లోకనాయకుడు కమల్ హాసన్ తాజాగా ఒక ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. తన కొత్త చిత్రం ‘థగ్ లైఫ్’కు సంబంధించి చెన్నైలో జరిగిన ఆడియో రిలీజ్ ఫంక్షన్కు అతిథిగా వచ్చిన శివరాజ్ కుమార్ను ఉద్దేశించి మాట్లాడుతూ.. కన్నడ భాష తమిళ నుంచే పుట్టిందని ఆయన వ్యాఖ్యానించడం కన్నడ నాట దుమారం రేపింది. ఏకంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ అంశం మీద స్పందించారు. కన్నడ భాషకు సుదీర్ఘ చరిత్ర ఉందని.. దాని మూలాల గురించి కమల్ తెలియకుండా మాట్లాడాడారని విమర్శించారు.
మరోవైపు కన్నడ సంఘాలు, రాజకీయ పార్టీల వాళ్లు కూడా కమల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. వ్యవహారం పెద్దది అవుతుండడంతో కమల్ స్పందించారు. తాను మాట్లాడింది తప్పే అన్న ఉద్దేశంతో మాట్లాడిన కమల్.. ఆ తప్పుకు క్షమాపణ మాత్రం చెప్పలేదు. తాను కన్నడిగుల గురించి ప్రేమతో మాట్లాడానన్న కమల్.. ప్రేమ క్షమాపణ చెప్పదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“నేను ప్రేమతోనే అలా మాట్లాడాను. ప్రేమ ఎప్పుడూ క్షమాపణ చెప్పదు. ఎంతోమంది చరిత్రకారులు భాష చరిత్ర గురించి నాకు నేర్పించారు. నేను చేసిన వ్యాఖ్యల్లో మరో ఉద్దేశం లేదు. తమిళనాడు అరుదైన రాష్ట్రం. ప్రతి ఒక్కరినీ మిళితం చేసుకునే తత్వం ఈ రాష్ట్రానికి ఉంది. ఒక మేనన్ (ఎంజీఆర్) ముఖ్యమంత్రి అయ్యారు. ఒక రెడ్డి (ఒమందూరి రామస్వామి రెడ్డియార్) సీఎంగా పని చేశారు. మైసూర్ సంస్థానంలో పని చేసిన నరసింహన్ రంగచారి మనవరాలు (జయలలిత) కూడా ముఖ్యమంత్రి అయ్యారు. చెన్నైలో నేను ఇబ్బందులు ఎదుర్కొంటే కర్ణాటక నాకు మద్దతుగా నిలిచింది. మీరు ఎక్కడికీ వెళ్లొద్దు, ఆశ్రయం కల్పిస్తాం అన్నారు. రాజకీయ నాయకులకు భాష గురించి మాట్లాడే అర్హత లేదు. నాతో సహా ఎవ్వరికీ దీని మీద మాట్లాడే అర్హత లేదు. దీనిపై లోతైన చర్చను చరిత్రకారులకు, పురావస్తు శాస్త్రవేత్తలు, భాషా నిపుణులకు వదిలేద్దాం’’ అని కమల్ వ్యాఖ్యానించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…