మోహన్ లాల్ లాంటి పెద్ద స్టార్ నటించిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ దృశ్యం-2ను సెప్టెంబరు చివరి వారంలో మొదలుపెట్టి నవంబరు తొలి వారానికి పూర్తి చేసి సంచలనం సృష్టించాడు దర్శకుడు జీతు జోసెఫ్. కరోనా టైంలో ఇంత పెద్ద సినిమాను ఇంత త్వరగా పూర్తి చేయడం అనూహ్యమే. ఇప్పుడు మరో పేరున్న సినిమాను మొదలుపెట్టిన రెండు నెలల్లోపే ముగించేశారు.
ఆ చిత్రమే.. గమనం. శ్రియ సరన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కింది. సెప్టెంబరు రెండో వారంలో ఈ సినిమాను అనౌన్స్ చేశారు. అప్పుడే చిత్రీకరణ కూడా మొదలుపెట్టారు. రెండు నెలలు తిరక్కుండానే సినిమాను పూర్తి చేయడమే కాదు.. ట్రైలర్ కూడా రెడీ చేసేయడం విశేషం.
ఈ సినిమా ట్రైలర్ను నవంబరు 11న ఉదయం 9 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు ట్రైలర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతులమీదుగా విడుదల కానుండటం విశేషం. కన్నడ, తమిళం, హిందీ, మలయాళం ట్రైలర్లు వరుసగా శివరాజ్ కుమార్, జయం రవి, సోనూ సూద్, ఫాహద్ ఫాజిల్ రిలీజ్ చేయబోతున్నారు.
సుజనా రావు అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రియదే లీడ్ రోల్. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ. ఈ చిత్రానికి మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందించాడు. క్రిష్ ఆస్థాన సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ ‘గమనం’కు ఛాయాగ్రహణం సమకూర్చడంతో పాటు నిర్మాణ భాగస్వామిగానూ వ్యవహరించనున్నాడు. స్టార్ రైటర్ సాయిమాధవ్ బుర్రా మాటలు అందించాడు. శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ కీలక పాత్రలు పోషించారీ చిత్రంలో.
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…