Movie News

యూట్యూబ్ వ్యూస్ గుట్టు విప్పేసిన దిల్ రాజు

తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు చాలా ఓపెన్ అయ్యారు. కొన్ని విషయాల మీద కుండ బద్దలు కొట్టేశారు. యూట్యూబ్ వ్యూస్ ని కొనేసుకుని మిలియన్ల కొద్దీ చూశారనే ఫేక్ ప్రచారాలు ఇకపై ఆగాలని, డబ్బులు ఖర్చు పెట్టి ఇంత మందికి రీచ్ అయ్యిందని చెప్పుకోవడంలో అర్థం లేదని తేల్చి చెప్పారు. ఓసారి తన కుటుంబ సభ్యులు ఒక వీడియోకి పది మిలియన్ల వ్యూస్ వచ్చాయని ఆశ్చర్యపోతే, దాని వెనుక రహస్యం తెలిసిన వాడిగా ఏం చెప్పాలో తెలియక ఆగిపోయానని, అంతగా ఫేక్ ప్రచారాలకు ప్రొడ్యూసర్లు అలవాటు పడ్డారని గుట్టు విప్పేశారు. ఇది ఆలోచించాల్సిన విషయమే.

ఫ్యాన్స్ సంతృప్తి పరచడం కోసం ఇరవై నాలుగు గంటల్లో లేదా వారం రోజుల్లో ఇన్ని వ్యూస్ తో రికార్డులు బద్దలయ్యాయని చెప్పుకోవడానికి ప్రొడ్యూసర్లు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. డబ్బులు ఖర్చవ్వడంతో పాటు నెంబర్లు ఎప్పుడైనా ఎక్కువ తక్కువ వచ్చినా మళ్ళీ హీరోలకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ తలనెప్పి లేకుండా జెన్యూన్ గా ఎన్ని వ్యూస్ వస్తే అన్ని చూపించుకోవడం ఆరోగ్యకర పరిణామం. తమ్ముడుకి అదే ఫాలో అవుతానని దిల్ రాజు అంటున్నారు. అంతే కాదు ట్రైలర్ మీద నిజాయితీగా రియాక్షన్లు రావాలని కోరుకున్న రాజుగారు ఫేక్ ప్రాపగండా ఆగాలని, పొగడ్తలకు చెక్ పడాలని అన్నారు.

ఏదైతేనేం మొత్తానికి ఒక అగ్ర నిర్మాత నుంచి ఇలాంటి స్పందన రావడం ఆహ్వానించదగ్గదే. ఇకపై కలెక్షన్లలకు ప్రకటించే విషయంలో రెంట్రాక్ పద్దతి తీసుకొస్తామని, దీని వల్ల ఫేక్ నెంబర్లకు చెక్ పెట్టినట్టు అవుతుందని, దీనికి సంబంధించిన ప్రతిపాదన ఫిలిం ఛాంబర్ కు పంపించారని అన్నారు. ఇది నిజంగా అమలు కావాల్సిన చర్య. ఎందుకంటే స్టార్ హీరోల ఓపెనింగ్స్ గురించి నిర్మాతలు వేసుకుంటున్న నెంబర్లు భవిష్యత్తులో తప్పుడు సంకేతాలు ఇచ్చే దిశగా వెళ్తోంది. ఆఖరికి రీ రిలీజులకు సైతం ఈ పైత్యం మొదలైంది. దిల్ రాజు ప్రతిపాదించినట్టు  ఇవన్నీ జరిగితే కనక పరిశ్రమకు అంత కన్నా కావాల్సింది ఏముంది.

This post was last modified on June 11, 2025 10:02 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

23 minutes ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

39 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

1 hour ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

2 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

3 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

3 hours ago