టాలీవుడ్లో ఇప్పుడు విలన్ పాత్ర అంటే ముందుగా కనిపించే ఛాయిస్ జగపతిబాబే. ఒకప్పుడు హీరోగా అలరించిన ఆయన.. మధ్యలో ఫామ్ కోల్పోయి కొంత కాలం లైమ్ లైట్లో లేకుండా పోయారు కానీ.. ‘లెజెండ్’ సినిమాతో విలన్గా ఎంట్రీ ఇచ్చాక ఆయన దశ తిరిగిపోయింది. ఇక అప్పట్నుంచి స్టైలిష్ విలన్ పాత్రలతో చెలరేగిపోయారు. మధ్య మధ్యలో కొన్ని పాజిటివ్ పాత్రలు వేసినప్పటికీ.. జగపతి ఎక్కువగా పాపులర్ అయింది మాత్రం విలన్ పాత్రలతోనే.
మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్ల సినిమాల్లో ఆయన విలన్ పాత్రలు చేశారు. ఐతే ఈ మధ్య కొంచెం స్థాయి తగ్గించుకుని ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాలోనూ జగపతి విలన్ పాత్ర పోషించారు. ఆ చిత్రమే.. మిస్ ఇండియా.
‘మహానటి’తో కీర్తి ఇమేజ్ అమాంతం పెరిగిపోవడంతో ఆమె సినిమాలో విలన్ పాత్ర చేయడానికి ముందుకొచ్చారు జగపతి. కానీ ఈ సినిమా ఒప్పుకునే సమయానికి కీర్తికి ఉన్నంత సీన్ రిలీజయ్యే సమయానికి లేదు. ఆమె ఇమేజ్ దెబ్బ తింది. వరుస పరాజయాలు ఆమె రేంజ్ తగ్గించేశాయి. ‘మిస్ ఇండియా’ సినిమాతో ఆమె మరింత కిందికి పడింది. ఈ చిత్రంలో జగపతి విలనీ చేయబోతే అది కాస్తా కామెడీ అయిపోయింది. సినిమాకు ఆయన పాత్ర పెద్ద మైనస్ అయింది.
విశేషం ఏంటంటే.. ‘మిస్ ఇండియా’లో కీర్తికి విలన్గా నటించిన జగపతి.. ఆమె తర్వాతి సినిమాలో తన కోచ్ పాత్రలో కనిపించబోతుండటం విశేషం. ఆ సినిమానే.. గుడ్ లక్ సఖి. ఇందులో కీర్తి మారు మూల ప్రాంతానికి చెందిన గిరిజన యువతి పాత్రలో నటించనుంది. ఆ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి ఆర్చర్గా ఆమె ఎలా ఎదిగిందన్నది ఈ సినిమా కథ. ఆ యువతికి శిక్షణ ఇచ్చి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే స్ఫూర్తిదాయక కోచ్ పాత్రలో జగపతి నటించాడు. ఇలా వరుసగా రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఒక నటుడు విలన్గా, కోచ్గా నటించడం అరుదైన విషయమే. మరి విలన్గా తుస్సుమన్న జగపతి.. కోచ్గా ఆమెకెలాంటి ఫలితాన్నందిస్తాడో చూడాలి.
This post was last modified on November 8, 2020 6:41 pm
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…