రీఎంట్రీలో మాంచి జోరుమీదున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒకటికి ఐదు సినిమాలు లైన్లో పెట్టాడు. ఈ మధ్యే దసరా కానుకగా పవన్ కొత్త చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అది మలయాళ బ్లాక్బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’కు రీమేక్. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు చిత్రాల దర్శకుడు సాగర్.కె.చంద్ర రూపొందించనున్నాడు.
కాగా ఈ సినిమాకు ‘బిల్లా రంగా’ అనే టైటిల్ పెట్టబోతున్నట్లుగా ఈ మధ్య గట్టి ప్రచారం జరుగుతోంది. కానీ అది నిజమా కాదా అన్నది ఖరారవ్వలేదు కానీ.. ఈ సినిమాకు ఆ టైటిల్ ఎంతమాత్రం బాగుండదన్నది మెజారిటీ మాట. ఇంతకుముందు చిరంజీవి, మోహన్ బాబు నటించిన మల్టీస్టారర్ మూవీకి ‘బిల్లా రంగా’ అనే టైటిల్ పెట్టారు. అది మూడున్నర దశాబ్దాల కిందటి చిత్రం. ఆ సమయానికి ఆ టైటిల్ బాగానే అనిపించింది. కానీ ఇప్పుడు ఆ పేర్లు బాగా పాతబడిపోయాయి.
పైగా ‘అయ్యప్పనుం కోషీయుం’ కథ, అందులోని పాత్రల్ని బట్టి చూసినా ఈ టైటిల్ ఆ సినిమాకు సూటవ్వదు. పవన్ చేయబోయేది సీరియస్ పోలీస్ పాత్ర. ఇందులో మరో పాత్ర సైతం సీరియస్గానే ఉంటుంది. ఇద్దరూ ఉన్నత స్థాయి వ్యక్తుల్లా కనిపిస్తారు. అలాంటి పాత్రకు బిల్లా, రంగా అని పేర్లు పెట్టి సినిమాకు ఆ టైటిల్ పెడితే ఏమీ బాగుండదు. ఈ మాత్రం అవగాహన దర్శక నిర్మాతలకు లేకుండా ఉండదు. కాబట్టి ఈ చిత్రానికి ‘బిల్లా రంగా’ అనే టైటిల్ పెడతారనే ప్రచారం ఇక కట్టిపెట్టేస్తే మంచిది. నిజానికి ఈ టైటిల్తో మంచు మనోజ్, సాయిధరమ్ తేజ్ కలిసి మల్టీస్టారర్ చేయాలన్నది ప్లాన్. ఆ ఇద్దరూ ఆ దిశగా ఆసక్తి వ్యక్తం చేశారు కూడా. కాబట్టి వాళ్లకే ఆ టైటిల్ ఇచ్చేసి వేరే వాళ్లు దాని జోలికి వెళ్లకపోతే మంచిది.
This post was last modified on November 8, 2020 3:08 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…