ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ ప్రొడ్యూసర్గా ఉన్న దిల్ రాజు.. తాను ప్రొడక్షన్లో ఎదగడానికి ఎం.ఎస్.రాజునే స్ఫూర్తి అని చెప్పారు. ఒకప్పుడు ఎం.ఎస్.రాజు అలాంటి సినిమాలు తీశారు మరి. శత్రువు, దేవి, మనసంతా నువ్వే, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి సినిమాలతో తిరుగులేని స్థాయిని అందుకున్నారాయన. రాజు ప్రొడక్షన్లో వచ్చే సినిమాలన్నింట్లోనూ ఒక అభిరుచి కనిపించేది. దర్శకులతో సమానంగా ఆయన పేరు సంపాదించాడు.
అలాంటి నిర్మాత తర్వాతి కాలంలో వరుస ఫ్లాపులతో కనుమరుగైపోయాడు. అలా ఆగిపోయినా సరిపోయేది కానీ.. రాజు మెగా ఫోన్ పట్టి డర్టీ హరి అనే సినిమా తీసి తన అభిమానులను ఆవేదనకు గురి చేస్తున్నాడు. పేరుకు తగ్గట్లే ఇందులో బోలెడంత డర్టీనెస్ కనిపిస్తుండటమే అందుక్కారణం.
ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ అన్నింట్లోనూ బూతు తప్ప ఇంకేమీ కనిపించలేదు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక పాట రిలీజ్ చేశారు. ఎప్పుడో బాలీవుడ్ బిగ్రేడ్ సినిమాల్లో చూసిన ఇంటిమేట్ సన్నివేశాల స్ఫూర్తి తప్ప ఇందులో ఏమీ కనిపించలేదు. కామంతో కటకటలాడిపోతున్న అమ్మాయి, అబ్బాయి.. ఎక్కడ పడితే అక్కడ.. చిత్ర విచిత్ర భంగిమల్లో శృంగార కార్యకలాపాల్లో మునిగిపోవడం.. తమ శృంగార కాంక్షను రకరకాల పద్ధతుల్లో వ్యక్తం చేయడం.. ఇది తప్ప పాటలో ఇంకేమీ లేదు.
మర్డర్ సహా అనేక బాలీవుడ్ సినిమాల్లో చూసిన ఇంటిమేట్ సీన్లను రాజు కాపీ కొట్టాడు. ఊరూ పేరు లేని ఏ దర్శకుడో ఇలాంటి సినిమాలు తీస్తే ఆశ్చర్యపోం కానీ.. ఒకప్పుడు అద్భుతమైన సినిమాలు అందించి గొప్ప అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు సంపాదించిన ఎం.ఎస్.రాజు నుంచి ఇలాంటి చిత్రం రావడమే ఆశ్చర్యం. తానేదో కళాఖండం తీసినట్లు ఈ పాట మధ్యలో క్యామియో కూడా చేశాడు రాజు.
This post was last modified on November 11, 2020 10:57 am
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…