గత ఏడాది డిసెంబరులో విడుదలైన ‘పుష్ప: ది రూల్’ పాన్ ఇండియ ా స్థాయిలో రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ‘బాహుబలి-2’ తర్వాత ఇండియాలో అత్యంత హైప్ తెచ్చుకున్న సినిమా అదే అంటే అతిశయోక్తి కాదు. వసూళ్లలో కూడా ఆ చిత్రానికి దీటుగా నిలిచింది సుకుమార్-అల్లు అర్జున్ల చిత్రం. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఉదంతం వల్ల సక్సెస్ను టీం పెద్దగా ఎంజాయ్ చేయలేకపోయింది కానీ.. లేదంటే సంబరాలు మోతెక్కిపోయేవి. ‘పుష్ప-2’ బేసిగ్గా తెలుగు సినిమానే అయినా.. ఇక్కడి కంటే హిందీలో ఆ సినిమా ఇరగాడింది. కొన్ని వారాల పాటు థియేటర్లు జనాలతో కళకళలాడాయి.
ఎంత పెద్ద సినిమా అయినా తొలి వీకెండ్ తర్వాత థియేటర్లు ఖాళీ అయిపోతున్న ఈ రోజుల్లో.. రెండు మూడు వారాల తర్వాత కూడా నార్త్ ఇండియాలో టికెట్ల కోసం థియేటర్ల దగ్గర కొట్లాటలు జరగడం ‘పుష్ప-2’ విషయంలో జరిగింది. థియేటర్లలో అంత బాగా ఆడిన ఈ సినిమా.. తర్వాత ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు బుల్లితెర మీద పుష్ప-2 కూడా సంచలనం రేపింది. ఈ సినిమా హిందీ వెర్షన్ను ఇటీవలే టీవీలో టెలికాస్ట్ చేశారు. అక్కడ వచ్చిన స్పందన చర్చనీయాంశంగా మారింది.
ఇండియా వైడ్ ‘పుష్ప-2’కు 5.1 టీఆర్పీ వచ్చిందట. ఇది ఐపీఎల్ యావరేజ్ టీఆర్పీ కంటే ఎక్కువ కావడం విశేషం. విశేష ఆదరణ తెచ్చుకున్న ఐపీఎల్-17కు యావరేజ్గా 4.6 టీఆర్పీ వచ్చింది. దాన్ని మించి ‘పుష్ప-2’కు రేటింగ్ రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. థియేటర్లలోనే కాక టీవీల్లోనూ మంచి స్పందన తెచ్చుకున్న ‘స్త్రీ-2’ సహా అనేక బాలీవుడ్ చిత్రాల టీఆర్పీలను ‘పుష్ప-2’ అధిగమించినట్లు సమాచారం. దీన్ని బట్టే ‘పుష్ప’కు నార్త్ ఇండియన్స్ ఎంతగా కనెక్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అనుమానాలు ఉన్నప్పటికీ.. ఈ స్పందన చూశాక కొన్నేళ్ల తర్వాత అయినా ‘పుష్ప-3’ తీయకుండా ఆగలేరేమో సుకుమార్, బన్నీ.
This post was last modified on June 14, 2025 2:33 pm
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…
మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…
రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దురంధర్-2’ ఒకటనడంలో సందేహం లేదు. గత ఏడాది ఓ మోస్తరు అంచనాల మధ్య…