నిన్న విడుదలైన అఖండ 2 తాండవం టీజర్ ఇరవై నాలుగు గంటలు తిరక్కుండానే 24 మిలియన్లకు పైగా వ్యూస్ తో కొత్త రికార్డుల వైపు పరుగులు పెడుతోంది. నిజానికీ వీడియో లాంచ్ అయిన కొన్ని గంటలు సోషల్ మీడియాలో కాస్త ట్రోలింగ్ కనిపించింది. బాలయ్య తలకు త్రిశూలం తిప్పుతూ రౌడీలను నరికే సీన్ మీద యాంటీ ఫ్యాన్స్ జోకులు వేసుకున్నారు. విశ్వంభరకొచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ దీనినీ వస్తుందదేమోననే అనుమానాలు లేకపోలేదు. కానీ వాస్తవంగా చెప్పాలంటే విఎఫ్ఎక్స్ క్వాలిటీ ఎలా ఉన్నా బాలయ్య ఫెరోషియస్ అవతారం లోటుపాట్లని కప్పేసి అంచనాలు పెంచేసింది.
దర్శకుడు బోయపాటి శీను పద్దతి మారదు. సింహా నుంచి స్కంద దాకా సిలబస్ ఒకటే. ఓవర్ ది బోర్డు హీరోయిజం తప్పకుండా ఉంటుంది. అతని మాస్ బాలయ్యకు వర్క్ అవుట్ అయినట్టుగా రామ్ చరణ్, రామ్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ల మీద పండలేదు. అందుకే పీక్స్ ఎలివేషన్లన్నీ బాలకృష్ణ మీదే రాసుకుంటాడు బోయపాటి. అఖండ 1లోనూ అలాంటి ఊర మాస్ ఎలివేషన్లు బోలెడున్నాయి. ఇప్పుడిది సీక్వెల్ కాబట్టి అంచనాలు దృష్టిలో ఉంచుకుని ఎలాంటి హద్దులైనా సరే చెరిపేయాలని బోయపాటి నిర్ణయించుకున్నాడు. దానికి తగ్గట్టే కేవలం నిమిషం వీడియోలోనే అంత అరాచకం సృష్టించాడు.
ఇదింకా శాంపిలే. అసలు సినిమాలో వేరే లెవెల్ స్టఫ్ ఇస్తాడు బోయపాటి. అవన్నీ ఫిజిక్స్ కి ఛాలెంజ్ చేసేలా ఉంటాయి. ట్రోలర్స్ కి అవకాశమూ ఇస్తాయి. కానీ ఫైనల్ గా తెరమీద చూస్తున్నప్పుడు ప్రేక్షకులు లీనమై వాటిని ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనేదే ఫలితాన్ని శాశిస్తుంది. బోయపాటి శీను దీన్ని బలంగా నమ్ముతాడు. సో అఖండ 2 రిలీజయ్యాక స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు చాలా హై వోల్టేజ్ యాక్షన్ కి ముందే ప్రిపేరవ్వాలి. డోస్ పెరగడమే కానీ తగ్గడం ఉండదు. సెప్టెంబర్ 25 విడుదలని చెప్పారు కానీ ఓజితో క్లాష్ దృష్ట్యా డేట్ మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ టాక్. ఇంకొన్ని వారాలయ్యాక స్పష్టత రావొచ్చు.
This post was last modified on June 10, 2025 10:32 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…