ఇప్పటికే హైదరాబాద్లో పెద్ద పెద్ద స్టూడియోలున్నాయి. అన్నింటికీ మించి రామోజీ ఫిలిం సిటీ గురించి చెప్పడానికి చాలానే ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద సినీ స్టూడియో ఇది. ఏకంగా 1600 ఎకరాలకు పైగా విస్తీర్ణంతో గిన్నిస్ బుక్లోకి కూడా ఎక్కింది. ఐతే దాన్ని తలదన్నేలా ప్రభుత్వం తరఫున ఫిలిం సిటీ కట్టబోతున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకేతాలివ్వడం విశేషం. ఇంతకుముందు కూడా ఆయన ఈ ‘సినిమా సిటీ’ గురించి చెప్పారు. ఐతే సినీ రంగం గురించి తాను మాట్లాడే సందర్భంలోనో.. లేక తనను సినిమా వాళ్లెవరైనా కలిసినప్పుడో సీఎం కేసీఆర్ ఇలాంటి ఘనమైన ప్రకటనలు ఇవ్వడం మామూలే. కేసీఆర్ అనే కాదు.. చాలామంది పాలకులు ఇలాగే వివిధ రంగాల వాళ్లను కలిసినపుడు వారిని ఊరడించేలా ప్రకటనలు చేస్తుంటారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున తదితరులు సినీ రంగం తరఫున వరద సాయం చెక్కులను ఇచ్చేందుకు గాను ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా టాలీవుడ్ జనాలు పొంగిపోయే మాటలు చెప్పారు కేసీఆర్. “ఇప్పుడున్న వాతావరణానికి తోడు ప్రభుత్వం సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మించాలనే తలంపుతో ఉంది. ప్రభుత్వం 1500-2000 ఎకరాల స్థలాన్ని సేకరించి ఇస్తుంది. అందులో అధునాతన సాంకేతిక నైపుణ్యంతో, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోలు నిర్మించుకునేందుకు సినిమా నిర్మాణ సంస్థలకు స్థలం కేటాయిస్తుంది. ఎయిర్ స్ట్రిప్తో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది” అంటూ ఘనంగా ప్రకటించారు కేసీఆర్.
ఐతే హైదారాబాద్ చుట్టూ భూమికి ఉన్న డిమాండ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిది 1500-2000 ఎకరాల స్థలాన్ని సినీ పరిశ్రమ కోసం కేటాయించి కొత్తగా ఓ ఫిలిం సిటీని ప్రభుత్వం నిర్మిస్తుందని అంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు. నిజంగా ఇది కార్యరూపం దాల్చితే అద్భుతమే అనుకోవాలి.
This post was last modified on November 8, 2020 11:15 am
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…