టాలీవుడ్ మరో బిగ్గెస్ట్ క్లాష్ కు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 25 నువ్వా నేనా అంటూ అఖండ 2, ఓజి రెండు కవ్వించుకోవడానికి సిద్ధపడటం బయ్యర్లను ఒకపక్క ఆనందానికి గురి చేస్తూనే ఇంకోవైపు ఆందోళన కలిగిస్తోంది. చాలా క్రేజ్ ఉన్న రెండు సినిమాలు కావడంతో ఓపెనింగ్స్ ప్రభావితం చెందుతాయని టెన్షన్ పడుతున్నారు. అందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే బాలయ్య, పవన్ కళ్యాణ్ కెరీర్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీస్ ఇవి. అభిమానుల్లోనే కాదు సగటు ప్రేక్షకుల్లోనూ వీటి మీద విపరీతమైన ఆసక్తి నెలకొంది. అలాంటప్పుడు ఒకరివల్ల మరొకరు ఎఫెక్ట్ అవ్వాలని కోరుకోరు.
ఇదిలా ఉండగా అఖండ 2, ఓజి రెండింటికి తమనే సంగీత దర్శకుడు. అఖండ మొదటి భాగం వచ్చిన టైంలో పలు థియేటర్లలో సౌండ్ బాక్సులు డ్యామేజ్ కావడం గురించి సోషల్ మీడియాలో వీడియోలు వచ్చాయి. యుఎస్ లో ఏకంగా బాస్ తగ్గించి మరీ షోలు వేయాల్సి వచ్చిందంటే విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అంతకు మించి అఖండ 2 ఉంటుందని తమన్ పలు సందర్భాల్లో చెబుతూ వచ్చాడు. ఫస్ట్ హాఫ్ కే పైసా వసూలు అయిపోతుందని, ఆపై చూసేదంతా బోనస్ అంటూ ఓ రేంజ్ లో ఊరించాడు. స్వయంగా బాలయ్యే నందమూరి తమన్ అని నామకరణం చేయడం తెలిసిందే.
ఇక ఓజిది మరో కథ. పవన్ కళ్యాణ్ కి గతంలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రోలు కంపోజ్ చేసినా అవన్నీ రీమేకులు కావడంతో తమన్ కు బెస్ట్ ఇచ్చే అవకాశం పూర్తి స్థాయిలో దొరకలేదు. కానీ ఇప్పుడు ఓజి అలా కాదు. నెక్స్ట్ లెవెల్ గ్యాంగ్ స్టర్ మాస్ ఇది. ఫ్యాన్స్ ఎంత ఆకలితో ఎదురు చూస్తున్నారో వర్ణించడం కష్టం. తమన్ కూడా పలు ఇంటర్వ్యూలలో మాములు ఎలివేషన్లు ఇవ్వలేదు. పాటలు విన్నవాళ్ళు చెబుతున్న వాళ్ళ ప్రకారం ఆల్బమ్ ఓ రేంజ్ లో వచ్చిందట. సో సెప్టెంబర్ 25 పక్క పక్క థియేటర్లలో అఖండ 2, ఓజి ఆడుతుంటే అవి చూసేవాళ్ళు తప్ప ఆ చుట్టపక్కకు ఇతరులు వెళ్ళకపోవడం సేఫ్.
This post was last modified on June 10, 2025 6:15 am
ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…