మోహన్ లాల్ లాంటి పెద్ద స్టార్ నటించిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ దృశ్యం-2ను సెప్టెంబరు చివరి వారంలో మొదలుపెట్టి నవంబరు తొలి వారానికి పూర్తి చేసి సంచలనం సృష్టించాడు దర్శకుడు జీతు జోసెఫ్. కరోనా టైంలో ఇంత పెద్ద సినిమాను ఇంత త్వరగా పూర్తి చేయడం అనూహ్యమే. ఇప్పుడు మరో పేరున్న సినిమాను మొదలుపెట్టిన రెండు నెలల్లోపే ముగించేశారు.
ఆ చిత్రమే.. గమనం. శ్రియ సరన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కింది. సెప్టెంబరు రెండో వారంలో ఈ సినిమాను అనౌన్స్ చేశారు. అప్పుడే చిత్రీకరణ కూడా మొదలుపెట్టారు. రెండు నెలలు తిరక్కుండానే సినిమాను పూర్తి చేయడమే కాదు.. ట్రైలర్ కూడా రెడీ చేసేయడం విశేషం.
ఈ సినిమా ట్రైలర్ను నవంబరు 11న ఉదయం 9 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు ట్రైలర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతులమీదుగా విడుదల కానుండటం విశేషం. కన్నడ, తమిళం, హిందీ, మలయాళం ట్రైలర్లు వరుసగా శివరాజ్ కుమార్, జయం రవి, సోనూ సూద్, ఫాహద్ ఫాజిల్ రిలీజ్ చేయబోతున్నారు.
సుజనా రావు అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రియదే లీడ్ రోల్. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ. ఈ చిత్రానికి మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందించాడు. క్రిష్ ఆస్థాన సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ ‘గమనం’కు ఛాయాగ్రహణం సమకూర్చడంతో పాటు నిర్మాణ భాగస్వామిగానూ వ్యవహరించనున్నాడు. స్టార్ రైటర్ సాయిమాధవ్ బుర్రా మాటలు అందించాడు. శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ కీలక పాత్రలు పోషించారీ చిత్రంలో.
This post was last modified on November 10, 2020 9:21 am
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…