లోకనాయకుడు కమల్ హాసన్ తాజాగా ఒక ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. తన కొత్త చిత్రం ‘థగ్ లైఫ్’కు సంబంధించి చెన్నైలో జరిగిన ఆడియో రిలీజ్ ఫంక్షన్కు అతిథిగా వచ్చిన శివరాజ్ కుమార్ను ఉద్దేశించి మాట్లాడుతూ.. కన్నడ భాష తమిళ నుంచే పుట్టిందని ఆయన వ్యాఖ్యానించడం కన్నడ నాట దుమారం రేపింది. ఏకంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ అంశం మీద స్పందించారు. కన్నడ భాషకు సుదీర్ఘ చరిత్ర ఉందని.. దాని మూలాల గురించి కమల్ తెలియకుండా మాట్లాడాడారని విమర్శించారు.
మరోవైపు కన్నడ సంఘాలు, రాజకీయ పార్టీల వాళ్లు కూడా కమల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. వ్యవహారం పెద్దది అవుతుండడంతో కమల్ స్పందించారు. తాను మాట్లాడింది తప్పే అన్న ఉద్దేశంతో మాట్లాడిన కమల్.. ఆ తప్పుకు క్షమాపణ మాత్రం చెప్పలేదు. తాను కన్నడిగుల గురించి ప్రేమతో మాట్లాడానన్న కమల్.. ప్రేమ క్షమాపణ చెప్పదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“నేను ప్రేమతోనే అలా మాట్లాడాను. ప్రేమ ఎప్పుడూ క్షమాపణ చెప్పదు. ఎంతోమంది చరిత్రకారులు భాష చరిత్ర గురించి నాకు నేర్పించారు. నేను చేసిన వ్యాఖ్యల్లో మరో ఉద్దేశం లేదు. తమిళనాడు అరుదైన రాష్ట్రం. ప్రతి ఒక్కరినీ మిళితం చేసుకునే తత్వం ఈ రాష్ట్రానికి ఉంది. ఒక మేనన్ (ఎంజీఆర్) ముఖ్యమంత్రి అయ్యారు. ఒక రెడ్డి (ఒమందూరి రామస్వామి రెడ్డియార్) సీఎంగా పని చేశారు. మైసూర్ సంస్థానంలో పని చేసిన నరసింహన్ రంగచారి మనవరాలు (జయలలిత) కూడా ముఖ్యమంత్రి అయ్యారు. చెన్నైలో నేను ఇబ్బందులు ఎదుర్కొంటే కర్ణాటక నాకు మద్దతుగా నిలిచింది. మీరు ఎక్కడికీ వెళ్లొద్దు, ఆశ్రయం కల్పిస్తాం అన్నారు. రాజకీయ నాయకులకు భాష గురించి మాట్లాడే అర్హత లేదు. నాతో సహా ఎవ్వరికీ దీని మీద మాట్లాడే అర్హత లేదు. దీనిపై లోతైన చర్చను చరిత్రకారులకు, పురావస్తు శాస్త్రవేత్తలు, భాషా నిపుణులకు వదిలేద్దాం’’ అని కమల్ వ్యాఖ్యానించారు.
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…