ఇటీవలే విడుదలైన నితిన్ తమ్ముడు ట్రైలర్ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ ఇకపై యూట్యూబ్ వ్యూస్ కొనమని, జెన్యూన్ గా ఎంత మంది చూస్తారో దాన్నే ప్రామాణికంగా తీసుకుంటామని స్టేజి మీద ప్రకటించారు. దానికి తగ్గట్టే తమ్ముడు ఎలాంటి ఫేక్ ప్రాపగండాకు పోలేదని అర్థమవుతోంది. ప్రొడ్యూసర్ అఫీషియల్ ఛానల్ లో నాలుగు రోజులకు గాను తమ్ముడు నమోదు చేసిన వ్యూస్ 2.9 మిలియన్లు. టి సిరీస్ ఛానల్ లో మరో 2 లక్షల వ్యూస్ ఉన్నాయి. ఇందులో ఉన్న సాలిడ్ కంటెంట్ ప్రకారం చూసుకుంటే ఇవి చిన్న నెంబర్లు. కానీ ఎలాంటి కృత్రిమ వీక్షణల జోలికి వెళ్ళకపోవడం వల్ల అంకెలు నిజాయతీగా ఉన్నాయి.
కొంచెం వెనక్కు వెళ్తే ఇదే నితిన్ నటించిన ఫ్లాప్ సినిమాల ట్రైలర్ వ్యూస్ చూస్తే నిజమేంటో అర్థమవుతుంది. ఉదాహరణకు ఇతర డిజాస్టర్ల వ్యూస్ చూస్తే ఏవీ 10 మిలియన్లకు తక్కువ లేవు. రిలీజ్ కు ముందు కూడా వీటి మీద పెద్ద బజ్ లేదు. అలాంటప్పుడు అంత పెద్ద అంకెలు కనిపించడం విచిత్రం. నిజానికి ఇది అందరూ నిర్మాతలు, హీరోలు ఫాలో అవుతున్న ప్రాక్టీసే. బయటికి ఎవరూ చెప్పుకోరు కానీ ఫ్యాన్స్ ని సంతృప్తి పరచడం కోసమో లేదా బిజినెస్ ని హైప్ చేసుకోవడం కోసమో బోలెడు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఓటిటిలు సైతం ఈ వ్యూస్ ని చూసి ప్రీ రిలీజ్ బజ్ అంచనా వేసిన ఉదంతాలు లేకపోలేదు.
దిల్ రాజు తీసుకున్న నిర్ణయం వల్ల తమ్ముడుకి అసలైన మద్దతు ఎంత ఉందనేది స్పష్టత వచ్చింది. సినిమా బాగుంటే ఆటోమేటిక్ గా ఇవి పెరుగుతాయి. జూలై 4 అది తేలిపోతుంది. కానీ ఇతర ప్రొడ్యూసర్లు కూడా ఈ దిశగా ఆలోచన చేస్తే మంచిదే. ఎందుకంటే ఉపయోగం లేని ఇలాంటి వ్యూస్ కోసం ఖర్చు పెట్టడం కన్నా క్వాలిటీ, కంటెంట్, పోస్ట్ ప్రొడక్షన్ లాంటి ఇతరత్రా వాటి మీద వ్యయం చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఇంకో పంతొమ్మిది రోజుల్లో విడుదల కాబోతున్న తమ్ముడుకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. వచ్చే వారం నుంచి పాటలతో మొదలుపెట్టి పబ్లిసిటీ పెంచబోతున్నారు.
This post was last modified on June 16, 2025 4:03 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…