మంచు విష్ణు ప్యాన్ ఇండియా మూవీ కన్నప్పలో తండ్రి మోహన్ బాబుతో పాటు తన ముగ్గురు పిల్లలు నటిస్తున్న సంగతి తెలిసిందే. మనోజ్ ఎందుకు లేడనేది ఓపెన్ సీక్రెట్. అయితే మంచు లక్ష్మిని భాగం చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ ప్రస్తావన ఎవరూ తేవడం లేదు కానీ ఆ సందర్భమైతే వచ్చింది. ఒక ఈవెంట్ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన మంచు లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ కన్నప్పలో తాను ఎందుకు లేనో విష్ణునే అడగాలని, బహుశా తానుంటే ఇంకెవరు కనిపించరని కాబోలు అంటూ చమత్కరించింది. త్వరలోనే తను ది ట్రైటర్స్ అనే రియాలిటీ షోలో పాల్గొనేందుకు రెడీ అవుతోంది.
సో మంచు లక్ష్మి కన్నప్పలో ఎందుకు లేదనే క్లారిటీ వచేసినట్టేగా. నిజానికి అంత పెద్ద స్పాన్ ఉన్న కథలో ఏదో ఒక క్యారెక్టర్ ఇవ్వడం పెద్ద విషయం కాదు. అయినా పొందుపరిచలేదంటే ఏదైనా కారణం ఉందేమో. మనోజ్ కి మద్దతిస్తున్న కారణంగానే మంచు లక్ష్మి కన్నప్పకు దూరంగా ఉండాల్సి వచ్చిందేమోననే అనుమానం జనాల్లో లేకపోలేదు. ఉంటే కంప్లీట్ ఫ్యామిలీ పిక్చర్ అయ్యేదిగా. ప్రస్తుతం ఆవిడ ముంబైలోనే నివాసం ఉంటున్నారు. ఏదైనా ప్రమోషన్ లేదా ప్రోగ్రాం ఉంటే తప్ప భాగ్యనగరంలో కనిపించడం లేదు. ఇప్పుడు కూడా ఈవెంట్ ఉంది కాబట్టి మీడియా మైకు ముందుకొచ్చి ఓ రెండు మాటలు చెప్పింది.
జూన్ 27 విడుదల కాబోతున్న కన్నప్పకు సర్వం సిద్ధం చేసి ఉంచారు. విష్ణు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. కంటెంట్ మీద నమ్మకంతో థియేటర్లలో కన్నప్ప వచ్చాకే ఓటిటి డీల్ చేసుకుందామని చెప్పి పంపడం ఇప్పటికే హాట్ టాపిక్ అయ్యింది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ డివోషనల్ డ్రామాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే గుంటూరులో జరిగింది. హైదరాబాద్ లో ఒక వేడుక ప్లాన్ చేసి దానికి ప్రభాస్ ని తీసుకురావాలనే ప్రయత్నాల్లో విష్ణు ఉన్నాడు. ఎంతమేరకు సఫలీకృతమవుతాడో షూటింగ్స్ లో బిజీగా ఉన్న డార్లింగ్ డేట్స్ ని బట్టి ఉంటుంది.
This post was last modified on June 9, 2025 12:01 pm
టాలెంట్, రూపం రెండూ ఉన్న నటుడు ఆది పినిశెట్టి. మొదట హీరోగా పరిచయమైనా సరైనోడులో విలన్ గా మెప్పించాక ఒక్కసారిగా…
ఇప్పుడు పాడటం లేదు కానీ ఇరవై సంవత్సరాల క్రితం తెలుగు సంగీతంలో పాప్ మ్యూజిక్ అనే ఒరవడి తేవడంలో గాయని…
ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్లైన్ను మళ్లీ…
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…