నిన్న భైరవం పెద్ద ఎత్తున విడుదలయ్యింది. ఖలేజా రీ రిలీజ్ వల్ల ఓపెనింగ్స్ ప్రభావితం చెందినప్పటికీ మెల్లగా టాక్ ఊపందుకుని వీకెండ్ కంతా వసూళ్లు పెరుగుతాయనే నమ్మకంతో టీమ్ ఉంది. ఇది బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కంబ్యాక్ అయినా అధిక శాతం ప్రేక్షకులకు దీని మీద ఆసక్తి కలగడానికి కారణం మంచు మనోజ్. తను ఫుల్ లెన్త్ రోల్ లో చివరిసారి కనిపించింది 2017లో. ఒక్కడు మిగిలాడు తర్వాత మాయమైపోయాడు. తర్వాత ఓ రెండు క్యామియోలు చేసినా జనాలకు రీచవ్వలేదు. మొత్తంగా తొమ్మిది సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇప్పుడీ భైరవం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు.
నెగటివ్ టచ్ ఉన్న గజపతి పాత్రలో ,మంచు మనోజ్ ఫ్యాన్స్ కి బాగా నచ్చేశాడు. అక్కడక్కడా కొన్ని సన్నివేశాల్లో గొంతును మరీ గంభీరంగా పెట్టి అరిచినట్టు అనిపించినా ఓవరాల్ గా చూసుకుంటే తన క్యారెక్టర్ వరకు బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. ముఖ్యంగా నారా రోహిత్ తో తన కాంబినేషన్ సీన్లు బాగా వచ్చాయి. నెక్స్ట్ మిరాయ్ లో కూడా మనోజ్ విలన్ గానే చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వచ్చిన టీజర్ లో క్లారిటీ వచ్చేసింది. ఈ రెండు కనక బాగా క్లిక్ అయితే మనోజ్ రూపంలో టాలీవుడ్ కో కొత్త విలన్ దొరికినట్టే. అయితే హీరోగానూ తనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఉండటం గమనించాల్సిన విషయం.
కుటుంబ వివాదంలో తరచు నలుగుతున్న మనోజ్ ఈ మధ్య మంచి జోష్ తో కనిపిస్తున్నాడు. భైరవం ప్రమోషన్ ఇంటర్వ్యూల్లో అందరితో సరదాగా మాట్లాడుతూ జోకులు పేలుస్తూ వాటిని నిలబెట్టాడు. ఒకపక్క నారా రోహిత్, సాయిశ్రీనివాస్ ఎంత మాట్లాడినా వాళ్ళను డామినేట్ చేసేలా తన కామెడీ టైమింగ్ తో బాగా నవ్వించాడు. అయితే మనోజ్ ని కేవలం సీరియస్ పాత్రలకు పరిమితం చేయకుండా తనలో ఫన్ ని వాడుకుంటే బిందాస్, దొంగ దొంగది, పోటుగాడు లాంటి కామెడీని పుట్టించవచ్చు. మనోజ్ మాత్రం ఇదే ఫ్లోతో వేగంగా సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏం చేస్తాడో.
This post was last modified on May 31, 2025 8:54 am
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…