రీఎంట్రీలో మాంచి జోరుమీదున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒకటికి ఐదు సినిమాలు లైన్లో పెట్టాడు. ఈ మధ్యే దసరా కానుకగా పవన్ కొత్త చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అది మలయాళ బ్లాక్బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’కు రీమేక్. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు చిత్రాల దర్శకుడు సాగర్.కె.చంద్ర రూపొందించనున్నాడు.
కాగా ఈ సినిమాకు ‘బిల్లా రంగా’ అనే టైటిల్ పెట్టబోతున్నట్లుగా ఈ మధ్య గట్టి ప్రచారం జరుగుతోంది. కానీ అది నిజమా కాదా అన్నది ఖరారవ్వలేదు కానీ.. ఈ సినిమాకు ఆ టైటిల్ ఎంతమాత్రం బాగుండదన్నది మెజారిటీ మాట. ఇంతకుముందు చిరంజీవి, మోహన్ బాబు నటించిన మల్టీస్టారర్ మూవీకి ‘బిల్లా రంగా’ అనే టైటిల్ పెట్టారు. అది మూడున్నర దశాబ్దాల కిందటి చిత్రం. ఆ సమయానికి ఆ టైటిల్ బాగానే అనిపించింది. కానీ ఇప్పుడు ఆ పేర్లు బాగా పాతబడిపోయాయి.
పైగా ‘అయ్యప్పనుం కోషీయుం’ కథ, అందులోని పాత్రల్ని బట్టి చూసినా ఈ టైటిల్ ఆ సినిమాకు సూటవ్వదు. పవన్ చేయబోయేది సీరియస్ పోలీస్ పాత్ర. ఇందులో మరో పాత్ర సైతం సీరియస్గానే ఉంటుంది. ఇద్దరూ ఉన్నత స్థాయి వ్యక్తుల్లా కనిపిస్తారు. అలాంటి పాత్రకు బిల్లా, రంగా అని పేర్లు పెట్టి సినిమాకు ఆ టైటిల్ పెడితే ఏమీ బాగుండదు. ఈ మాత్రం అవగాహన దర్శక నిర్మాతలకు లేకుండా ఉండదు. కాబట్టి ఈ చిత్రానికి ‘బిల్లా రంగా’ అనే టైటిల్ పెడతారనే ప్రచారం ఇక కట్టిపెట్టేస్తే మంచిది. నిజానికి ఈ టైటిల్తో మంచు మనోజ్, సాయిధరమ్ తేజ్ కలిసి మల్టీస్టారర్ చేయాలన్నది ప్లాన్. ఆ ఇద్దరూ ఆ దిశగా ఆసక్తి వ్యక్తం చేశారు కూడా. కాబట్టి వాళ్లకే ఆ టైటిల్ ఇచ్చేసి వేరే వాళ్లు దాని జోలికి వెళ్లకపోతే మంచిది.
This post was last modified on November 8, 2020 3:08 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…