Movie News

ప్రేమలు అభిమానులకు సీక్వెల్ షాక్

చిన్న సినిమాగా పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై సంచలనం సృష్టించిన సినిమా ప్రేమలు. ఒక యువకుడి జీవితాన్ని, ప్రేమను తెరమీద ఆవిష్కరించిన తీరు యువతను బాగా ఆకట్టుకుంది. దర్శకుడు గిరీష్ ఏడి మీద ప్రశంసలు కురిశాయి. అయితే ప్రేమలు 2ని ఆ మధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా మల్లువుడ్ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడీ సీక్వెల్ కి బ్రేక్ వేశారట. మొదటి భాగంలో హీరోగా నటించిన నస్లెన్ కె గఫూర్ కు ఫైనల్ వెర్షన్ నచ్చనందు వల్ల ఇది చేయనని చెప్పడంతో నిర్మాతలు అయోమయంలో పడినట్టు సమాచారం. హీరోయిన్ మమిత బైజు రెడీగా ఉన్నా నస్లెన్ వల్ల పార్ట్ 2 రిస్క్ లో పడింది.

ఒకవేళ హీరోని మార్చి తీస్తే నెగటివ్ రియాక్షన్లు వస్తాయని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సచిన్ పాత్రలో నస్లెన్ చూపించిన అమాయకత్వం, నటన కంటెంట్ ని బాగా నిలబెట్టాయి. ఇప్పుడు వేరొకరిని తీసుకుంటే పోలికలతో లేనిపోని ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే కొన్నాళ్ళు ప్రేమలు 2కి బ్రేక్ వేసి కొత్త వెర్షన్ రాసుకున్నాక మళ్ళీ చర్చించుకుందామని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. కేరళ మీడియా మాత్రం అలాంటిదేం లేదని, కొంత ఆలస్యమైనా ఈ క్రేజీ సీక్వెల్ షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుందని అంటోంది. అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటిదాకా రాలేదు.

అచ్చం ఇదే సమస్య బాలీవుడ్ మూవీ హేరా ఫేరీ 3కి రావడం కొద్దిరోజుల క్రితం చూశాం. పరేష్ రావల్ తాను మూడో భాగంలో నటించనని తప్పుకోవడంతో అక్షయ్ కుమార్ ఏకంగా కోర్టుకు వెళ్లేందుకు సిద్ధ పడ్డాడు. సమస్యని ఏదో విధంగా పరిష్కరించేలా నిర్మాతలు ట్రై చేస్తున్నా ఇది జరిగే పనిలా కనిపించడం లేదని ముంబై టాక్. కొన్ని సీక్వెల్స్ కి కొందరు లేకుండా ఊహించలేం. ఉదాహరణకు బాహుబలి 2లో కన్నప్పగా సత్యరాజ్ బదులు వేరే ఆర్టిస్టు చేస్తే ఎలా ఉంటుంది. ఉహించుకోవడమూ కష్టమే. అందుకే ప్రేమలు 2 ఇదే ఇబ్బందిని గుర్తించి పెండింగ్ పెట్టిందట. త్వరలోనే దీనికి సంబంధించిన క్లారిటీ రావొచ్చు.

Kumar

Recent Posts

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

26 minutes ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

6 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

7 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

9 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

10 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

11 hours ago