సోనియా అగర్వాల్.. తమిళ, తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోయే పేరు కాదిది. ఎక్కువ సినిమాలేమీ చేయలేదు కానీ.. ఒక్క 7-జి బృందావన కాలనీ సినిమాతో ఆమె వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. ఆ సినిమాతో యువ ప్రేక్షకుల హృదయాల్లోకి దూసుకెళ్లిపోయిన ఆమె.. ఆ తర్వాత వాళ్లు ఆశించిన సినిమాలు చేయలేదు.
చాలా కెరీర్ ఉండగానే తనకు ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చిన దర్శకుడు సెల్వరాఘవన్ను పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిలైపోయింది సోనియా. కానీ వాళ్ల వైవాహిక జీవితం ఎంతో కాలం సాగలేదు. కొన్నేళ్లకే విడిపోయారు. ఆ తర్వా సెల్వ మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిలైపోయాడు. సోనియా మాత్రం ఒంటరి అయిపోయింది. తిరిగి సినిమాల్లోకి వచ్చింది కానీ.. ఆమె కోరుకున్న పాత్రలు, అవకాశాలు రాలేదు. అయినా ఆమె పోరాటం మాత్రం ఆపట్లేదు.
సైడ్ క్యారెక్టర్లకు పరిమితం అయిపోయిన సోనియా.. ఈ మధ్యే ఎవరో తల్లి పాత్ర ఆఫర్ చేశారని తెగ ఫీలైపోయింది. నాతో పాటు హీరోయిన్లయిన త్రిష, నయనతారలను ఇలా అడుగుతారా అని ప్రశ్నించింది. ఆ సంగతలా ఉంచితే.. ఇంకా హీరోయిన్ పాత్రలు ఆశిస్తోందో ఏమో తెలియదు కానీ.. సోనియా తాజాగా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది.
కొత్త అవతారంలో గుర్తు పట్టలేని విధంగా తయారైన ఆమె.. తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న విషయాన్ని కూడా దాచకుండా బయటపెట్టేసింది. కానీ ఇంతకముందుతో పోలిస్తే బరువు తగ్గి, ముఖాన్ని కొంచెం మార్చుకుని ఏదో ట్రై చేస్తోంది కానీ.. అవేవీ వర్కవుట్ అయ్యేలా లేవు. పూర్తిగా ఆకర్షణ కోల్పోయిన సోనియాకు ఈ దశలో అవకాశాలు రావడం సందేహమే. ఇక సినిమాలు చాలించి వ్యక్తిగత జీవితంలో సెటిల్ కాక ఇంకా ఈ ప్రయత్నాలెందుకని ఆమెకు నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.
This post was last modified on November 12, 2020 8:13 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…