ఇటీవలే విడుదలైన నితిన్ తమ్ముడు ట్రైలర్ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ ఇకపై యూట్యూబ్ వ్యూస్ కొనమని, జెన్యూన్ గా ఎంత మంది చూస్తారో దాన్నే ప్రామాణికంగా తీసుకుంటామని స్టేజి మీద ప్రకటించారు. దానికి తగ్గట్టే తమ్ముడు ఎలాంటి ఫేక్ ప్రాపగండాకు పోలేదని అర్థమవుతోంది. ప్రొడ్యూసర్ అఫీషియల్ ఛానల్ లో నాలుగు రోజులకు గాను తమ్ముడు నమోదు చేసిన వ్యూస్ 2.9 మిలియన్లు. టి సిరీస్ ఛానల్ లో మరో 2 లక్షల వ్యూస్ ఉన్నాయి. ఇందులో ఉన్న సాలిడ్ కంటెంట్ ప్రకారం చూసుకుంటే ఇవి చిన్న నెంబర్లు. కానీ ఎలాంటి కృత్రిమ వీక్షణల జోలికి వెళ్ళకపోవడం వల్ల అంకెలు నిజాయతీగా ఉన్నాయి.
కొంచెం వెనక్కు వెళ్తే ఇదే నితిన్ నటించిన ఫ్లాప్ సినిమాల ట్రైలర్ వ్యూస్ చూస్తే నిజమేంటో అర్థమవుతుంది. ఉదాహరణకు ఇతర డిజాస్టర్ల వ్యూస్ చూస్తే ఏవీ 10 మిలియన్లకు తక్కువ లేవు. రిలీజ్ కు ముందు కూడా వీటి మీద పెద్ద బజ్ లేదు. అలాంటప్పుడు అంత పెద్ద అంకెలు కనిపించడం విచిత్రం. నిజానికి ఇది అందరూ నిర్మాతలు, హీరోలు ఫాలో అవుతున్న ప్రాక్టీసే. బయటికి ఎవరూ చెప్పుకోరు కానీ ఫ్యాన్స్ ని సంతృప్తి పరచడం కోసమో లేదా బిజినెస్ ని హైప్ చేసుకోవడం కోసమో బోలెడు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఓటిటిలు సైతం ఈ వ్యూస్ ని చూసి ప్రీ రిలీజ్ బజ్ అంచనా వేసిన ఉదంతాలు లేకపోలేదు.
దిల్ రాజు తీసుకున్న నిర్ణయం వల్ల తమ్ముడుకి అసలైన మద్దతు ఎంత ఉందనేది స్పష్టత వచ్చింది. సినిమా బాగుంటే ఆటోమేటిక్ గా ఇవి పెరుగుతాయి. జూలై 4 అది తేలిపోతుంది. కానీ ఇతర ప్రొడ్యూసర్లు కూడా ఈ దిశగా ఆలోచన చేస్తే మంచిదే. ఎందుకంటే ఉపయోగం లేని ఇలాంటి వ్యూస్ కోసం ఖర్చు పెట్టడం కన్నా క్వాలిటీ, కంటెంట్, పోస్ట్ ప్రొడక్షన్ లాంటి ఇతరత్రా వాటి మీద వ్యయం చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఇంకో పంతొమ్మిది రోజుల్లో విడుదల కాబోతున్న తమ్ముడుకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. వచ్చే వారం నుంచి పాటలతో మొదలుపెట్టి పబ్లిసిటీ పెంచబోతున్నారు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…