Movie News

హైదరాబాదీల ‘ఐమాక్స్’ ఆశలపై నీళ్ళు

దేశంలో తెలుగు రాష్ట్రాలను మించిన సినీ అభిమానం ఇంకెక్కడా ఉండదు అంటే అతిశయోక్తి కాదు. సినిమాలపై మన వాళ్లకు ఉన్న ప్రేమ గురించి ఇతర భాషల వాళ్లు కూడా గొప్పగా చెబుతారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నన్ని థియేటర్లు మరే రాష్ట్రంలోనూ లేవు. ఇలాంటి చోట ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. దాని కోసం మన సినీ అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వారి కల తీరబోతున్నట్లుగా నిర్మాత, ఎగ్జిబిటర్ సునీల్ నారంగ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 

తెలంగాణలో అనేక మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్లను కలిగి ఉన్న నారంగ్.. హైదరాబాద్‌లోని హకీంపేటలో భారీ ఐమాక్స్ స్క్రీన్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. ఇంకో రెండేళ్లలో అది అందుబాటులోకి వస్తుందని కూడా ఆయన వెల్లడించారు. దీంతో హైదరాబాదీ సినీ అభిమానులు ఎంతో ఎగ్జైట్ అయ్యారు. మనకూ ఐమాక్స్ స్క్రీన్ రాబోతోందని సోషల్ మీడియాలో చర్చలు పెట్టారు. కానీ వారి ఆశలపై కొన్ని రోజుల్లోనే నీళ్లు చల్లేశాడు ఐమాక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ప్రీతమ్ డేనియల్. హైదరాబాద్‌లో ఐమాక్స్ స్క్రీన్ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చను చూసి ప్రీతమ్ స్పందించాడు. ఈ వార్తలు నిజం కాదని ఆయన తేల్చేశాడు.

‘‘ఏషియన్ సినిమా ఐమాక్స్ స్క్రీన్‌ను హైదరాబాద్‌‌కు తీసుకువస్తున్నట్లు వార్తలు చూశాను. ఇది నిజం కాదు. హైదరాబాద్‌లో ఐమాక్స్ నిర్మాణం కోసం పలువురు ఎగ్జిబిటర్లతో సంప్రదింపులు జరిపాం. ఇందుకోసం మేం ఎంతో ఆసక్తితో ఉన్నాం. అవకాశాల కోసం చూస్తున్నాం. కానీ ఇప్పటిదాకా ఏ ఒప్పందం జరగలేదు’’ అని ప్రీతమ్ స్పష్టం చేశాడు. బహుశా ఐమాక్స్ కార్పొరేషన్‌తో సంప్రదింపులు జరుపుతున్న ఎగ్జిబిటర్లలో సునీల్ నారంగ్ కూడా ఒకరై ఉండొచ్చు. కానీ అగ్రిమెంట్ కాకుండా ఇలా ప్రకటన చేయడం పట్ల ఐమాక్స్ కార్పొరేషన్ అసహనంతో ఉండొచ్చు. ఈ ప్రకటనను బట్టి హైదరాబాద్‌కు ఐమాక్స్ స్క్రీన్ రాదని అనుకోవడానికి వీల్లేదు. సునీల్ నారంగ్ కావచ్చు. మరొకరు కావచ్చు. ఐమాక్స్ కార్పొరేషన్‌తో టై అప్ అయి వీలైనంత త్వరగా భారీ తెరను హైదరాబాద్‌కు తీసుకురావాలని ఇక్కడి సినీ అభిమానులు కోరుకుంటున్నారు.

Kumar

Recent Posts

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

5 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

6 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

8 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

9 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

10 hours ago

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…

11 hours ago