Movie News

త్రివిక్రమ పర్వం… హీరోలెందుకు మారారంటే

టాలీవుడ్ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. గుంటూరు కారం తర్వాత అల్లు అర్జున్ తో ప్లాన్ చేసుకున్న ఫాంటసీ మూవీ ఉన్నట్టుండి జూనియర్ ఎన్టీఆర్ కి వెళ్లిపోవడం పట్ల రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ ట్విస్టులన్నీ చూసి ఫ్యాన్స్ లో అయోమయం నెలకొంది. బ్యాక్ స్టోరీ చూస్తే ఏం జరిగిందో అర్థమవుతుంది. జవాన్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు అట్లీ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో ఒక ప్యాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసుకున్నాడు. అదే సమయంలో త్రివిక్రమ్, బన్నీల మధ్య క్రమం తప్పకుండా తమ కొత్త సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతూ ఉండేవి.

ఓవర్ బడ్జెట్ తదితర కారణాల వల్ల సల్మాన్ ప్రాజెక్టు రద్దయిపోయింది. అప్పటికే అల్లు అర్జున్ తో టచ్ లో ఉన్న అట్లీ తన దగ్గరున్న ఒక విజువల్ గ్రాండియర్ సబ్జెక్టుని వినిపించాడు. పుష్ప 2 తర్వాత ఇదే రైటని భావించిన బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. సన్ పిక్చర్స్ నిర్మాణం కావడంతో పనులు వేగమందుకున్నాయి. దానికి ఎంత లేదన్నా రెండేళ్లు పడుతుందని గుర్తించిన త్రివిక్రమ్ వెంటనే ప్రత్యాన్మయం ఆలోచించాడు. అరవింద సమేత వీరరాఘవ తర్వాత మళ్ళీ కలిసి పని చేయాలనుకున్న జూనియర్ ఎన్టీఆర్ కు కబురు పెట్టేశారు. కార్తికేయ స్వామి నేపథ్యంలో అల్లుకున్న కథ బ్రహ్మాండంగా నచ్చేసి కాంబో ఓకే అనుకున్నారు.

ఇలా ఒకపక్క అట్లీతో బన్నీ, ఇంకోవైపు త్రివిక్రమ్ తో తారక్ తమ కలయికలు ఖరారు చేసుకున్నారు. ఇక్కడ ఎవరినెవరు వ్యక్తిగతంగా టార్గెట్లు చేసుకోవడం, ఈగోలకు పోవడం లాంటివేమీ లేవని ఇన్ సైడ్ టాక్. గతంలో అల వైకుంఠపురములో కన్నా ముందు జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా అనుకున్న త్రివిక్రమ్ దాన్ని ఆపేసిన సంగతి తెలిసిందే. అయినను పోయిరావలె హస్తనకు అనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. అది క్యాన్సిలైనంత  మాత్రాన ఇద్దరి మధ్య బాండింగ్ కి ఎలాంటి ప్రభావం పడలేదు. బన్నీతోనూ భవిష్యత్తులో అలాగే ఉంటుంది. రకరకాల లింకులు ముడిపెట్టి మసాలా జోడించడం తప్ప ఫైనల్ గా ఈ ఎపిసోడ్ సుఖాంతమైనట్టే.

This post was last modified on June 14, 2025 3:36 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

7 minutes ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

3 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

4 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

4 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

5 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

14 hours ago