మెగా 157ని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తీరు చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసి మూడో దానికి రంగం సిద్ధం చేస్తున్న ఈ మెట్రో స్పీడ్ డైరెక్టర్ అనుకున్న దానికన్నా చాలా ముందుగా గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. ఇటీవలే చిరంజీవి, నయనతార, క్యాథరిన్ త్రెస్సా, బుల్లిరాజు తదితరుల మీద కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు పూర్తి చేసిన రావిపూడి అసలైన భాగం కోసం రంగం సిద్ధం చేస్తున్నాడు. చిరు, వెంకటేష్ కాంబోలో వచ్చే సీన్లు, ఎపిసోడ్లకు వచ్చే నెల నుంచి శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలిసింది. డేట్లు ఫైనలయ్యాయి కానీ బయటికి రాలేదు.
అతను తీసేవి కామెడీ కమర్షియల్ ఎంటర్ టైనర్లే కావొచ్చు. కానీ క్వాలిటీ తగ్గకుండా, వేగం మిస్ కాకుండా మైంటైన్ చేస్తున్న స్థిరత్వం ఖచ్చితంగా ఒక పాఠం లాంటిది. ప్యాన్ ఇండియా ట్రాప్ లో పడి సంవత్సరాల తరబడి విలువైన కాలాన్ని వృథా చేస్తున్న కొత్త దర్శకులు తన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. 2023లో ఒక చిన్న సినిమాతో తొంభై కోట్ల గ్రాసర్ ఖాతాలో వేసుకున్న డెబ్యూ డైరెక్టర్ ఇప్పటిదాకా ఇంకో మూవీ మొదలుపెట్టలేదు. హిందీ రీమేక్ అంటూ టైం వేస్ట్ చేసుకున్నాడు. అంతకు ముందు కరోనా టైంలో జాతీయ అవార్డు సాధించిన కల్ట్ మూవీ తీసిన ఇంకో కుర్ర దర్శకుడు పద్దెనిమిది నెలల తర్వాత మెగా ఫోన్ పట్టుకున్నాడు.
ఇంత గ్యాప్ లో చాలా సినిమాల్లో నటుడిగా కనిపించాడు తప్ప డైరెక్టర్ గా ఎలాంటి దూకుడు చూపించలేదు. మొన్నటి ఏడాది ఎమోషనల్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన మరో సెన్సిటివ్ దర్శకుడు వేరే టయర్ 1 స్టార్ కోసం రెండేళ్లు ఎదురు చూసి తిరిగి తన డెబ్యూ హీరో దగ్గరికే చేరుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టుకు అంతం ఉండదు. అందుకే అనిల్ రావిపూడి టాలీవుడ్ లీగ్ లో చాలా స్పెషల్ గా నిలుస్తున్నాడు. 2026 సంక్రాంతికి మెగా 157 విడుదల చేసే తీరుతానని శపథం చేసిన రావిపూడి ఆ మాటను నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాడు.
This post was last modified on June 19, 2025 10:05 pm
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…