ఎల్లుండి కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా మీడియాతో పాటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ది రాజా సాబ్ టీజర్ ని భారీ ఎత్తున లాంచ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు రెడీ అయ్యాయి. జాతీయ స్థాయిలో పేరున్న జర్నలిస్టులను ప్రత్యేకంగా ఆహ్వానించి హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ బిగ్ స్క్రీన్ మీద దీన్ని ప్రదర్శించబోతున్నారు. యూనిట్ నుంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు ప్రతి ఒక్కరు హాజరు కాబోతున్నారు. ఫౌజీ షూటింగ్ వల్ల ప్రభాస్ అందుబాటులో లేకపోవడంతో హాజరు అనుమానంగానే ఉంది. ఒకవేళ వస్తే స్వీట్ సర్ప్రైజ్ కావొచ్చు. ఇక పర్ఫెక్ట్ స్కెచ్ ఎందుకు అవుతుందో చూద్దాం.
వాయిదాల వల్ల రాజా సాబ్ మీద ముందున్న అంచనాల్లో మార్పులు వచ్చాయి. అందులోనూ దర్శకుడు మారుతీకి రాజమౌళి, నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్ రేంజ్ లో బ్రాండ్ ఇమేజ్ లేదు. పైగా దీనికి ముందు తీసినవి ఫ్లాపులు. కాబట్టి కంటెంట్ ఎంత ఎక్స్ ట్రాడినరిగా ఉందో ప్రపంచం మొత్తానికి ఒకేసారి చెప్పాలి. హైదరాబాద్, ముంబై, చెన్నైలో వేర్వేరుగా ఈవెంట్లను చేయడం కన్నా మీడియా మొత్తాన్ని ఒకేచోట చేర్చడం ద్వారా జరిగే ప్రమోషన్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోతుంది. పైగా ఆతిథ్యం విషయంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తీసుకుంటున్న జాగ్రత్తలు ఎలాంటి అసంతృప్తికి తావివ్వకుండా పక్కాగా సెట్ అవుతున్నాయట.
డిసెంబర్ 5 విడుదల కాబోతున్న ది రాజా సాబ్ బిజినెస్ లో టీజర్ చాలా కీలక పాత్ర పోషించనుంది. 2 నిమిషాల 2 సెకండ్ల వీడియో ద్వారా కొన్ని కోట్ల రూపాయల అదనపు పెట్టుబడులను డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఆశించవచ్చు. ముఖ్యంగా బాలీవుడ్ వర్గాలను విపరీతంగా ఆకట్టుకోవాలంటే ఈ స్ట్రాటజీ అవసరం. ఇన్ సైడ్ టాక్ ని బట్టి టీజర్ చాలా డిఫరెంట్ గా ఉందట. వింటేజ్ ప్రభాస్ ని రివీల్ చేయడంతో పాటు హారర్ ఎలిమెంట్స్ ఎలా ఉండబోతున్నాయనే క్లూ ఇచ్చిన తీరు చాలా బాగా వచ్చిందని అంటున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించిన రాజా సాబ్ కు తమన్ సంగీతం సమకూర్చాడు.
తెలుగు తమిళ భాషల్లో ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రదీప్ రంగనాధన్ వరస విజయాలకు బ్రేక్ వేస్తూ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ…
ఐపీఎల్ అంటేనే చివరి బంతి వరకు ఉండే ఉత్కంఠ. కానీ ఈసారి ఆ మజా పూర్తిగా తగ్గిపోయింది. పరుగుల వరద…
నిజామాబాద్లో నటరాజ్ అనే ఒక సింగిల్ స్క్రీన్. దాని లీజ్ మార్పు గొడవ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ ఎస్వీసీ…
ఏపీ అధికార పార్టీ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సంచలన ప్రకటన చేశారు. పార్టీలో యువతరాన్ని ఆకర్షించేందుకు..…
పాలన విషయంలో మంత్రి లోకేష్ పక్కా ప్లానింగ్తో వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాలను విధానపరమైన అంశాలను కలగాపులగం…
పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…