సోనియా అగర్వాల్.. తమిళ, తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోయే పేరు కాదిది. ఎక్కువ సినిమాలేమీ చేయలేదు కానీ.. ఒక్క 7-జి బృందావన కాలనీ సినిమాతో ఆమె వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. ఆ సినిమాతో యువ ప్రేక్షకుల హృదయాల్లోకి దూసుకెళ్లిపోయిన ఆమె.. ఆ తర్వాత వాళ్లు ఆశించిన సినిమాలు చేయలేదు.
చాలా కెరీర్ ఉండగానే తనకు ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చిన దర్శకుడు సెల్వరాఘవన్ను పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిలైపోయింది సోనియా. కానీ వాళ్ల వైవాహిక జీవితం ఎంతో కాలం సాగలేదు. కొన్నేళ్లకే విడిపోయారు. ఆ తర్వా సెల్వ మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిలైపోయాడు. సోనియా మాత్రం ఒంటరి అయిపోయింది. తిరిగి సినిమాల్లోకి వచ్చింది కానీ.. ఆమె కోరుకున్న పాత్రలు, అవకాశాలు రాలేదు. అయినా ఆమె పోరాటం మాత్రం ఆపట్లేదు.
సైడ్ క్యారెక్టర్లకు పరిమితం అయిపోయిన సోనియా.. ఈ మధ్యే ఎవరో తల్లి పాత్ర ఆఫర్ చేశారని తెగ ఫీలైపోయింది. నాతో పాటు హీరోయిన్లయిన త్రిష, నయనతారలను ఇలా అడుగుతారా అని ప్రశ్నించింది. ఆ సంగతలా ఉంచితే.. ఇంకా హీరోయిన్ పాత్రలు ఆశిస్తోందో ఏమో తెలియదు కానీ.. సోనియా తాజాగా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది.
కొత్త అవతారంలో గుర్తు పట్టలేని విధంగా తయారైన ఆమె.. తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న విషయాన్ని కూడా దాచకుండా బయటపెట్టేసింది. కానీ ఇంతకముందుతో పోలిస్తే బరువు తగ్గి, ముఖాన్ని కొంచెం మార్చుకుని ఏదో ట్రై చేస్తోంది కానీ.. అవేవీ వర్కవుట్ అయ్యేలా లేవు. పూర్తిగా ఆకర్షణ కోల్పోయిన సోనియాకు ఈ దశలో అవకాశాలు రావడం సందేహమే. ఇక సినిమాలు చాలించి వ్యక్తిగత జీవితంలో సెటిల్ కాక ఇంకా ఈ ప్రయత్నాలెందుకని ఆమెకు నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.
This post was last modified on November 12, 2020 8:13 am
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…