నిన్న భైరవం పెద్ద ఎత్తున విడుదలయ్యింది. ఖలేజా రీ రిలీజ్ వల్ల ఓపెనింగ్స్ ప్రభావితం చెందినప్పటికీ మెల్లగా టాక్ ఊపందుకుని వీకెండ్ కంతా వసూళ్లు పెరుగుతాయనే నమ్మకంతో టీమ్ ఉంది. ఇది బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కంబ్యాక్ అయినా అధిక శాతం ప్రేక్షకులకు దీని మీద ఆసక్తి కలగడానికి కారణం మంచు మనోజ్. తను ఫుల్ లెన్త్ రోల్ లో చివరిసారి కనిపించింది 2017లో. ఒక్కడు మిగిలాడు తర్వాత మాయమైపోయాడు. తర్వాత ఓ రెండు క్యామియోలు చేసినా జనాలకు రీచవ్వలేదు. మొత్తంగా తొమ్మిది సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇప్పుడీ భైరవం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు.
నెగటివ్ టచ్ ఉన్న గజపతి పాత్రలో ,మంచు మనోజ్ ఫ్యాన్స్ కి బాగా నచ్చేశాడు. అక్కడక్కడా కొన్ని సన్నివేశాల్లో గొంతును మరీ గంభీరంగా పెట్టి అరిచినట్టు అనిపించినా ఓవరాల్ గా చూసుకుంటే తన క్యారెక్టర్ వరకు బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. ముఖ్యంగా నారా రోహిత్ తో తన కాంబినేషన్ సీన్లు బాగా వచ్చాయి. నెక్స్ట్ మిరాయ్ లో కూడా మనోజ్ విలన్ గానే చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వచ్చిన టీజర్ లో క్లారిటీ వచ్చేసింది. ఈ రెండు కనక బాగా క్లిక్ అయితే మనోజ్ రూపంలో టాలీవుడ్ కో కొత్త విలన్ దొరికినట్టే. అయితే హీరోగానూ తనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఉండటం గమనించాల్సిన విషయం.
కుటుంబ వివాదంలో తరచు నలుగుతున్న మనోజ్ ఈ మధ్య మంచి జోష్ తో కనిపిస్తున్నాడు. భైరవం ప్రమోషన్ ఇంటర్వ్యూల్లో అందరితో సరదాగా మాట్లాడుతూ జోకులు పేలుస్తూ వాటిని నిలబెట్టాడు. ఒకపక్క నారా రోహిత్, సాయిశ్రీనివాస్ ఎంత మాట్లాడినా వాళ్ళను డామినేట్ చేసేలా తన కామెడీ టైమింగ్ తో బాగా నవ్వించాడు. అయితే మనోజ్ ని కేవలం సీరియస్ పాత్రలకు పరిమితం చేయకుండా తనలో ఫన్ ని వాడుకుంటే బిందాస్, దొంగ దొంగది, పోటుగాడు లాంటి కామెడీని పుట్టించవచ్చు. మనోజ్ మాత్రం ఇదే ఫ్లోతో వేగంగా సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏం చేస్తాడో.
This post was last modified on May 31, 2025 8:54 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…