రోజా సినిమాతో నిన్నటితరం ప్రేక్షకులను మైమరిపించిన నటి మధుబాల. అలనాటి నటి మధుబాల పేరు పెట్టుకున్న ఆమె.. రోజా సహా కొన్ని చిత్రాలతో ఆ పేరుకు న్యాయం చేసింది. ఐతే ట్రెడిషనల్ హీరోయిన్గా ముద్ర పడిపోవడం వల్లో ఏమో.. కెరీర్లో ఒక స్థాయికి మించి ఎదగలేకపోయింది. ఎక్కువ అవకాశాలు సంపాదించలేకపోయింది. ఇప్పటి హీరోయిన్లకు లిప్ లాక్స్, బెడ్ రూం సీన్లు చాలా కామన్ కానీ.. మధుబాల తరహా హీరోయిన్లు అస్సలు వాటి జోలికి వెళ్లేవారు కాదు. తన కెరీర్లో మధుబాల ఎప్పుడూ ముద్దు సీన్ చేసింది లేదు. కానీ తెరపై కనిపించలేదు కానీ.. షూట్లో మాత్రం తాను లిప్ లాక్ సీన్ చేసినట్లు మధుబాల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం.
చాలా ఇబ్బంది పడుతూ చేసిన ఆ సన్నివేశం ఎడిటింగ్లో లేచిపోయిందని ఆమె తెలిపింది.
తాను ముందు నుంచి ముద్దు సన్నివేశాలకు వ్యతిరేకమని.. ఏ సినిమాలోనూ ఆ సీన్ చేయలేదని.. కానీ ఒక సినిమా విషయంలో మాత్రం ఆ కండిషన్ పక్కన పెట్టాల్సి వచ్చిందని మధుబాల తెలిపింది. కథకు ఆ సన్నివేశం చాలా కీలకమని.. లిప్ లాక్ చేయాల్సిందే అని చిత్ర బృందం చెప్పడంతో తాను సరే అనక తప్పలేదని మధుబాల తెలిపింది. చాలా ఇబ్బంది పడుతూ ఆ సన్నివేశం చేశానని.. అసౌకర్యానికి గురయ్యానని ఆమె తెలిపింది.
తీరా చూస్తే సినిమాలో ఆ సన్నివేశం లేదని.. అది అవసరం లేదనిపించి ఎడిటింగ్లో తీసేశారని ఆమె చెప్పింది. ఈ విషయంలో చిత్ర బృందంతో తానేమీ గొడవ పడలేదని.. సినిమా కోసం ఎలాంటి సన్నివేశాల్లోనైనా నటించాల్సి ఉంటుందని కొందరు సీనియర్ నటీమణులను చూసి అర్థం చేసుకున్నానని మధుబాల చెప్పింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి అగ్ర కథానాయకులతో సినిమాలు చేసే అవకాశాలు వచ్చినా.. చివరి దశలో ఆ ఛాన్సులు వేరే వాళ్లను వరించినట్లు ఆమె చెప్పింది. బాజీఘర్లో ఓ పాత్రకు తనను అడిగినా.. దానికి అంత ప్రాధాన్యం లేదని తాను నో చెప్పినట్లు మధుబాల వెల్లడించింది.
This post was last modified on June 14, 2025 7:32 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…