Movie News

మనోజ్ వాడకం రెండు రకాలుగా జరగాలి

నిన్న భైరవం పెద్ద ఎత్తున విడుదలయ్యింది. ఖలేజా రీ రిలీజ్ వల్ల ఓపెనింగ్స్ ప్రభావితం చెందినప్పటికీ మెల్లగా టాక్ ఊపందుకుని వీకెండ్ కంతా వసూళ్లు పెరుగుతాయనే నమ్మకంతో టీమ్ ఉంది. ఇది బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కంబ్యాక్ అయినా అధిక శాతం ప్రేక్షకులకు దీని మీద ఆసక్తి కలగడానికి కారణం మంచు మనోజ్. తను ఫుల్ లెన్త్ రోల్ లో చివరిసారి కనిపించింది 2017లో. ఒక్కడు మిగిలాడు తర్వాత మాయమైపోయాడు. తర్వాత ఓ రెండు క్యామియోలు చేసినా జనాలకు రీచవ్వలేదు. మొత్తంగా తొమ్మిది సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇప్పుడీ భైరవం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు.

నెగటివ్ టచ్ ఉన్న గజపతి పాత్రలో ,మంచు మనోజ్ ఫ్యాన్స్ కి బాగా నచ్చేశాడు. అక్కడక్కడా కొన్ని సన్నివేశాల్లో గొంతును మరీ గంభీరంగా పెట్టి అరిచినట్టు అనిపించినా ఓవరాల్ గా చూసుకుంటే తన క్యారెక్టర్ వరకు బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. ముఖ్యంగా నారా రోహిత్ తో తన కాంబినేషన్ సీన్లు బాగా వచ్చాయి. నెక్స్ట్ మిరాయ్ లో కూడా మనోజ్ విలన్ గానే చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వచ్చిన టీజర్ లో క్లారిటీ వచ్చేసింది. ఈ రెండు కనక బాగా క్లిక్ అయితే మనోజ్ రూపంలో టాలీవుడ్ కో కొత్త విలన్ దొరికినట్టే. అయితే హీరోగానూ తనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఉండటం గమనించాల్సిన విషయం.

కుటుంబ వివాదంలో తరచు నలుగుతున్న మనోజ్ ఈ మధ్య మంచి జోష్ తో కనిపిస్తున్నాడు. భైరవం ప్రమోషన్ ఇంటర్వ్యూల్లో అందరితో సరదాగా మాట్లాడుతూ జోకులు పేలుస్తూ వాటిని నిలబెట్టాడు. ఒకపక్క నారా రోహిత్, సాయిశ్రీనివాస్ ఎంత మాట్లాడినా వాళ్ళను డామినేట్ చేసేలా తన కామెడీ టైమింగ్ తో బాగా నవ్వించాడు. అయితే మనోజ్ ని కేవలం సీరియస్ పాత్రలకు పరిమితం చేయకుండా తనలో ఫన్ ని వాడుకుంటే బిందాస్, దొంగ దొంగది, పోటుగాడు లాంటి కామెడీని పుట్టించవచ్చు. మనోజ్ మాత్రం ఇదే ఫ్లోతో వేగంగా సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏం చేస్తాడో. 

Kumar

Recent Posts

జూన్ చివరి వారం… రీ రిలీజుల అర్పణం

అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…

2 hours ago

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

6 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

9 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

9 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

11 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

13 hours ago