టాలీవుడ్లో ఇప్పుడు విలన్ పాత్ర అంటే ముందుగా కనిపించే ఛాయిస్ జగపతిబాబే. ఒకప్పుడు హీరోగా అలరించిన ఆయన.. మధ్యలో ఫామ్ కోల్పోయి కొంత కాలం లైమ్ లైట్లో లేకుండా పోయారు కానీ.. ‘లెజెండ్’ సినిమాతో విలన్గా ఎంట్రీ ఇచ్చాక ఆయన దశ తిరిగిపోయింది. ఇక అప్పట్నుంచి స్టైలిష్ విలన్ పాత్రలతో చెలరేగిపోయారు. మధ్య మధ్యలో కొన్ని పాజిటివ్ పాత్రలు వేసినప్పటికీ.. జగపతి ఎక్కువగా పాపులర్ అయింది మాత్రం విలన్ పాత్రలతోనే.
మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్ల సినిమాల్లో ఆయన విలన్ పాత్రలు చేశారు. ఐతే ఈ మధ్య కొంచెం స్థాయి తగ్గించుకుని ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాలోనూ జగపతి విలన్ పాత్ర పోషించారు. ఆ చిత్రమే.. మిస్ ఇండియా.
‘మహానటి’తో కీర్తి ఇమేజ్ అమాంతం పెరిగిపోవడంతో ఆమె సినిమాలో విలన్ పాత్ర చేయడానికి ముందుకొచ్చారు జగపతి. కానీ ఈ సినిమా ఒప్పుకునే సమయానికి కీర్తికి ఉన్నంత సీన్ రిలీజయ్యే సమయానికి లేదు. ఆమె ఇమేజ్ దెబ్బ తింది. వరుస పరాజయాలు ఆమె రేంజ్ తగ్గించేశాయి. ‘మిస్ ఇండియా’ సినిమాతో ఆమె మరింత కిందికి పడింది. ఈ చిత్రంలో జగపతి విలనీ చేయబోతే అది కాస్తా కామెడీ అయిపోయింది. సినిమాకు ఆయన పాత్ర పెద్ద మైనస్ అయింది.
విశేషం ఏంటంటే.. ‘మిస్ ఇండియా’లో కీర్తికి విలన్గా నటించిన జగపతి.. ఆమె తర్వాతి సినిమాలో తన కోచ్ పాత్రలో కనిపించబోతుండటం విశేషం. ఆ సినిమానే.. గుడ్ లక్ సఖి. ఇందులో కీర్తి మారు మూల ప్రాంతానికి చెందిన గిరిజన యువతి పాత్రలో నటించనుంది. ఆ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి ఆర్చర్గా ఆమె ఎలా ఎదిగిందన్నది ఈ సినిమా కథ. ఆ యువతికి శిక్షణ ఇచ్చి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే స్ఫూర్తిదాయక కోచ్ పాత్రలో జగపతి నటించాడు. ఇలా వరుసగా రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఒక నటుడు విలన్గా, కోచ్గా నటించడం అరుదైన విషయమే. మరి విలన్గా తుస్సుమన్న జగపతి.. కోచ్గా ఆమెకెలాంటి ఫలితాన్నందిస్తాడో చూడాలి.
This post was last modified on November 8, 2020 6:41 pm
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…