రోజా సినిమాతో నిన్నటితరం ప్రేక్షకులను మైమరిపించిన నటి మధుబాల. అలనాటి నటి మధుబాల పేరు పెట్టుకున్న ఆమె.. రోజా సహా కొన్ని చిత్రాలతో ఆ పేరుకు న్యాయం చేసింది. ఐతే ట్రెడిషనల్ హీరోయిన్గా ముద్ర పడిపోవడం వల్లో ఏమో.. కెరీర్లో ఒక స్థాయికి మించి ఎదగలేకపోయింది. ఎక్కువ అవకాశాలు సంపాదించలేకపోయింది. ఇప్పటి హీరోయిన్లకు లిప్ లాక్స్, బెడ్ రూం సీన్లు చాలా కామన్ కానీ.. మధుబాల తరహా హీరోయిన్లు అస్సలు వాటి జోలికి వెళ్లేవారు కాదు. తన కెరీర్లో మధుబాల ఎప్పుడూ ముద్దు సీన్ చేసింది లేదు. కానీ తెరపై కనిపించలేదు కానీ.. షూట్లో మాత్రం తాను లిప్ లాక్ సీన్ చేసినట్లు మధుబాల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం.
చాలా ఇబ్బంది పడుతూ చేసిన ఆ సన్నివేశం ఎడిటింగ్లో లేచిపోయిందని ఆమె తెలిపింది.
తాను ముందు నుంచి ముద్దు సన్నివేశాలకు వ్యతిరేకమని.. ఏ సినిమాలోనూ ఆ సీన్ చేయలేదని.. కానీ ఒక సినిమా విషయంలో మాత్రం ఆ కండిషన్ పక్కన పెట్టాల్సి వచ్చిందని మధుబాల తెలిపింది. కథకు ఆ సన్నివేశం చాలా కీలకమని.. లిప్ లాక్ చేయాల్సిందే అని చిత్ర బృందం చెప్పడంతో తాను సరే అనక తప్పలేదని మధుబాల తెలిపింది. చాలా ఇబ్బంది పడుతూ ఆ సన్నివేశం చేశానని.. అసౌకర్యానికి గురయ్యానని ఆమె తెలిపింది.
తీరా చూస్తే సినిమాలో ఆ సన్నివేశం లేదని.. అది అవసరం లేదనిపించి ఎడిటింగ్లో తీసేశారని ఆమె చెప్పింది. ఈ విషయంలో చిత్ర బృందంతో తానేమీ గొడవ పడలేదని.. సినిమా కోసం ఎలాంటి సన్నివేశాల్లోనైనా నటించాల్సి ఉంటుందని కొందరు సీనియర్ నటీమణులను చూసి అర్థం చేసుకున్నానని మధుబాల చెప్పింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి అగ్ర కథానాయకులతో సినిమాలు చేసే అవకాశాలు వచ్చినా.. చివరి దశలో ఆ ఛాన్సులు వేరే వాళ్లను వరించినట్లు ఆమె చెప్పింది. బాజీఘర్లో ఓ పాత్రకు తనను అడిగినా.. దానికి అంత ప్రాధాన్యం లేదని తాను నో చెప్పినట్లు మధుబాల వెల్లడించింది.
This post was last modified on June 14, 2025 7:32 pm
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం రాజకీయాలపై జనసేన పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ నాగబాబుకు ఇంకా మక్కువ పోలేదని…
సాధారణంగా జనావాసాలు ఉండే నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆయా కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది…
పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ అని చెప్పుకోదగ్గ సినిమాల్లో తొలిప్రేమ స్థానం చాలా ప్రత్యేకం. అప్పట్లో…
తమిళనాడు ఎన్నికల తేదీ వచ్చేయడంతో కోలీవుడ్ సినిమాల రిలీజ్ డేట్ల ప్రకటనలు ఊపందుకోబోతున్నాయి. స్థానిక రాజకీయా పార్టీల ప్రాబల్యం తీవ్రంగా…
ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలపై నమ్మకంతో ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆ పార్టీల నేతలను గెలిపించారు. వైసీపీ…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజై రెండు నెలలు దాటేసింది. ఓటిటిలో వచ్చింది. శాటిలైట్ లోనూ అదరగొట్టింది. కానీ ఇప్పటిదాకా చిరంజీవి…