లోకనాయకుడు కమల్ హాసన్ తాజాగా ఒక ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. తన కొత్త చిత్రం ‘థగ్ లైఫ్’కు సంబంధించి చెన్నైలో జరిగిన ఆడియో రిలీజ్ ఫంక్షన్కు అతిథిగా వచ్చిన శివరాజ్ కుమార్ను ఉద్దేశించి మాట్లాడుతూ.. కన్నడ భాష తమిళ నుంచే పుట్టిందని ఆయన వ్యాఖ్యానించడం కన్నడ నాట దుమారం రేపింది. ఏకంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ అంశం మీద స్పందించారు. కన్నడ భాషకు సుదీర్ఘ చరిత్ర ఉందని.. దాని మూలాల గురించి కమల్ తెలియకుండా మాట్లాడాడారని విమర్శించారు.
మరోవైపు కన్నడ సంఘాలు, రాజకీయ పార్టీల వాళ్లు కూడా కమల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. వ్యవహారం పెద్దది అవుతుండడంతో కమల్ స్పందించారు. తాను మాట్లాడింది తప్పే అన్న ఉద్దేశంతో మాట్లాడిన కమల్.. ఆ తప్పుకు క్షమాపణ మాత్రం చెప్పలేదు. తాను కన్నడిగుల గురించి ప్రేమతో మాట్లాడానన్న కమల్.. ప్రేమ క్షమాపణ చెప్పదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“నేను ప్రేమతోనే అలా మాట్లాడాను. ప్రేమ ఎప్పుడూ క్షమాపణ చెప్పదు. ఎంతోమంది చరిత్రకారులు భాష చరిత్ర గురించి నాకు నేర్పించారు. నేను చేసిన వ్యాఖ్యల్లో మరో ఉద్దేశం లేదు. తమిళనాడు అరుదైన రాష్ట్రం. ప్రతి ఒక్కరినీ మిళితం చేసుకునే తత్వం ఈ రాష్ట్రానికి ఉంది. ఒక మేనన్ (ఎంజీఆర్) ముఖ్యమంత్రి అయ్యారు. ఒక రెడ్డి (ఒమందూరి రామస్వామి రెడ్డియార్) సీఎంగా పని చేశారు. మైసూర్ సంస్థానంలో పని చేసిన నరసింహన్ రంగచారి మనవరాలు (జయలలిత) కూడా ముఖ్యమంత్రి అయ్యారు. చెన్నైలో నేను ఇబ్బందులు ఎదుర్కొంటే కర్ణాటక నాకు మద్దతుగా నిలిచింది. మీరు ఎక్కడికీ వెళ్లొద్దు, ఆశ్రయం కల్పిస్తాం అన్నారు. రాజకీయ నాయకులకు భాష గురించి మాట్లాడే అర్హత లేదు. నాతో సహా ఎవ్వరికీ దీని మీద మాట్లాడే అర్హత లేదు. దీనిపై లోతైన చర్చను చరిత్రకారులకు, పురావస్తు శాస్త్రవేత్తలు, భాషా నిపుణులకు వదిలేద్దాం’’ అని కమల్ వ్యాఖ్యానించారు.
పురాణ గాథలను తెరకెక్కించేటపుడు ఎన్నో ఇబ్బందులుంటాయి. అప్పటి వాతావరణాన్ని తెరపైకి తీసుకురావడం అంత తేలిక కాదు. ప్రతి చిన్న విషయం…
వైసీపీ అధినేత జగన్ తాజాగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించారు. ఇక్కడి పొగాకు రైతులను ఆయన పరామర్శించారు. తొలుత…
రోజులు మారిపోయాయి. బంధాలు, అనుబంధాలు అన్నీ ఆన్ లైన్ అయిపోయాయి. ఆకలైనప్పుడు ఆహారం, అనారోగ్యంగా వున్నప్పుడు మందులు ఆన్ లైన్లో…
ప్రపంచంలో ఏ భాషలో అయినా సినిమా గొప్పదనం ఒకటుంది. మనుషులు భౌతికంగా ఉన్నా లేకపోయినా వాళ్ళను దశాబ్దాల తరబడి గుర్తుంచుకునేలా…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఇంకా మూలుగుతూనే…
ఎల్లుండి విడుదల కాబోతున్న చిత్రాల్లో అందరి దృష్టి కొరియన్ కనకరాజు మీదే ఉంది. కొద్దో గొప్పో తమిళ దర్శకుడు లోకేష్…