గత ఏడాది డిసెంబరులో విడుదలైన ‘పుష్ప: ది రూల్’ పాన్ ఇండియ ా స్థాయిలో రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ‘బాహుబలి-2’ తర్వాత ఇండియాలో అత్యంత హైప్ తెచ్చుకున్న సినిమా అదే అంటే అతిశయోక్తి కాదు. వసూళ్లలో కూడా ఆ చిత్రానికి దీటుగా నిలిచింది సుకుమార్-అల్లు అర్జున్ల చిత్రం. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఉదంతం వల్ల సక్సెస్ను టీం పెద్దగా ఎంజాయ్ చేయలేకపోయింది కానీ.. లేదంటే సంబరాలు మోతెక్కిపోయేవి. ‘పుష్ప-2’ బేసిగ్గా తెలుగు సినిమానే అయినా.. ఇక్కడి కంటే హిందీలో ఆ సినిమా ఇరగాడింది. కొన్ని వారాల పాటు థియేటర్లు జనాలతో కళకళలాడాయి.
ఎంత పెద్ద సినిమా అయినా తొలి వీకెండ్ తర్వాత థియేటర్లు ఖాళీ అయిపోతున్న ఈ రోజుల్లో.. రెండు మూడు వారాల తర్వాత కూడా నార్త్ ఇండియాలో టికెట్ల కోసం థియేటర్ల దగ్గర కొట్లాటలు జరగడం ‘పుష్ప-2’ విషయంలో జరిగింది. థియేటర్లలో అంత బాగా ఆడిన ఈ సినిమా.. తర్వాత ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు బుల్లితెర మీద పుష్ప-2 కూడా సంచలనం రేపింది. ఈ సినిమా హిందీ వెర్షన్ను ఇటీవలే టీవీలో టెలికాస్ట్ చేశారు. అక్కడ వచ్చిన స్పందన చర్చనీయాంశంగా మారింది.
ఇండియా వైడ్ ‘పుష్ప-2’కు 5.1 టీఆర్పీ వచ్చిందట. ఇది ఐపీఎల్ యావరేజ్ టీఆర్పీ కంటే ఎక్కువ కావడం విశేషం. విశేష ఆదరణ తెచ్చుకున్న ఐపీఎల్-17కు యావరేజ్గా 4.6 టీఆర్పీ వచ్చింది. దాన్ని మించి ‘పుష్ప-2’కు రేటింగ్ రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. థియేటర్లలోనే కాక టీవీల్లోనూ మంచి స్పందన తెచ్చుకున్న ‘స్త్రీ-2’ సహా అనేక బాలీవుడ్ చిత్రాల టీఆర్పీలను ‘పుష్ప-2’ అధిగమించినట్లు సమాచారం. దీన్ని బట్టే ‘పుష్ప’కు నార్త్ ఇండియన్స్ ఎంతగా కనెక్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అనుమానాలు ఉన్నప్పటికీ.. ఈ స్పందన చూశాక కొన్నేళ్ల తర్వాత అయినా ‘పుష్ప-3’ తీయకుండా ఆగలేరేమో సుకుమార్, బన్నీ.
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…
నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ PK .. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రత్యక్ష…