ఒకప్పుడు సమ్మర్ సీజన్ అంటే ప్రేక్షకులతో థియేటర్లు కళకళలాడిపోయేవి. పెద్ద పెద్ద సినిమాలు రిలీజవుతూ.. ప్రతి వారం సందడి నెలకొనేది. కానీ గత కొన్నేళ్ల నుంచి వేసవి వెలవెలబోతోంది. ఈసారి కూడా పరిస్థితి మరీ దారుణం. ఒక్క పెద్ద సినిమా కూడా లేదు. రిలీజైన వాటిలో కూడా థియేటర్లలో సందడి తీసుకొచ్చినవి తక్కువ. సమ్మర్ వేస్టయినా.. జూన్ నెలలో వారం వారం క్రేజీ సినిమాలు వస్తున్నాయని ప్రేక్షకులు సంబరపడ్డారు. కానీ తొలి వారంలో వచ్చిన ‘థగ్ లైఫ్’ డిజాస్టర్ అయింది. రెండో వారానికి షెడ్యూల్ అయిన పవన్ కళ్యాణ్ సినిమా ‘హరిహర వీరమల్లు’ వాయిదా పడిపోయింది. దీంతో ఇక మూడో వారానికి షెడ్యూల్ అయిన పెద్ద సినిమా ‘కుబేర’ మీదే అందరి దృష్టీ నిలిచింది.
వెండితెరలో వెలుగులు నింపుతుందని ఈ సినిమా మీద ఇండస్ట్రీ చాలా ఆశలే పెట్టుకుంది. ఈ సినిమా హిట్ కావడం చిత్ర బృందానికే కాదు.. టాలీవుడ్కు కూడా ఎంతో అవసరం.
ఇప్పటిదాకా ఎక్కువగా లవ్ స్టోరీలే డీల్ చేసిన విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ముల.. రూటు మార్చి ‘కుబేర’ను సీరియస్ సోషల్ డ్రామాగా మలిచాడు. ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక.. ఈ కాంబినేషనే చాలా క్యూరియాసిటీని నింపుతోంది. కమ్ముల సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందించడం కూడా ఊహించనిదే. నిర్మాతలు కూడా కథ మీద, కాంబినేషన్ మీద నమ్మకంతో ఏకంగా రూ.150 కోట్ల బడ్జెట్ పెట్టేశారు.
సినిమా గురించి ధనుష్, నాగ్ ఒక రేంజిలో చెబుతున్నారు. తన సినిమాల గురించి ఎక్కువగా గొప్పలు చెప్పుకోని కమ్ముల సైతం దీని గురించి మాత్రం చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు. టీజర్, ట్రైలర్ చూస్తే కథేంటన్నది అంతగా అర్థం కాలేదు. హీరోను బిచ్చగాడిగా చూపిస్తూ మెప్పించడం అంటే మాటలు కాదు. మరి ఈ ఛాలెంజ్ను శేఖర్ ఎలా అధిగమించడాన్నది ఆసక్తికరం. ఇటు తెలుగులో, అటు తమిళంలో ఈ సినిమాకు పెద్ద టార్గెట్లే ఉన్నాయి. వాటిని అందుకోవాలంటే టాక్ అదిరిపోవాలి. మరి శేఖర్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాడా.. టాలీవుడ్ కోరుకుంటున్న బ్లాక్ బస్టర్ను అందిస్తాడా?
This post was last modified on June 20, 2025 7:06 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…