లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. 38 ఏళ్ల కిందటే ‘నాయకన్’ లాంటి ఆల్ టైం క్లాసిక్ అందించిన దర్శకుడాయన. ఆ తర్వాత రోజా, బొంబాయి, సఖి, ఇద్దరు, యువ.. ఇలా ఎన్నో ఆణిముత్యాలను అందించిన ఘనుడాయన. ఐతే ఎలాంటి దర్శకుడికైనా ఒక దశ దాటాక పరాజయాలు రావడం సహజం. మణిరత్నం కూడా అందుకు మినహాయింపు కాలేకపోయారు. రావణ్, కడలి, చెలియా లాంటి చిత్రాలు ఆయనకు చేదు అనుభవం మిగిల్చాయి. ఐతే మణిరత్నం ఫ్లాప్ సినిమాలు తీస్తే తీసి ఉండొచ్చు కానీ.. ఆ చిత్రాలు ఏవీ ఆయన ఔట్ డేట్ అయిపోయాడు అనే ఫీలింగ్ మాత్రం కలిగించని మాట వాస్తవం.
‘చెలియా’ సినిమా పరమ బోరింగ్గా అనిపించినా.. దాన్ని ట్రెండీగానే తీశారు మణిరత్నం. ఇదేం ముతక కథ.. ఇవేం రొటీన్ సన్నివేశాలు అనిపించలేదు. ఆ తర్వాత ఆయన్నుంచి వచ్చిన ‘పొన్నియన్ సెల్వన్’లో కూడా అలాంటి ఫీలింగ్ కలగలేదు. కానీ ఇన్నేళ్ల కెరీర్లో మణిరత్నం ఔట్ డేట్ అయిపోయాడు అని ఆయన అభిమానులకు ఫస్ట్ టైం ఒక ఫీలింగ్ కలిగించిన సినిమా బహుశా ‘థగ్ లైఫ్’యేనేమో. తాను తీసిన ఫ్లాప్ సినిమాలతో కూడా గౌరవం సంపాదించుకున్న దర్శకుడాయన.
కొన్ని ఎపిసోడ్లలో అయినా మెరుపులు మెరిపించేవారు. కానీ ‘థగ్ లైఫ్’ మాత్రం అందుకు మినహాయింపు. ట్రైలర్ చూస్తే భలేగా అనిపించింది కానీ.. సినిమాగా మాత్రం ఇది తీవ్రంగా నిరాశపరిచింది. ఇండియన్ స్క్రీన్ మీద ఎన్నో సార్లు చూసి.. అరిగిపోయిన రొటీన్ గ్యాంగ్ స్టర్ డ్రామా కథను ఎంచుకుని.. దాన్ని అంతే రొటీన్ స్క్రీన్ ప్లేతో నడిపించి తన అభిమానులకు పెద్ద షాకే ఇచ్చాడు మణిరత్నం. ముఖ్యంగా సెకండాఫ్ చూస్తుంటే చాలామందికి ‘ఇండియన్-2’ గుర్తుకొచ్చింది. ఇంత రొటీన్గా, బోరింగ్గా సీన్లు ఎలా తీయగలిగారు అని ఆశ్చర్యం కలిగించింది. పూర్తిగా ఔట్ ఆఫ్ ఆర్డర్ అనిపించారు మణిరత్నం. దీంతో ఫ్యాన్స్ సైతం ఇక ఆయన సినిమాలు మానేస్తే మంచిదనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి.
This post was last modified on June 6, 2025 6:37 am
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…