మెగా 157ని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తీరు చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసి మూడో దానికి రంగం సిద్ధం చేస్తున్న ఈ మెట్రో స్పీడ్ డైరెక్టర్ అనుకున్న దానికన్నా చాలా ముందుగా గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. ఇటీవలే చిరంజీవి, నయనతార, క్యాథరిన్ త్రెస్సా, బుల్లిరాజు తదితరుల మీద కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు పూర్తి చేసిన రావిపూడి అసలైన భాగం కోసం రంగం సిద్ధం చేస్తున్నాడు. చిరు, వెంకటేష్ కాంబోలో వచ్చే సీన్లు, ఎపిసోడ్లకు వచ్చే నెల నుంచి శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలిసింది. డేట్లు ఫైనలయ్యాయి కానీ బయటికి రాలేదు.
అతను తీసేవి కామెడీ కమర్షియల్ ఎంటర్ టైనర్లే కావొచ్చు. కానీ క్వాలిటీ తగ్గకుండా, వేగం మిస్ కాకుండా మైంటైన్ చేస్తున్న స్థిరత్వం ఖచ్చితంగా ఒక పాఠం లాంటిది. ప్యాన్ ఇండియా ట్రాప్ లో పడి సంవత్సరాల తరబడి విలువైన కాలాన్ని వృథా చేస్తున్న కొత్త దర్శకులు తన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. 2023లో ఒక చిన్న సినిమాతో తొంభై కోట్ల గ్రాసర్ ఖాతాలో వేసుకున్న డెబ్యూ డైరెక్టర్ ఇప్పటిదాకా ఇంకో మూవీ మొదలుపెట్టలేదు. హిందీ రీమేక్ అంటూ టైం వేస్ట్ చేసుకున్నాడు. అంతకు ముందు కరోనా టైంలో జాతీయ అవార్డు సాధించిన కల్ట్ మూవీ తీసిన ఇంకో కుర్ర దర్శకుడు పద్దెనిమిది నెలల తర్వాత మెగా ఫోన్ పట్టుకున్నాడు.
ఇంత గ్యాప్ లో చాలా సినిమాల్లో నటుడిగా కనిపించాడు తప్ప డైరెక్టర్ గా ఎలాంటి దూకుడు చూపించలేదు. మొన్నటి ఏడాది ఎమోషనల్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన మరో సెన్సిటివ్ దర్శకుడు వేరే టయర్ 1 స్టార్ కోసం రెండేళ్లు ఎదురు చూసి తిరిగి తన డెబ్యూ హీరో దగ్గరికే చేరుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టుకు అంతం ఉండదు. అందుకే అనిల్ రావిపూడి టాలీవుడ్ లీగ్ లో చాలా స్పెషల్ గా నిలుస్తున్నాడు. 2026 సంక్రాంతికి మెగా 157 విడుదల చేసే తీరుతానని శపథం చేసిన రావిపూడి ఆ మాటను నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాడు.
ఏపీ ప్రభుత్వానికి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు కూడా ఓ కేసు సవాల్గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…
ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…
ఈ రోజుల్లో ఏ సినిమా ఎలా ఆడుతుందో అంచనా వేయలేని పరిస్థితి. స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడేస్తాయన్న గ్యారెంటీ…
ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ షార్ట్ కట్ లో ఏఐ. అలాంటి ఏఐని వినియోగిస్తూ.. బాబు పేరునే వాడుకుంటూ ఇప్పుడు సైబర్ నేరగాళ్లు…
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కెరీర్లో ‘ఇద్దరు’ పెద్ద డిజాస్టర్ కావచ్చు. కానీ కంటెంట్ పరంగా అదొక కల్ట్ క్లాసిక్. మణిరత్నం…
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, ప్రస్తుత వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంతో ప్రముఖ నాయకుడు, దివంగత వంగవీటి రంగా కుమార్తె..…