తాజాగా తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్న సుధాకర్ ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్నాయి. రెండేళ్లకు మూడు సంవత్సరాలకు ఒక సినిమా తీస్తున్న హీరోలను దుయ్యబట్టిన తీరు, పరిస్థితి ఇలాగే కొనసాగితే సింగల్ స్క్రీన్లు మూతబడి ఫంక్షన్ హాల్స్, గౌడౌనులుగా మారిపోయే ప్రమాదాన్ని వర్ణించిన విధానం హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల షేర్ వసూలు చేయలేని ఒక హీరోకు పిలిచి మరీ పదమూడు కోట్ల పారితోషికం ఎలా ఇస్తారంటూ పేర్లు ప్రస్తావించకుండా ఆగ్రహం వ్యక్తం చేయడం మీడియాను ఆశ్చర్యపరిచింది.
ఇప్పటిదాకా అయిదు నెలల్లో కేవలం మూడు సినిమాలు మాత్రలు లాభాలు ఇచ్చాయని అవి సంక్రాంతికి వస్తున్నాం, మ్యాడ్ స్క్వేర్, కోర్ట్ అని మిగిలినవన్నీ డిజాస్టర్లని తేల్చేసిన సుధాకర్ ఒకరకంగా షాక్ ఇచ్చారనే చెప్పాలి. ఎందుకంటే డాకు మహారాజ్, తండేల్, హిట్ 3 ది థర్డ్ కేస్, సింగిల్ లాంటి సినిమాలు కమర్షియల్ గా వర్కౌట్ అయినవే. వీటిని ఏ కోణంలోనూ ఫ్లాప్స్ గా చూడలేం. బ్రేక్ ఈవెన్ – లాభనష్టాలు కొన్ని ఏరియాల్లో కొంచెం హెచ్చుతగ్గులు ఉండొచ్చేమో కానీ వర్కౌట్ అయిన మాట వాస్తవం. హిట్ 3 గురించి మాత్రం ట్రేడ్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్న విషయాన్ని కొట్టిపారేయలేం.
ఈ లెక్కల సంగతి పక్కనపెడితే హీరోలు వేగం పెంచడం గురించి చర్చించిన అంశం మాత్రం సీరియస్ గా ఆలోచించాల్సిందే. థియేటర్ ఫీడింగ్ కు సరైన సినిమాలు లేక నెలల తరబడి థియేటర్ మెయింటెనెన్సులు ఎగ్జిబిటర్లకు భారంగా మారాయి. గత రెండు మూడు వారాల నుంచి పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. హరిహర వీరమల్లు లాంటి పరిణామాలు గాయం మీద కారం చల్లినట్టు అవుతోంది. స్నాక్స్ ధరలు, హీరోల స్పీడ్, టికెట్ రేట్లు తదితరాల సంగతి ఎలా ఉన్నా కంటెంట్ లో క్వాలిటీ ఉంటే జనాలు ఖచ్చితంగా ఆదరిస్తారని ఎన్నోసార్లు ఋజువయ్యింది. హీరోలు దర్శకులు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఇదే.
This post was last modified on June 7, 2025 10:56 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…