Movie News

దేశంలోనే ఖరీదైన సినిమా అల్లు అర్జున్ 22

రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలుపెట్టుకున్న అల్లు అర్జున్ 22 తాలూకు ఎగ్జైట్ మెంట్ అభిమానుల్లో మాములుగా లేదు. అనౌన్స్ మెంట్ కోసం వదిలిన ప్రోమో, దీపికా పదుకునే పరిచయం తాలూకు వీడియో జనంలో విపరీతమైన ఆసక్తిని పెంచాయి. అందులోనూ పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా కావడంతో నార్త్ ఆడియన్స్, ట్రేడ్ వర్గాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాయి. మూడు ఊహించని పాత్రల్లో బన్నీ ట్రిపుల్ రోల్ చేయబోయే ఈ మూవీలో దీపికా కాకుండా మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ముంబైలో జరుగుతున్న షెడ్యూల్ పక్కా ప్రణాళికతో జరుగుతోంది.

ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి దర్శకుడు అట్లీ బయట మీడియాకి దొరకలేదు. తాజాగా సత్యభామ యునివర్సిటి నుంచి డాక్టరేట్ అందుకున్న సందర్భంగా ఏఏ 22 గురించి మాట్లాడాడు. ఇండియాలోనే ఇప్పటిదాకా తెరకెక్కనంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా ఉంటుందని, చాలా పెద్ద ఎత్తున కల కంటున్నానని, బడ్జెట్ ఎంతనేది ఇంకా డిసైడ్ కాలేదని, కానీ కొత్త టెక్నాలజీలు దీని కోసం పరిచయం చేయబోతున్నామని ఓ రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చాడు. విడుదల ఎప్పుడనేది నిర్మాత తీసుకునే నిర్ణయమని, తీయడం వరకే తన బాధ్యత అంటూ ఈ విశేషాలను అడిగినవాళ్లతో పంచుకున్నాడు.

దీన్ని బట్టి అనుకున్న దానికన్నా చాలా పెద్ద స్కేల్ మీద ఏఏ 22 రూపొందుతోందనే క్లారిటీ వచ్చేసింది. దేశంలోనే కాస్ట్లీ ఫిలిం అని చెప్పడం చూస్తే ఆర్ఆర్ఆర్, బాహుబలిని దాటిపోయేలా ఉంది. కాకపోతే మహేష్ బాబు రాజమౌళిల ఎస్ఎస్ఎంబి 29 ముందు వస్తుందా లేక ఏఏ 22 ఫస్ట్ రిలీజవుతుందా అనే దాన్ని బట్టి ఎవరిది ఎక్కువవుతుందనేది డిసైడ్ చేయొచ్చు. జవాన్ బ్లాక్ బస్టర్ తర్వాత మంచి ఊపు మీదున్న అట్లీ ఈసారి ఐకాన్ స్టార్ కు ఎలాంటి కంటెంట్ ఇస్తాడోనని మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అత్యధిక శాతం ఫారిన్ నిపుణులు పని చేస్తున్న ఈ విజువల్ వండర్ రిలీజ్ 2027లో ఉండొచ్చు.

Kumar

Recent Posts

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

1 hour ago

రాజాసాబ్‌ ఫలితంతో నాకు స‌బంధం లేదు – ఎస్కేఎన్

ప్ర‌భాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ల‌లో ఒక‌ట‌వుతుంద‌ని అభిమానులు అంచ‌నాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్రభాస్ సినిమా…

1 hour ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

3 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

3 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

4 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

4 hours ago