బాలీవుడ్లో ఒక సెన్సేషనల్ కాంబినేషన్కు తెర లేచింది. అమితాబ్ బచ్చన్ ఒక సీనియర్ హీరో దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఆ హీరో అజయ్ దేవగణ్ కావడం విశేషం. అమితాబ్, అజయ్ దేవగణ్ కలిసి ఒక సినిమాలో నటించడం కొత్తేమీ కాదు.
మేజర్ సాబ్, హమ్ కిసీసే కమ్ నహీ, సత్యాగ్రహ లాంటి మల్టీస్టారర్లలో నటించారు. కానీ ఈసారి అమితాబ్తో కలిసి తెరను పంచుకోవడమే కాదు.. ఈ చిత్రాన్ని తనే డైరెక్ట్ చేస్తూ, ప్రొడక్షన్ బాధ్యత కూడా నెత్తికెత్తుకున్నాడు అజయ్. ‘మే డే’ పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇదొక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ హ్యూమన్ డ్రామా అని చెబుతున్నాడు అజయ్. ఇందులో అజయ్ పైలట్ పాత్రలో కనిపించనున్నాడట. అమితాబ్ పాత్ర గురించి ఏమీ చెప్పలేదు. మరికొందరు పేరున్న ఆర్టిస్టులు ఇందులో నటిస్తారట. డిసెంబర్లో చిత్రీకరణ మొదలు కానుంది.
అజయ్కి దర్శకత్వం కూడా కొత్తేమీ కాదు. అతను ఇంతకుముందు తనే ప్రధాన పాత్రలో ‘శివాయ్’ అనే సినిమా తీశాడు. అందులో ‘అఖిల్’ భామ షాయేషా సైగల్ కథానాయికగా నటించింది. ఆ అడ్వెంచరస్ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. అయినా సరే.. అజయ్ మెగా ఫోన్ పక్కన పెట్టలేదు. ఏకంగా అమితాబ్ బచ్చన్ను ఒప్పించి సినిమా తీయడానికి రెడీ అయ్యడు. అమితాబ్ తన దగ్గరికి వచ్చే పది కథల్లో ఒకటో రెండో మాత్రమే ఎంచుకుంటాడు.
వయసు పెరుగుతున్నా ఆయనకు డిమాండేమీ తగ్గలేదు. ఇప్పటికీ గొప్ప గొప్ప పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నాయి. మన ప్రభాస్.. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్తో చేయబోయే సినిమాలోనూ అమితాబ్ ఓ కీలక పాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. మూణ్నెల్ల కిందట కరోనా బారిన పడ్డ అమితాబ్.. కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతుడైన సంగతి తెలిసిందే.
This post was last modified on November 8, 2020 11:05 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…