సౌత్ ఇండియన్ లెజెండరీ నటీమణుల్లో శోభన ఒకరు. 80వ దశకం నుంచి సినిమాల్లో నటిస్తూ ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారామె. ‘మణిచిత్రతాళు’ సహా ఆమె అద్భుత అభినయానికి ఉదాహరణగా నిలిచే సినిమాలు చాలానే ఉన్నాయి. మాతృభాష మలయాళం అయినా.. తెలుగు, తమిళం, హిందీ.. ఇలా అనేక భాషల్లో నటించి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు శోభన. అలాంటి నటిని ఓ సినిమా సెట్లో చేదు అనుభవం ఎదురైందట. షూటింగ్ జరుగుతున్న చోట పెద్ద సంఖ్యలో జనం ఉండగా.. చెట్టు వెనక్కి వెళ్లి దుస్తులు మార్చుకోమని ఆమెకు చెప్పారట. ఇది అమితాబ్ బచ్చన్ పక్కన తాను జోడీగా నటించిన సినిమా సందర్భంగా జరిగినట్లు ఆమె తెలిపారు. ఐతే ఆ సమయంలో అమితాబ్ జోక్యం చేసుకుని ఇబ్బందిని సరి చేసినట్లు ఆమె వెల్లడించారు. ఈ అనుభవం గురించి శోభన ఏమన్నారంటే..
‘‘అమితాబ్ ఎంతో మంచి వ్యక్తి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన ఏమీ మారలేదు. గొప్ప మానవత్వం ఉన్న వ్యక్తి ఆయన. నేను ఇటీవల ఆయనతో కలిసి ‘కల్కి’ సినిమా చేశాను. దీని కంటే ముందు చాలా ఏళ్ల కిందట ఆయన పక్కన కథానాయికగా నటించాను. ఆ సినిమా కోసం ఒక పాట చేశాం. అందులో భాగంగా నేను చాలాసార్లు దుస్తులు మార్చుకోవాల్సి వచ్చింది. ఆ పాట చిత్రీకరణ అహ్మదాబాద్లో జరుగుతుండగా.. అమితాబ్ గారిని చూసేందుకు చాలామంది అభిమానులు వచ్చారు.
వాళ్లంతా అక్కడ ఉండగా.. నేను డ్రెస్ మార్చుకోవడం కోసం కారవాన్ ఎక్కడ అని అడిగాను. దీంతో టీం సభ్యుల్లో ఒకరు.. ‘ఆమె కేరళ నుంచి వచ్చింది. అక్కడి వాళ్లు దేనికైనా సర్దుకుపోతారు. ఆమె చెట్టు వెనక్కి వెళ్లి దుస్తులు మార్చకుంటుందిలే’ అన్నారు. ఆ మాటను వాకీ టాకీ ద్వారా అమితాబ్ బచ్చన్ విన్నారు. తన కారవాన్ నుంచి బయటికి వచ్చి ఆ వ్యక్తి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత తన కారవాన్ నాకు ఇచ్చారు. ఇప్పటికీ ఆయనేమీ మారలేదు. ‘కల్కి’ కోసం అమితాబ్తో మరోసారి కలిసి పని చేశాను. ఎవరైనా తన దగ్గరికి వస్తే లేచి నిల్చుని విష్ చేసేవారు. మీరు అలా చేయాల్సిన అవసరం లేదన్నా వినేవారు కాదు’’ అని శోభన వెల్లడించింది.
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…