మంచు విష్ణు ప్యాన్ ఇండియా మూవీ కన్నప్పలో తండ్రి మోహన్ బాబుతో పాటు తన ముగ్గురు పిల్లలు నటిస్తున్న సంగతి తెలిసిందే. మనోజ్ ఎందుకు లేడనేది ఓపెన్ సీక్రెట్. అయితే మంచు లక్ష్మిని భాగం చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ ప్రస్తావన ఎవరూ తేవడం లేదు కానీ ఆ సందర్భమైతే వచ్చింది. ఒక ఈవెంట్ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన మంచు లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ కన్నప్పలో తాను ఎందుకు లేనో విష్ణునే అడగాలని, బహుశా తానుంటే ఇంకెవరు కనిపించరని కాబోలు అంటూ చమత్కరించింది. త్వరలోనే తను ది ట్రైటర్స్ అనే రియాలిటీ షోలో పాల్గొనేందుకు రెడీ అవుతోంది.
సో మంచు లక్ష్మి కన్నప్పలో ఎందుకు లేదనే క్లారిటీ వచేసినట్టేగా. నిజానికి అంత పెద్ద స్పాన్ ఉన్న కథలో ఏదో ఒక క్యారెక్టర్ ఇవ్వడం పెద్ద విషయం కాదు. అయినా పొందుపరిచలేదంటే ఏదైనా కారణం ఉందేమో. మనోజ్ కి మద్దతిస్తున్న కారణంగానే మంచు లక్ష్మి కన్నప్పకు దూరంగా ఉండాల్సి వచ్చిందేమోననే అనుమానం జనాల్లో లేకపోలేదు. ఉంటే కంప్లీట్ ఫ్యామిలీ పిక్చర్ అయ్యేదిగా. ప్రస్తుతం ఆవిడ ముంబైలోనే నివాసం ఉంటున్నారు. ఏదైనా ప్రమోషన్ లేదా ప్రోగ్రాం ఉంటే తప్ప భాగ్యనగరంలో కనిపించడం లేదు. ఇప్పుడు కూడా ఈవెంట్ ఉంది కాబట్టి మీడియా మైకు ముందుకొచ్చి ఓ రెండు మాటలు చెప్పింది.
జూన్ 27 విడుదల కాబోతున్న కన్నప్పకు సర్వం సిద్ధం చేసి ఉంచారు. విష్ణు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. కంటెంట్ మీద నమ్మకంతో థియేటర్లలో కన్నప్ప వచ్చాకే ఓటిటి డీల్ చేసుకుందామని చెప్పి పంపడం ఇప్పటికే హాట్ టాపిక్ అయ్యింది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ డివోషనల్ డ్రామాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే గుంటూరులో జరిగింది. హైదరాబాద్ లో ఒక వేడుక ప్లాన్ చేసి దానికి ప్రభాస్ ని తీసుకురావాలనే ప్రయత్నాల్లో విష్ణు ఉన్నాడు. ఎంతమేరకు సఫలీకృతమవుతాడో షూటింగ్స్ లో బిజీగా ఉన్న డార్లింగ్ డేట్స్ ని బట్టి ఉంటుంది.
This post was last modified on June 9, 2025 12:01 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…