రీఎంట్రీలో మాంచి జోరుమీదున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒకటికి ఐదు సినిమాలు లైన్లో పెట్టాడు. ఈ మధ్యే దసరా కానుకగా పవన్ కొత్త చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అది మలయాళ బ్లాక్బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’కు రీమేక్. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు చిత్రాల దర్శకుడు సాగర్.కె.చంద్ర రూపొందించనున్నాడు.
కాగా ఈ సినిమాకు ‘బిల్లా రంగా’ అనే టైటిల్ పెట్టబోతున్నట్లుగా ఈ మధ్య గట్టి ప్రచారం జరుగుతోంది. కానీ అది నిజమా కాదా అన్నది ఖరారవ్వలేదు కానీ.. ఈ సినిమాకు ఆ టైటిల్ ఎంతమాత్రం బాగుండదన్నది మెజారిటీ మాట. ఇంతకుముందు చిరంజీవి, మోహన్ బాబు నటించిన మల్టీస్టారర్ మూవీకి ‘బిల్లా రంగా’ అనే టైటిల్ పెట్టారు. అది మూడున్నర దశాబ్దాల కిందటి చిత్రం. ఆ సమయానికి ఆ టైటిల్ బాగానే అనిపించింది. కానీ ఇప్పుడు ఆ పేర్లు బాగా పాతబడిపోయాయి.
పైగా ‘అయ్యప్పనుం కోషీయుం’ కథ, అందులోని పాత్రల్ని బట్టి చూసినా ఈ టైటిల్ ఆ సినిమాకు సూటవ్వదు. పవన్ చేయబోయేది సీరియస్ పోలీస్ పాత్ర. ఇందులో మరో పాత్ర సైతం సీరియస్గానే ఉంటుంది. ఇద్దరూ ఉన్నత స్థాయి వ్యక్తుల్లా కనిపిస్తారు. అలాంటి పాత్రకు బిల్లా, రంగా అని పేర్లు పెట్టి సినిమాకు ఆ టైటిల్ పెడితే ఏమీ బాగుండదు. ఈ మాత్రం అవగాహన దర్శక నిర్మాతలకు లేకుండా ఉండదు. కాబట్టి ఈ చిత్రానికి ‘బిల్లా రంగా’ అనే టైటిల్ పెడతారనే ప్రచారం ఇక కట్టిపెట్టేస్తే మంచిది. నిజానికి ఈ టైటిల్తో మంచు మనోజ్, సాయిధరమ్ తేజ్ కలిసి మల్టీస్టారర్ చేయాలన్నది ప్లాన్. ఆ ఇద్దరూ ఆ దిశగా ఆసక్తి వ్యక్తం చేశారు కూడా. కాబట్టి వాళ్లకే ఆ టైటిల్ ఇచ్చేసి వేరే వాళ్లు దాని జోలికి వెళ్లకపోతే మంచిది.
This post was last modified on November 8, 2020 3:08 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…