దాన్ని విజయ్ సేతుపతి, దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ నెరవేర్చబోతున్నారన్నది కోలీవుడ్ టాక్.
‘మహారాజ’తోనే దర్శకుడిగా పరిచయం అయిన నిథిలన్కు స్టార్ల నుంచి చాలానే ఆఫర్లు వచ్చినా అతను కొత్త సినిమాను ప్రకటించలేదు. నిథిలన్ మళ్లీ సేతుపతితోనే సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అది కూడా మహారాజ సీక్వెలేనట. ప్రస్తుతం స్క్రిప్టు పనులు చివరి దశలో ఉన్నాయని.. నిథినల్ ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్లు ఇవ్వడానికి సేతుపతి రెడీగా ఉన్నాడని.. త్వరలోనే సీక్వెల్ను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. ‘మహారాజ’ సౌత్ ఇండియాలోనే కాదు.. చైనాలోనూ అదిరిపోయే వసూళ్లు సాధించడం విశేషం. ఈసారి చాలా పెద్ద స్థాయిలో సినిమా రిలీజవుతుందనడంలో సందేహం లేదు. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండాలే కానీ.. వందల కోట్లు వసూళ్లు రావడం లాంఛనమే.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…