యువ కథానాయకుడు నితిన్కు చాలా కాలంగా బాక్సాఫీస్ దగ్గర అస్సలు కలిసి రావడం లేదు. ఎప్పుడో 2020లో వచ్చిన ‘భీష్మ’ తన చివరి హిట్. ఆ తర్వాత నితిన్ నుంచి అరజడను సినిమాలొచ్చాయి. వాటిలో ఏదీ విజయవంతం కాలేదు. లేటెస్ట్గా ‘రాబిన్ హుడ్’ చిత్రంతో గట్టి ఎదురు దెబ్బ తిన్నాడు నితిన్. అతడి సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్కు కూడా వరుసగా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. నితిన్ హీరోగా ఈ సంస్థలో నిర్మించిన ‘మాచర్ల నియోజకవర్గం’; ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి. తాజాగా ఆ సంస్థ ఓ పెద్ద తమిళ చిత్రాన్ని తెలుగులో పంపిణీ చేసింది. ఆ చిత్రమే.. థగ్ లైఫ్.
ఇంతకుముందు కమల్ హాసన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ‘విక్రమ్’ చిత్రాన్ని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసి మంచి లాభాలు అందుకున్నాడు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి. ఆ ఉత్సాహంలో కమల్ సొంత చిత్రమైన ‘థగ్ లైఫ్’ తెలుగు హక్కులను భారీ రేటుకు కొని తెలుగులో రిలీజ్ చేశారు. ఇది మణిరత్నం డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో తెలుగులో మంచి బజ్యే క్రియేట్ అయింది. ఇటీవలి బాక్సాఫీస్ స్లంప్ కారణంగానో ఏమో.. అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా కనిపించలేదు. అయినా టాక్ బాగుంటే సినిమా పుంజుకుంటుందని ఆశించారు.
కానీ ‘థగ్ లైఫ్’ కు బ్యాడ్ టాక్ రావడంతో సినిమా తొలి రోజే బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. మ్యాట్నీల నుంచే జనం పలుచబడిపోయారు. తొలి రోజు ‘థగ్ లైఫ్’ తెలుగులో కోటి రూపాయల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ సినిమా తెలుగు హక్కులను నితిన్ తండ్రి రూ.18 కోట్లకు తీసుకోవడం గమనార్హం. అందులో పదో వంతు కూడా తొలి రోజు వసూలు కాలేదు. వీకెండ్ వసూళ్లే అత్యంత కీలకం కాగా.. సినిమా అప్పుడే డౌన్ అయిపోయింది. దీంతో ఫుల్ రన్లో పెట్టుబడిలో నాలుగో వంతు అయినా వస్తుందా అన్నది సందేహంగా మారింది. అసలే నితిన్కు హీరోగా వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్న సమయంలో ఇది తన కుటుంబానికి పెద్ద షాకే.
This post was last modified on June 7, 2025 6:02 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…