కొందరు అభిమానులు రీ రిలీజ్ పేరిట చేస్తున్న చేష్టలు క్రమంగా హద్దు మీరిపోయి వెగటు పుట్టించేలా మారుతున్నాయి. ఇవాళ విడుదలైన ఖలేజా షోల సందర్భంగా ఒక అభిమాని పాముని తీసుకొచ్చి సీన్ రీ క్రియేట్ చేయడం టూ మచ్ అనిపించేసింది. అది బొమ్మదే కావొచ్చు. కానీ పాము, బల్లి లాంటి కీటకాలకు సున్నితత్వంతో తీవ్రంగా భయపడే వాళ్ళు చాలా ఉంటారు. పొరపాటున అది కనక వాళ్ళ మీద పడితే వయసు మళ్ళిన వాళ్లకు గుండెపోటే రావొచ్చు. ఇప్పుడేం జరగలేదు కాబట్టి సమర్ధించడం కాదు కావాల్సింది. అసలలాంటి ముప్పు రాకుండా జాగ్రత్త పడాల్సింది ముమ్మాటికి ఫ్యాన్సే.
ఇదే కాదు ఆధ్యాత్మికత తొణికిసలాడే సదాశివ సన్యాసి పాటకు మాడరన్ డ్రెస్సులు వేసుకుని అమ్మాయిలు డాన్స్ చేయడం రీల్స్ రూపంలో ఆల్రెడీ చక్కర్లు కొడుతోంది. డ్యూయెట్ అయితే ఏదో అనుకోవచ్చు. కానీ డివోషనల్ సాంగ్ కి ఇలా చేయడం ముమ్మాటికీ ఖండనీయం. గతంలో మురారి రీ రిలీజ్ థియేటర్లలో ప్రేమ జంటలు, భార్యా భర్తలు అలనాటి రామచంద్రుడి పాటకు తాళి కట్టుకోవడం, తలంబ్రాలు వేసుకోవడం పట్ల ఆగమ పండితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీటికే కాదు జగదేకవీరుడు అతిలోకసుందరి, గబ్బర్ సింగ్, పోకిరి తదితర సినిమాలప్పుడు ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి.
వీటిని కట్టడి చేయడం జరిగే పని కాదు. కానీ సోషల్ మీడియా పాపులారిటీ కోసమో లేదా రీల్స్ ద్వారా వచ్చే వ్యూస్ కోసమో విచిత్ర వేషధారణలు, పనులు చేయడం సరికాదు. వీటిని ఇప్పటి స్కూల్ పిల్లలు, కాలేజీ యువత అందిపుచ్చుకుంటే ఇదో అలవాటుగా మారిపోతుంది. భవిష్యత్తులో యానిమల్ రీ రిలీజ్ చేస్తే రన్బీర్ కపూర్ న్యూడ్ గా నడిచే సీన్ ని ఎవరికైనా రీ క్రియేట్ చేయాలనే ఆలోచన వస్తే ఎంత ప్రమాదమో ఊహించుకోండి. ఏదైనా మితంగా ఉంటే బాగుంటుంది. అంతే తప్ప సినిమాల్లోని సీన్లను ఎపిసోడ్లను ఇలా లైవ్ లో చేసి చూపించడం ద్వారా కలిగే ఆనందం కన్నా ఆందోళనే ఎక్కువ.
This post was last modified on May 30, 2025 8:46 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…