మోహన్ లాల్ లాంటి పెద్ద స్టార్ నటించిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ దృశ్యం-2ను సెప్టెంబరు చివరి వారంలో మొదలుపెట్టి నవంబరు తొలి వారానికి పూర్తి చేసి సంచలనం సృష్టించాడు దర్శకుడు జీతు జోసెఫ్. కరోనా టైంలో ఇంత పెద్ద సినిమాను ఇంత త్వరగా పూర్తి చేయడం అనూహ్యమే. ఇప్పుడు మరో పేరున్న సినిమాను మొదలుపెట్టిన రెండు నెలల్లోపే ముగించేశారు.
ఆ చిత్రమే.. గమనం. శ్రియ సరన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కింది. సెప్టెంబరు రెండో వారంలో ఈ సినిమాను అనౌన్స్ చేశారు. అప్పుడే చిత్రీకరణ కూడా మొదలుపెట్టారు. రెండు నెలలు తిరక్కుండానే సినిమాను పూర్తి చేయడమే కాదు.. ట్రైలర్ కూడా రెడీ చేసేయడం విశేషం.
ఈ సినిమా ట్రైలర్ను నవంబరు 11న ఉదయం 9 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు ట్రైలర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతులమీదుగా విడుదల కానుండటం విశేషం. కన్నడ, తమిళం, హిందీ, మలయాళం ట్రైలర్లు వరుసగా శివరాజ్ కుమార్, జయం రవి, సోనూ సూద్, ఫాహద్ ఫాజిల్ రిలీజ్ చేయబోతున్నారు.
సుజనా రావు అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రియదే లీడ్ రోల్. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ. ఈ చిత్రానికి మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందించాడు. క్రిష్ ఆస్థాన సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ ‘గమనం’కు ఛాయాగ్రహణం సమకూర్చడంతో పాటు నిర్మాణ భాగస్వామిగానూ వ్యవహరించనున్నాడు. స్టార్ రైటర్ సాయిమాధవ్ బుర్రా మాటలు అందించాడు. శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ కీలక పాత్రలు పోషించారీ చిత్రంలో.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…