నిన్న భైరవం పెద్ద ఎత్తున విడుదలయ్యింది. ఖలేజా రీ రిలీజ్ వల్ల ఓపెనింగ్స్ ప్రభావితం చెందినప్పటికీ మెల్లగా టాక్ ఊపందుకుని వీకెండ్ కంతా వసూళ్లు పెరుగుతాయనే నమ్మకంతో టీమ్ ఉంది. ఇది బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కంబ్యాక్ అయినా అధిక శాతం ప్రేక్షకులకు దీని మీద ఆసక్తి కలగడానికి కారణం మంచు మనోజ్. తను ఫుల్ లెన్త్ రోల్ లో చివరిసారి కనిపించింది 2017లో. ఒక్కడు మిగిలాడు తర్వాత మాయమైపోయాడు. తర్వాత ఓ రెండు క్యామియోలు చేసినా జనాలకు రీచవ్వలేదు. మొత్తంగా తొమ్మిది సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇప్పుడీ భైరవం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు.
నెగటివ్ టచ్ ఉన్న గజపతి పాత్రలో ,మంచు మనోజ్ ఫ్యాన్స్ కి బాగా నచ్చేశాడు. అక్కడక్కడా కొన్ని సన్నివేశాల్లో గొంతును మరీ గంభీరంగా పెట్టి అరిచినట్టు అనిపించినా ఓవరాల్ గా చూసుకుంటే తన క్యారెక్టర్ వరకు బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. ముఖ్యంగా నారా రోహిత్ తో తన కాంబినేషన్ సీన్లు బాగా వచ్చాయి. నెక్స్ట్ మిరాయ్ లో కూడా మనోజ్ విలన్ గానే చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వచ్చిన టీజర్ లో క్లారిటీ వచ్చేసింది. ఈ రెండు కనక బాగా క్లిక్ అయితే మనోజ్ రూపంలో టాలీవుడ్ కో కొత్త విలన్ దొరికినట్టే. అయితే హీరోగానూ తనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఉండటం గమనించాల్సిన విషయం.
కుటుంబ వివాదంలో తరచు నలుగుతున్న మనోజ్ ఈ మధ్య మంచి జోష్ తో కనిపిస్తున్నాడు. భైరవం ప్రమోషన్ ఇంటర్వ్యూల్లో అందరితో సరదాగా మాట్లాడుతూ జోకులు పేలుస్తూ వాటిని నిలబెట్టాడు. ఒకపక్క నారా రోహిత్, సాయిశ్రీనివాస్ ఎంత మాట్లాడినా వాళ్ళను డామినేట్ చేసేలా తన కామెడీ టైమింగ్ తో బాగా నవ్వించాడు. అయితే మనోజ్ ని కేవలం సీరియస్ పాత్రలకు పరిమితం చేయకుండా తనలో ఫన్ ని వాడుకుంటే బిందాస్, దొంగ దొంగది, పోటుగాడు లాంటి కామెడీని పుట్టించవచ్చు. మనోజ్ మాత్రం ఇదే ఫ్లోతో వేగంగా సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏం చేస్తాడో.
This post was last modified on May 31, 2025 8:54 am
ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…
ఏపీ సీఎం చంద్రబాబును ఆ పార్టీ నాయకులు ఒకే కోణంలో చూస్తున్నారా? బాబుకు రెండో కోణం కూడా ఉందన్న విషయాన్ని…
గుంటూరు ఎంపీ అదే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖరకు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. రెండు…
కేంద్రంలోని బిజెపి తమకు తోడుగా ఉంటుందని లేదా వచ్చే ఎన్నికలనాటికీ తమతో కలిసి వస్తుందన్న ఆశల్లో వైసిపి ఉంది. ఈ…
భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. ఈ పేరుకు పెద్ద ప్రాభవమే ఉంది. ఒక్కొక్కపార్టీకి నాయకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…
సెంటిమెంటుకు-రాజకీయాలకు మధ్య సయామీ కవలలకు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాదని నాయకులు రాజకీయాలు చేయగలరా? సాధ్యంకాదు. సో..…