బాలీవుడ్లో ఒక సెన్సేషనల్ కాంబినేషన్కు తెర లేచింది. అమితాబ్ బచ్చన్ ఒక సీనియర్ హీరో దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఆ హీరో అజయ్ దేవగణ్ కావడం విశేషం. అమితాబ్, అజయ్ దేవగణ్ కలిసి ఒక సినిమాలో నటించడం కొత్తేమీ కాదు.
మేజర్ సాబ్, హమ్ కిసీసే కమ్ నహీ, సత్యాగ్రహ లాంటి మల్టీస్టారర్లలో నటించారు. కానీ ఈసారి అమితాబ్తో కలిసి తెరను పంచుకోవడమే కాదు.. ఈ చిత్రాన్ని తనే డైరెక్ట్ చేస్తూ, ప్రొడక్షన్ బాధ్యత కూడా నెత్తికెత్తుకున్నాడు అజయ్. ‘మే డే’ పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇదొక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ హ్యూమన్ డ్రామా అని చెబుతున్నాడు అజయ్. ఇందులో అజయ్ పైలట్ పాత్రలో కనిపించనున్నాడట. అమితాబ్ పాత్ర గురించి ఏమీ చెప్పలేదు. మరికొందరు పేరున్న ఆర్టిస్టులు ఇందులో నటిస్తారట. డిసెంబర్లో చిత్రీకరణ మొదలు కానుంది.
అజయ్కి దర్శకత్వం కూడా కొత్తేమీ కాదు. అతను ఇంతకుముందు తనే ప్రధాన పాత్రలో ‘శివాయ్’ అనే సినిమా తీశాడు. అందులో ‘అఖిల్’ భామ షాయేషా సైగల్ కథానాయికగా నటించింది. ఆ అడ్వెంచరస్ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. అయినా సరే.. అజయ్ మెగా ఫోన్ పక్కన పెట్టలేదు. ఏకంగా అమితాబ్ బచ్చన్ను ఒప్పించి సినిమా తీయడానికి రెడీ అయ్యడు. అమితాబ్ తన దగ్గరికి వచ్చే పది కథల్లో ఒకటో రెండో మాత్రమే ఎంచుకుంటాడు.
వయసు పెరుగుతున్నా ఆయనకు డిమాండేమీ తగ్గలేదు. ఇప్పటికీ గొప్ప గొప్ప పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నాయి. మన ప్రభాస్.. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్తో చేయబోయే సినిమాలోనూ అమితాబ్ ఓ కీలక పాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. మూణ్నెల్ల కిందట కరోనా బారిన పడ్డ అమితాబ్.. కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతుడైన సంగతి తెలిసిందే.
This post was last modified on November 8, 2020 11:05 am
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాటజీకి తెరదీశారు. త్వరలోనే జిల్లాల విభజన చేయనున్నట్టు ఆయన స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తనను కస్టడీలో హింసించారని.. దీంతో తనకు…
గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…