ఖైదీ సినిమాతో సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడైపోయాడు లోకేష్ కనకరాజ్. మూడో చిత్రానికే ఏకంగా కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్తో ‘మాస్టర్’ మూవీ చేసే అవకాశం దక్కించుకున్న లోకేష్.. ఆ తర్వాత కమల్ హాసన్తో తీసిన ‘విక్రమ్’ మూవీతో రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. పనైపోయిందనుకున్న కమల్ హాసన్తో అంత పెద్ద హిట్ కొట్టడం ఇండస్ట్రీకి షాక్. ‘లియో’తో అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ.. ‘కూలీ’తో మళ్లీ తన పవర్ ఏంటో చూపించేలాగే ఉన్నాడు లోకేష్. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఖైదీ-2, విక్రమ్-2, ఆమిర్ఖాన్తో సూపర్ హీరో సినిమా.. ఇలా తన క్రేజీ లైనప్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. విజయ్ అందుబాటులోకి వస్తే ‘లియో-2’ కూడా చేయాలనుకుంటున్నాడు లోకేష్. వీటిలో ఏది ఎప్పుడు ఉంటుందని అందరూ మాట్లాడుకుంటుండగా.. లోకేష్ హీరోగా సినిమా అంటూ ఇప్పుడు కొత్త న్యూస్ తెరపైకి వచ్చింది. కీర్తి సురేష్ తో ‘సాని కాయితం’, ధనుష్తో ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రాలను రూపొందించిన యువ దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్.. లోకేష్ను హీరోగా చూపించబోతున్నాడట.
వీరి కలయికలో ఒక యాక్షన్ సినిమా రాబోతోందట. లోకేష్ ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్లోనూ శిక్షణ పొందుతున్నాడట. ఓవైపు ‘కూలీ’ ప్రి ప్రొడక్షన్ పనులను చూసుకుంటూనే.. ఇంకోవైపు తాను హీరోగా నటించే సినిమా కోసం సన్నద్ధమవుతున్నాడట లోకేష్. శ్రుతి హాసన్తో కలిసి గత ఏడాది ‘ఇనిమేల్’ అనే మ్యూజిక్ వీడియోలో లోకేష్ నటించిన సంగతి తెలిసిందే. అందులో తన స్క్రీన్ ప్రెజెన్స్ బాగానే సాగింది. నటనలో తడబాటు ఏమీ కనిపించలేదు. ఇప్పుడు ఏకంగా హీరోగా నటించడానికి రెడీ అయిపోయాడు. ఓవైపు లోకేష్ దర్శకుడిగా చేయాల్సిన సినిమాల జాబితా పెద్దదిగానే ఉంది. ఇంకోవైపు రాఘవ లారెన్స్ హీరోగా ఓ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇంత బిజీగా ఉంటూ మళ్లీ హీరోగా నటించడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కోలీవుడ్ జనం.
This post was last modified on June 14, 2025 6:23 pm
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…