మంచు విష్ణు ప్యాన్ ఇండియా మూవీ కన్నప్పలో తండ్రి మోహన్ బాబుతో పాటు తన ముగ్గురు పిల్లలు నటిస్తున్న సంగతి తెలిసిందే. మనోజ్ ఎందుకు లేడనేది ఓపెన్ సీక్రెట్. అయితే మంచు లక్ష్మిని భాగం చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ ప్రస్తావన ఎవరూ తేవడం లేదు కానీ ఆ సందర్భమైతే వచ్చింది. ఒక ఈవెంట్ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన మంచు లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ కన్నప్పలో తాను ఎందుకు లేనో విష్ణునే అడగాలని, బహుశా తానుంటే ఇంకెవరు కనిపించరని కాబోలు అంటూ చమత్కరించింది. త్వరలోనే తను ది ట్రైటర్స్ అనే రియాలిటీ షోలో పాల్గొనేందుకు రెడీ అవుతోంది.
సో మంచు లక్ష్మి కన్నప్పలో ఎందుకు లేదనే క్లారిటీ వచేసినట్టేగా. నిజానికి అంత పెద్ద స్పాన్ ఉన్న కథలో ఏదో ఒక క్యారెక్టర్ ఇవ్వడం పెద్ద విషయం కాదు. అయినా పొందుపరిచలేదంటే ఏదైనా కారణం ఉందేమో. మనోజ్ కి మద్దతిస్తున్న కారణంగానే మంచు లక్ష్మి కన్నప్పకు దూరంగా ఉండాల్సి వచ్చిందేమోననే అనుమానం జనాల్లో లేకపోలేదు. ఉంటే కంప్లీట్ ఫ్యామిలీ పిక్చర్ అయ్యేదిగా. ప్రస్తుతం ఆవిడ ముంబైలోనే నివాసం ఉంటున్నారు. ఏదైనా ప్రమోషన్ లేదా ప్రోగ్రాం ఉంటే తప్ప భాగ్యనగరంలో కనిపించడం లేదు. ఇప్పుడు కూడా ఈవెంట్ ఉంది కాబట్టి మీడియా మైకు ముందుకొచ్చి ఓ రెండు మాటలు చెప్పింది.
జూన్ 27 విడుదల కాబోతున్న కన్నప్పకు సర్వం సిద్ధం చేసి ఉంచారు. విష్ణు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. కంటెంట్ మీద నమ్మకంతో థియేటర్లలో కన్నప్ప వచ్చాకే ఓటిటి డీల్ చేసుకుందామని చెప్పి పంపడం ఇప్పటికే హాట్ టాపిక్ అయ్యింది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ డివోషనల్ డ్రామాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే గుంటూరులో జరిగింది. హైదరాబాద్ లో ఒక వేడుక ప్లాన్ చేసి దానికి ప్రభాస్ ని తీసుకురావాలనే ప్రయత్నాల్లో విష్ణు ఉన్నాడు. ఎంతమేరకు సఫలీకృతమవుతాడో షూటింగ్స్ లో బిజీగా ఉన్న డార్లింగ్ డేట్స్ ని బట్టి ఉంటుంది.
This post was last modified on June 9, 2025 12:01 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…