Movie News

శింబు తెలిసి పొరపాట్లు చేస్తున్నాడా

స్ట్రెయిట్ సినిమాలు చేయకపోయినా తెలుగు ప్రేక్షకులకు శింబు సుపరిచితుడే. మన్మథ లాంటి బ్లాక్ బస్టర్స్ తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఆ తర్వాత చాలా డబ్బింగ్ మూవీస్ వచ్చాయి కానీ ఒకటి రెండు తప్ప పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. అయితే గాయకుడిగా మంచు మనోజ్ నుంచి పవన్ కళ్యాణ్ దాకా కొందరు హీరోలకు పాటలు పాడటం వల్ల టాలీవుడ్ జనాలకు కనెక్ట్ అవుతూ వస్తున్నాడు. ఇటీవలే విడుదలైన థగ్ లైఫ్ లో మొదట ఆ పాత్రకు మణిరత్నం తీసుకున్నది దుల్కర్ సల్మాన్ ని. కానీ ఏవో కారణాల వల్ల కొంత కాలం తర్వాత ఆ ఛాన్స్ శింబుని వరించింది. ఫలితం ఏమయ్యిందో చూస్తున్నాం.

తాజాగా సూర్య డ్రాప్ చేసుకున్న వాడివాసల్ దర్శకుడు వెట్రిమారన్ తో చేతులు కలిపేందుకు శింబు నిర్ణయించుకున్నట్టు వస్తున్న చెన్నై రిపోర్ట్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి. ఒకరు వద్దనుకున్న వాటిని ఏరికోరి మరీ తీసుకుంటున్న శింబుకు ఫలితాలు రివర్స్ లో వస్తున్నాయి. వెట్రిమారన్ కు సూర్య నో చెప్పడానికి కారణాలున్నాయి. కథ ఎంత బాగా నచ్చినా, విపరీతంగా ప్రేమించినా రెండేళ్లకు పైగా షూటింగ్ టైం అడగటంతో అంత ఇవ్వలేక వద్దనుకున్నాడని కోలీవుడ్ టాక్. విడుదల పార్ట్ 1, 2 కోసం విజయ్ సేతుపతి తన రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా నెలల తరబడి కాల్ షీట్లు ఇవ్వాల్సి వచ్చింది. సూర్యకు అలా సాధ్యం కాదు.

మరి శింబు వెట్రిమారన్ తో తెలియక చేస్తున్నా తెలిసి చేస్తున్నా కల్ట్ డైరెక్టర్లతో అతని ప్రయాణం హిట్లను ఇవ్వలేకపోతోంది. థగ్ లైఫ్ చాలా కాస్ట్లీ మిస్టేక్ గా అభిమానులు భావిస్తున్నారు. ఇంత ఇమేజ్ ఉండి అర్థం పర్థం లేకుండా చనిపోయే క్యారెక్టర్ ఎందుకు ఒప్పుకున్నావని నిలదీస్తున్నారు. మణిరత్నం డైరెక్షన్లో నటించే అదృష్టం నవాబ్ తో తీరిపోయింది కాబట్టి థగ్ లైఫ్ కి నో చెప్పి ఉండాల్సిందనేది వాళ్ళ అభిప్రాయం. ఇదంతా ఏమో కానీ ఓజిలో తమన్ స్వరకల్పనలో ఒక పాట పాడిన శింబు దాని గురించి ఓ రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చాడు. అదెలా ఉండబోతోందోనని మ్యూజిక్ లవర్స్ ఎదురు చూస్తున్నారు.

This post was last modified on June 6, 2025 10:17 pm

Share

Recent Posts

బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్‌… `ప‌ర్స‌న‌లైజ్` అవుతున్న పార్టీలు!

రెండు జాతీయ పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్‌లో గ‌తానికి భిన్న‌మైన `వ్య‌క్తిపూజ` సాగుతోందా?.. అంటే ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఇందిర‌మ్మ హ‌యాంలో…

2 hours ago

టీడీపీకి ఓట్ల `ప్రాజెక్టులు`… త‌మ్ముళ్లు హ్యాపీ.. !

కీల‌క‌మైన రెండు సాగు, తాగునీటి ప్రాజెక్టుల‌కు సీఎం చంద్ర‌బాబు శ్రీకారం చుట్టారు. నిజానికి ఇవి ఏళ్ల త‌ర‌బ‌డి సాగుతున్న ప్రాజెక్టుల‌నే…

7 hours ago

దేశ‌వ్యాప్తంగా 288 మంది.. ఏపీలో ఐదుగురు.. ఏమ‌య్యారు?

దేశ‌వ్యాప్తంగా 288 మంది నేపాల్ వ‌ర‌ద‌ల్లో గ‌ల్లంత‌య్యార‌ని కేంద్ర ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించింది. మొత్తం 532 మంది ఆచూకీ క‌నిపించ‌కుండా…

8 hours ago

మృతదేహాల నుంచి నగల అపహరణ… నేపాల్‌లో అమానవీయం

నేపాల్ ప్రకృతి విపత్తుతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయి, మరెందరో గల్లంతైన విషాద సమయంలోనూ కొందరి దుర్మార్గం వెలుగుచూసింది. వరదల్లో…

8 hours ago

ఒకే రోజు 10 మంది… మూడు వారాల్లో 60 మంది శిశువుల మృతి

దేశంలో ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారింది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రైవేటు వైద్యుల దోపిడీ వెరసి సామాన్య ప్రజల ప్రాణాలకు గ్యారంటీ…

8 hours ago

సినిమా పోయినా… దిల్ రాజు సేఫేనట

కన్నడ అనువాద చిత్రమైన ‘టాక్సిక్’ ఇక్కడి టాప్ స్టార్ల సినిమాల లెవెల్లో భారీగా రిలీజైందంటే అందుకు ప్రధాన కారణం.. దిల్…

9 hours ago