బాలీవుడ్లో వినూత్న చిత్రాలతో మంచి పేరు సంపాదించిన దర్శకుడు వికాస్ బల్. అతను రూపొందించిన ‘క్వీన్’ ఒక సెన్సేషనే. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించడం అప్పటికి అదే తొలిసారి. ఈ చిత్రం దక్షిణాదిన నాలుగు భాషల్లో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. వికాస్ ఆ తర్వాత డైరెక్ట్ చేసిన పెద్ద సినిమా ‘సూపర్ 30’. హృతిక్ రోషన్ హీరోగా సూపర్ 30 వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం సైతం విమర్శల ప్రశంసలందుకుంది. బాక్సాఫీస్ హిట్టూ అయింది.
ఐతే ఈ సినిమా చేస్తుండగా ఓ అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొన్న వికాస్కు చిత్ర నిర్మాతలు షాకిచ్చారు. వికాస్ కూడా భాగస్వామి అయిన నిర్మాణ సంస్థ నుంచి తొలగించారు. వికాస్ లేకుండానే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరిగాయి.
ఇలా ఓ పేరున్న సినిమా నుంచి అర్ధంతరంగా ఓ దర్శకుడిని తప్పిస్తే జరిగే డ్యామేజీనే వేరు. కానీ వికాస్ మీద వచ్చినవి తీవ్ర ఆరోపణలు కావడం, దానిపై కేసు కూడా నడుస్తుండటంతో అతడి మిత్రుడే అయిన మరో నిర్మాత అనురాగ్ కశ్యప్ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు. దీంతో వికాస్ ఏడాదికి పైగా ఖాళీగా ఉండిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అతడికి అవకాశాలివ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఐతే ఎట్టకేలకు అతను ఓ అవకాశం అందుకున్నాడు.
ఇప్పటిదాకా కథా ప్రధానమైన వినూత్న చిత్రాలు రూపొందించిన వికాస్.. ఈసారి ఒక మాస్ మసాలా సినిమా చేయడానికి రెడీ అవుతుండటం విశేషం. ఆ చిత్రం పేరు.. గణ్పత్. యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ ఇందులో కథానాయకుడిగా నటించనున్నాడు. టైగర్కు మంచి పేరు తెచ్చిన ‘బాగి’ లాగే ఇది కూడా ఒక ఫ్రాంఛైజీగా కొనసాగనుంది. ఆరంభించడంతోనే ‘గణ్పత్- పార్ట్ 1’ అని ప్రకటించారు. ‘బాగి’ స్టయిల్లోనూ ఇది పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ అని మోషన్ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. మరి రూటు మార్చి సినిమా తీస్తున్న వికాస్కు ఈసారి ఎలాంటి ఫలితం అందుతుందో చూడాలి.
This post was last modified on November 11, 2020 8:34 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…