మెగా 157ని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తీరు చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసి మూడో దానికి రంగం సిద్ధం చేస్తున్న ఈ మెట్రో స్పీడ్ డైరెక్టర్ అనుకున్న దానికన్నా చాలా ముందుగా గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. ఇటీవలే చిరంజీవి, నయనతార, క్యాథరిన్ త్రెస్సా, బుల్లిరాజు తదితరుల మీద కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు పూర్తి చేసిన రావిపూడి అసలైన భాగం కోసం రంగం సిద్ధం చేస్తున్నాడు. చిరు, వెంకటేష్ కాంబోలో వచ్చే సీన్లు, ఎపిసోడ్లకు వచ్చే నెల నుంచి శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలిసింది. డేట్లు ఫైనలయ్యాయి కానీ బయటికి రాలేదు.
అతను తీసేవి కామెడీ కమర్షియల్ ఎంటర్ టైనర్లే కావొచ్చు. కానీ క్వాలిటీ తగ్గకుండా, వేగం మిస్ కాకుండా మైంటైన్ చేస్తున్న స్థిరత్వం ఖచ్చితంగా ఒక పాఠం లాంటిది. ప్యాన్ ఇండియా ట్రాప్ లో పడి సంవత్సరాల తరబడి విలువైన కాలాన్ని వృథా చేస్తున్న కొత్త దర్శకులు తన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. 2023లో ఒక చిన్న సినిమాతో తొంభై కోట్ల గ్రాసర్ ఖాతాలో వేసుకున్న డెబ్యూ డైరెక్టర్ ఇప్పటిదాకా ఇంకో మూవీ మొదలుపెట్టలేదు. హిందీ రీమేక్ అంటూ టైం వేస్ట్ చేసుకున్నాడు. అంతకు ముందు కరోనా టైంలో జాతీయ అవార్డు సాధించిన కల్ట్ మూవీ తీసిన ఇంకో కుర్ర దర్శకుడు పద్దెనిమిది నెలల తర్వాత మెగా ఫోన్ పట్టుకున్నాడు.
ఇంత గ్యాప్ లో చాలా సినిమాల్లో నటుడిగా కనిపించాడు తప్ప డైరెక్టర్ గా ఎలాంటి దూకుడు చూపించలేదు. మొన్నటి ఏడాది ఎమోషనల్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన మరో సెన్సిటివ్ దర్శకుడు వేరే టయర్ 1 స్టార్ కోసం రెండేళ్లు ఎదురు చూసి తిరిగి తన డెబ్యూ హీరో దగ్గరికే చేరుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టుకు అంతం ఉండదు. అందుకే అనిల్ రావిపూడి టాలీవుడ్ లీగ్ లో చాలా స్పెషల్ గా నిలుస్తున్నాడు. 2026 సంక్రాంతికి మెగా 157 విడుదల చేసే తీరుతానని శపథం చేసిన రావిపూడి ఆ మాటను నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాడు.
This post was last modified on June 19, 2025 10:05 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…