గత ఏడాది డిసెంబరులో విడుదలైన ‘పుష్ప: ది రూల్’ పాన్ ఇండియ ా స్థాయిలో రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ‘బాహుబలి-2’ తర్వాత ఇండియాలో అత్యంత హైప్ తెచ్చుకున్న సినిమా అదే అంటే అతిశయోక్తి కాదు. వసూళ్లలో కూడా ఆ చిత్రానికి దీటుగా నిలిచింది సుకుమార్-అల్లు అర్జున్ల చిత్రం. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఉదంతం వల్ల సక్సెస్ను టీం పెద్దగా ఎంజాయ్ చేయలేకపోయింది కానీ.. లేదంటే సంబరాలు మోతెక్కిపోయేవి. ‘పుష్ప-2’ బేసిగ్గా తెలుగు సినిమానే అయినా.. ఇక్కడి కంటే హిందీలో ఆ సినిమా ఇరగాడింది. కొన్ని వారాల పాటు థియేటర్లు జనాలతో కళకళలాడాయి.
ఎంత పెద్ద సినిమా అయినా తొలి వీకెండ్ తర్వాత థియేటర్లు ఖాళీ అయిపోతున్న ఈ రోజుల్లో.. రెండు మూడు వారాల తర్వాత కూడా నార్త్ ఇండియాలో టికెట్ల కోసం థియేటర్ల దగ్గర కొట్లాటలు జరగడం ‘పుష్ప-2’ విషయంలో జరిగింది. థియేటర్లలో అంత బాగా ఆడిన ఈ సినిమా.. తర్వాత ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు బుల్లితెర మీద పుష్ప-2 కూడా సంచలనం రేపింది. ఈ సినిమా హిందీ వెర్షన్ను ఇటీవలే టీవీలో టెలికాస్ట్ చేశారు. అక్కడ వచ్చిన స్పందన చర్చనీయాంశంగా మారింది.
ఇండియా వైడ్ ‘పుష్ప-2’కు 5.1 టీఆర్పీ వచ్చిందట. ఇది ఐపీఎల్ యావరేజ్ టీఆర్పీ కంటే ఎక్కువ కావడం విశేషం. విశేష ఆదరణ తెచ్చుకున్న ఐపీఎల్-17కు యావరేజ్గా 4.6 టీఆర్పీ వచ్చింది. దాన్ని మించి ‘పుష్ప-2’కు రేటింగ్ రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. థియేటర్లలోనే కాక టీవీల్లోనూ మంచి స్పందన తెచ్చుకున్న ‘స్త్రీ-2’ సహా అనేక బాలీవుడ్ చిత్రాల టీఆర్పీలను ‘పుష్ప-2’ అధిగమించినట్లు సమాచారం. దీన్ని బట్టే ‘పుష్ప’కు నార్త్ ఇండియన్స్ ఎంతగా కనెక్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అనుమానాలు ఉన్నప్పటికీ.. ఈ స్పందన చూశాక కొన్నేళ్ల తర్వాత అయినా ‘పుష్ప-3’ తీయకుండా ఆగలేరేమో సుకుమార్, బన్నీ.
This post was last modified on June 14, 2025 2:33 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…