టాలీవుడ్ లో ప్రముఖ గాయని మంగ్లీ పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన పార్టీలో మద్యం, గంజాయి సేవించారని ఆరోపణలు రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. చేవెళ్లలోని ఓ రిసార్ట్ లో మంగ్లీ, తన మిత్రులు పార్టీ చేసుకుంటున్న సమయంలో లిక్కర్, గంజాయి సేవించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, పోలీసులు రిసార్ట్ లో రైడ్ చేస్తున్న సమయంలో వీడియోలు తీయవద్దంటూ విలేకరులను మంగ్లీ బెదిరించిన వైనం షాకింగ్ గా మారింది. ఈ పార్టీలో పాల్గొన్న 48 మందికి టెస్ట్ చేయగా..9 మంది గంజాయి సేవించినట్లు తేలింది. దీంతో, మంగ్లీ, రిసార్ట్ నిర్వాహకులు, ఈవెంట్ నిర్వాహకులపై కేసు నమోదైంది.
ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై మంగ్లీ తొలిసారి స్పందించారు. తన అమ్మా, నాన్న కోరిక మేరకు రిసార్ట్ లో పుట్టిన రోజు వేడుక జరుపుకున్నానని చెప్పారు. అయితే, పార్టీలో విదేశీ మద్యం, డ్రగ్స్ లేవని…ఆధారాలు లేకుండా అభియోగాలు మోపవద్దని అన్నారు. ఇక, పార్టీ సందర్భంగా సౌండ్ సిస్టం, లిక్కర్ కు పర్మిషన్ తీసుకోవాలని తనకు తెలియదని, ఎవరైనా చెప్పి ఉంటే పర్మిషన్ తీసుకునేదానినని అన్నారు. ఇది తెలియకుండా జరిగిన తప్పని చెప్పారు.
‘‘ఒక చిన్న ఇంట్లో పార్టీలాగా చేసుకున్నాం, మా అమ్మానాన్న, వారి ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్, నా క్రూ మెంబర్స్ ఉన్నారు… మా అమ్మానాన్నను పక్కనపెట్టుకొని డ్రగ్స్ వంటివి పార్టీలో ఉంచుతామా చెప్పండి’’ అని మంగ్లీ అన్నారు. పోలీసులకు కూడా ఆ ఆధారాలు దొరకలేదని, అసలు తాము డ్రగ్స్, ఫారెన్ లిక్కర్ వాడలేదని, కేవలం లోకల్ బ్రాండ్ మద్యం వాడామని చెప్పారు. కొద్ది రోజుల క్రితం గంజాయి, డ్రగ్స్ తీసుకున్న వ్యక్తులు తన పార్టీలో ఉన్నారని, వారికి టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చిందని పోలీసులు చెప్పారని, ఆ విషయంపై పోలీసులు మరింత విచారణ చేస్తున్నారని అన్నారు. సమాజంలో ఒక రోల్ మోడల్ గా, ఇన్ స్పిరేషన్ గా ఉండాలనుకుంటున్న తాను ఇటువంటి పనులు చేస్తానా అని ప్రశ్నించారు. దయచేసి నిరాధార ఆరోపణలు చేయవద్దని, ఆధారాలు లేకుండా అభియోగాలు మోపవద్దని మీడియాకు మంగ్లీ రిక్వెస్ట్ చేశారు.
This post was last modified on June 12, 2025 9:54 am
తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…