లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. 38 ఏళ్ల కిందటే ‘నాయకన్’ లాంటి ఆల్ టైం క్లాసిక్ అందించిన దర్శకుడాయన. ఆ తర్వాత రోజా, బొంబాయి, సఖి, ఇద్దరు, యువ.. ఇలా ఎన్నో ఆణిముత్యాలను అందించిన ఘనుడాయన. ఐతే ఎలాంటి దర్శకుడికైనా ఒక దశ దాటాక పరాజయాలు రావడం సహజం. మణిరత్నం కూడా అందుకు మినహాయింపు కాలేకపోయారు. రావణ్, కడలి, చెలియా లాంటి చిత్రాలు ఆయనకు చేదు అనుభవం మిగిల్చాయి. ఐతే మణిరత్నం ఫ్లాప్ సినిమాలు తీస్తే తీసి ఉండొచ్చు కానీ.. ఆ చిత్రాలు ఏవీ ఆయన ఔట్ డేట్ అయిపోయాడు అనే ఫీలింగ్ మాత్రం కలిగించని మాట వాస్తవం.
‘చెలియా’ సినిమా పరమ బోరింగ్గా అనిపించినా.. దాన్ని ట్రెండీగానే తీశారు మణిరత్నం. ఇదేం ముతక కథ.. ఇవేం రొటీన్ సన్నివేశాలు అనిపించలేదు. ఆ తర్వాత ఆయన్నుంచి వచ్చిన ‘పొన్నియన్ సెల్వన్’లో కూడా అలాంటి ఫీలింగ్ కలగలేదు. కానీ ఇన్నేళ్ల కెరీర్లో మణిరత్నం ఔట్ డేట్ అయిపోయాడు అని ఆయన అభిమానులకు ఫస్ట్ టైం ఒక ఫీలింగ్ కలిగించిన సినిమా బహుశా ‘థగ్ లైఫ్’యేనేమో. తాను తీసిన ఫ్లాప్ సినిమాలతో కూడా గౌరవం సంపాదించుకున్న దర్శకుడాయన.
కొన్ని ఎపిసోడ్లలో అయినా మెరుపులు మెరిపించేవారు. కానీ ‘థగ్ లైఫ్’ మాత్రం అందుకు మినహాయింపు. ట్రైలర్ చూస్తే భలేగా అనిపించింది కానీ.. సినిమాగా మాత్రం ఇది తీవ్రంగా నిరాశపరిచింది. ఇండియన్ స్క్రీన్ మీద ఎన్నో సార్లు చూసి.. అరిగిపోయిన రొటీన్ గ్యాంగ్ స్టర్ డ్రామా కథను ఎంచుకుని.. దాన్ని అంతే రొటీన్ స్క్రీన్ ప్లేతో నడిపించి తన అభిమానులకు పెద్ద షాకే ఇచ్చాడు మణిరత్నం. ముఖ్యంగా సెకండాఫ్ చూస్తుంటే చాలామందికి ‘ఇండియన్-2’ గుర్తుకొచ్చింది. ఇంత రొటీన్గా, బోరింగ్గా సీన్లు ఎలా తీయగలిగారు అని ఆశ్చర్యం కలిగించింది. పూర్తిగా ఔట్ ఆఫ్ ఆర్డర్ అనిపించారు మణిరత్నం. దీంతో ఫ్యాన్స్ సైతం ఇక ఆయన సినిమాలు మానేస్తే మంచిదనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి.
This post was last modified on June 6, 2025 6:37 am
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…