సోనియా అగర్వాల్.. తమిళ, తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోయే పేరు కాదిది. ఎక్కువ సినిమాలేమీ చేయలేదు కానీ.. ఒక్క 7-జి బృందావన కాలనీ సినిమాతో ఆమె వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. ఆ సినిమాతో యువ ప్రేక్షకుల హృదయాల్లోకి దూసుకెళ్లిపోయిన ఆమె.. ఆ తర్వాత వాళ్లు ఆశించిన సినిమాలు చేయలేదు.
చాలా కెరీర్ ఉండగానే తనకు ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చిన దర్శకుడు సెల్వరాఘవన్ను పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిలైపోయింది సోనియా. కానీ వాళ్ల వైవాహిక జీవితం ఎంతో కాలం సాగలేదు. కొన్నేళ్లకే విడిపోయారు. ఆ తర్వా సెల్వ మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిలైపోయాడు. సోనియా మాత్రం ఒంటరి అయిపోయింది. తిరిగి సినిమాల్లోకి వచ్చింది కానీ.. ఆమె కోరుకున్న పాత్రలు, అవకాశాలు రాలేదు. అయినా ఆమె పోరాటం మాత్రం ఆపట్లేదు.
సైడ్ క్యారెక్టర్లకు పరిమితం అయిపోయిన సోనియా.. ఈ మధ్యే ఎవరో తల్లి పాత్ర ఆఫర్ చేశారని తెగ ఫీలైపోయింది. నాతో పాటు హీరోయిన్లయిన త్రిష, నయనతారలను ఇలా అడుగుతారా అని ప్రశ్నించింది. ఆ సంగతలా ఉంచితే.. ఇంకా హీరోయిన్ పాత్రలు ఆశిస్తోందో ఏమో తెలియదు కానీ.. సోనియా తాజాగా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది.
కొత్త అవతారంలో గుర్తు పట్టలేని విధంగా తయారైన ఆమె.. తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న విషయాన్ని కూడా దాచకుండా బయటపెట్టేసింది. కానీ ఇంతకముందుతో పోలిస్తే బరువు తగ్గి, ముఖాన్ని కొంచెం మార్చుకుని ఏదో ట్రై చేస్తోంది కానీ.. అవేవీ వర్కవుట్ అయ్యేలా లేవు. పూర్తిగా ఆకర్షణ కోల్పోయిన సోనియాకు ఈ దశలో అవకాశాలు రావడం సందేహమే. ఇక సినిమాలు చాలించి వ్యక్తిగత జీవితంలో సెటిల్ కాక ఇంకా ఈ ప్రయత్నాలెందుకని ఆమెకు నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.
This post was last modified on November 12, 2020 8:13 am
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…