చిన్న సినిమాగా పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై సంచలనం సృష్టించిన సినిమా ప్రేమలు. ఒక యువకుడి జీవితాన్ని, ప్రేమను తెరమీద ఆవిష్కరించిన తీరు యువతను బాగా ఆకట్టుకుంది. దర్శకుడు గిరీష్ ఏడి మీద ప్రశంసలు కురిశాయి. అయితే ప్రేమలు 2ని ఆ మధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా మల్లువుడ్ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడీ సీక్వెల్ కి బ్రేక్ వేశారట. మొదటి భాగంలో హీరోగా నటించిన నస్లెన్ కె గఫూర్ కు ఫైనల్ వెర్షన్ నచ్చనందు వల్ల ఇది చేయనని చెప్పడంతో నిర్మాతలు అయోమయంలో పడినట్టు సమాచారం. హీరోయిన్ మమిత బైజు రెడీగా ఉన్నా నస్లెన్ వల్ల పార్ట్ 2 రిస్క్ లో పడింది.
ఒకవేళ హీరోని మార్చి తీస్తే నెగటివ్ రియాక్షన్లు వస్తాయని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సచిన్ పాత్రలో నస్లెన్ చూపించిన అమాయకత్వం, నటన కంటెంట్ ని బాగా నిలబెట్టాయి. ఇప్పుడు వేరొకరిని తీసుకుంటే పోలికలతో లేనిపోని ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే కొన్నాళ్ళు ప్రేమలు 2కి బ్రేక్ వేసి కొత్త వెర్షన్ రాసుకున్నాక మళ్ళీ చర్చించుకుందామని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. కేరళ మీడియా మాత్రం అలాంటిదేం లేదని, కొంత ఆలస్యమైనా ఈ క్రేజీ సీక్వెల్ షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుందని అంటోంది. అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటిదాకా రాలేదు.
అచ్చం ఇదే సమస్య బాలీవుడ్ మూవీ హేరా ఫేరీ 3కి రావడం కొద్దిరోజుల క్రితం చూశాం. పరేష్ రావల్ తాను మూడో భాగంలో నటించనని తప్పుకోవడంతో అక్షయ్ కుమార్ ఏకంగా కోర్టుకు వెళ్లేందుకు సిద్ధ పడ్డాడు. సమస్యని ఏదో విధంగా పరిష్కరించేలా నిర్మాతలు ట్రై చేస్తున్నా ఇది జరిగే పనిలా కనిపించడం లేదని ముంబై టాక్. కొన్ని సీక్వెల్స్ కి కొందరు లేకుండా ఊహించలేం. ఉదాహరణకు బాహుబలి 2లో కన్నప్పగా సత్యరాజ్ బదులు వేరే ఆర్టిస్టు చేస్తే ఎలా ఉంటుంది. ఉహించుకోవడమూ కష్టమే. అందుకే ప్రేమలు 2 ఇదే ఇబ్బందిని గుర్తించి పెండింగ్ పెట్టిందట. త్వరలోనే దీనికి సంబంధించిన క్లారిటీ రావొచ్చు.
This post was last modified on June 11, 2025 2:04 pm
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…