మోహన్ లాల్ లాంటి పెద్ద స్టార్ నటించిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ దృశ్యం-2ను సెప్టెంబరు చివరి వారంలో మొదలుపెట్టి నవంబరు తొలి వారానికి పూర్తి చేసి సంచలనం సృష్టించాడు దర్శకుడు జీతు జోసెఫ్. కరోనా టైంలో ఇంత పెద్ద సినిమాను ఇంత త్వరగా పూర్తి చేయడం అనూహ్యమే. ఇప్పుడు మరో పేరున్న సినిమాను మొదలుపెట్టిన రెండు నెలల్లోపే ముగించేశారు.
ఆ చిత్రమే.. గమనం. శ్రియ సరన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కింది. సెప్టెంబరు రెండో వారంలో ఈ సినిమాను అనౌన్స్ చేశారు. అప్పుడే చిత్రీకరణ కూడా మొదలుపెట్టారు. రెండు నెలలు తిరక్కుండానే సినిమాను పూర్తి చేయడమే కాదు.. ట్రైలర్ కూడా రెడీ చేసేయడం విశేషం.
ఈ సినిమా ట్రైలర్ను నవంబరు 11న ఉదయం 9 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు ట్రైలర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతులమీదుగా విడుదల కానుండటం విశేషం. కన్నడ, తమిళం, హిందీ, మలయాళం ట్రైలర్లు వరుసగా శివరాజ్ కుమార్, జయం రవి, సోనూ సూద్, ఫాహద్ ఫాజిల్ రిలీజ్ చేయబోతున్నారు.
సుజనా రావు అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రియదే లీడ్ రోల్. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ. ఈ చిత్రానికి మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందించాడు. క్రిష్ ఆస్థాన సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ ‘గమనం’కు ఛాయాగ్రహణం సమకూర్చడంతో పాటు నిర్మాణ భాగస్వామిగానూ వ్యవహరించనున్నాడు. స్టార్ రైటర్ సాయిమాధవ్ బుర్రా మాటలు అందించాడు. శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ కీలక పాత్రలు పోషించారీ చిత్రంలో.
This post was last modified on November 10, 2020 9:21 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…