గత ఏడాది డిసెంబరులో విడుదలైన ‘పుష్ప: ది రూల్’ పాన్ ఇండియ ా స్థాయిలో రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ‘బాహుబలి-2’ తర్వాత ఇండియాలో అత్యంత హైప్ తెచ్చుకున్న సినిమా అదే అంటే అతిశయోక్తి కాదు. వసూళ్లలో కూడా ఆ చిత్రానికి దీటుగా నిలిచింది సుకుమార్-అల్లు అర్జున్ల చిత్రం. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఉదంతం వల్ల సక్సెస్ను టీం పెద్దగా ఎంజాయ్ చేయలేకపోయింది కానీ.. లేదంటే సంబరాలు మోతెక్కిపోయేవి. ‘పుష్ప-2’ బేసిగ్గా తెలుగు సినిమానే అయినా.. ఇక్కడి కంటే హిందీలో ఆ సినిమా ఇరగాడింది. కొన్ని వారాల పాటు థియేటర్లు జనాలతో కళకళలాడాయి.
ఎంత పెద్ద సినిమా అయినా తొలి వీకెండ్ తర్వాత థియేటర్లు ఖాళీ అయిపోతున్న ఈ రోజుల్లో.. రెండు మూడు వారాల తర్వాత కూడా నార్త్ ఇండియాలో టికెట్ల కోసం థియేటర్ల దగ్గర కొట్లాటలు జరగడం ‘పుష్ప-2’ విషయంలో జరిగింది. థియేటర్లలో అంత బాగా ఆడిన ఈ సినిమా.. తర్వాత ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు బుల్లితెర మీద పుష్ప-2 కూడా సంచలనం రేపింది. ఈ సినిమా హిందీ వెర్షన్ను ఇటీవలే టీవీలో టెలికాస్ట్ చేశారు. అక్కడ వచ్చిన స్పందన చర్చనీయాంశంగా మారింది.
ఇండియా వైడ్ ‘పుష్ప-2’కు 5.1 టీఆర్పీ వచ్చిందట. ఇది ఐపీఎల్ యావరేజ్ టీఆర్పీ కంటే ఎక్కువ కావడం విశేషం. విశేష ఆదరణ తెచ్చుకున్న ఐపీఎల్-17కు యావరేజ్గా 4.6 టీఆర్పీ వచ్చింది. దాన్ని మించి ‘పుష్ప-2’కు రేటింగ్ రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. థియేటర్లలోనే కాక టీవీల్లోనూ మంచి స్పందన తెచ్చుకున్న ‘స్త్రీ-2’ సహా అనేక బాలీవుడ్ చిత్రాల టీఆర్పీలను ‘పుష్ప-2’ అధిగమించినట్లు సమాచారం. దీన్ని బట్టే ‘పుష్ప’కు నార్త్ ఇండియన్స్ ఎంతగా కనెక్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అనుమానాలు ఉన్నప్పటికీ.. ఈ స్పందన చూశాక కొన్నేళ్ల తర్వాత అయినా ‘పుష్ప-3’ తీయకుండా ఆగలేరేమో సుకుమార్, బన్నీ.
This post was last modified on June 14, 2025 2:33 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…