Movie News

OG విలన్ తెచ్చిన కొత్త సమస్య

పవన్ కళ్యాణ్ అభిమానులు సెప్టెంబర్ 25 ఎప్పుడు వస్తుందాని కళ్ళను దీపాలు చేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. బ్యాలన్స్ షూటింగ్ ఇటీవలే ముంబైలో మొదలైన సంగతి తెలిసిందే. చిత్రీకరణ జరుగుతున్న ప్రాంతంలో తీసిన మొబైల్ ఫుటేజ్ లో పవన్ రెట్రో గెటప్ చూసి ఫ్యాన్స్ మాములు ఎగ్జైట్ అవ్వడం లేదు. బెల్ బాటమ్ ప్యాంటుతో అల్ట్రా స్టైలిష్ గా ఉన్న పవర్ స్టార్ ని చూసి తెగ మురిసిపోతున్నారు. దీని తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం మొదలైంది. అయితే ఓజి విలన్ గా నటిస్తున్న ఇమ్రాన్ హష్మీ వల్ల ఊహించని సమస్య ఒకటొచ్చిందని బాలీవుడ్ టాక్.

ఆరే కాలనీలో ఉన్న గోరెగావ్ ప్రాంతంలో షూట్ చేస్తున్నప్పుడు అక్కడి వాతావరణం వల్ల ఇమ్రాన్ హష్మీకి డెంగ్యూ జబ్బు వచ్చిందట. లక్షణాలు తీవ్రం కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి వెళ్తే డాక్టర్లు కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకోమని సూచించడంతో తన భాగం వరకు కొంత బ్రేక్ ఇవ్వక తప్పడం లేదని అంటున్నారు. నిజానికి ఇంతకు ముందు పవన్, ఇమ్రాన్ కాంబోలో ఎలాంటి షూట్ జరగలేదు. తాజా షెడ్యూల్ లోనే అది మొదలయ్యింది. ఈలోగా డెంగ్యూ ట్విస్టు ఇవ్వడంతో ఇంట్లోనే రెస్ట్ తీసుకునే పరిస్థితి వచ్చింది. దర్శకుడు సుజిత్ ప్రస్తుతం ఇతర ఎపిసోడ్లను ప్లాన్ చేసుకునే పనిలో ఉన్నాడు.

ఎట్టి పరిస్థితుల్లో ప్రకటించిన డేట్ కే విడుదల చేసేలా డివివి ఎంటర్ టైన్మెంట్స్ సర్వ సన్నద్ధంగా ఉంది. దానికి అనుగుణంగానే పవన్ డేట్స్ ఇస్తానని హామీ ఇవ్వడంతో పాటు వెంటనే రంగంలోకి దిగారు. రాజకీయ కార్యకలాపాలు చూసుకుంటూనే వీలైనంత వేగంగా తన భాగాన్ని తీసేందుకు సహకరిస్తున్నట్టు తెలిసింది. ఓజి ఒక భాగమా లేక సీక్వెల్ ఉంటుందా అనేది మాత్రం బయటికి రావడం లేదు. తొలుత పార్ట్ 2 ఉందన్నారు కానీ ఉస్తాద్ భగత్ సింగ్ అయ్యాక హరిహర వీరమల్లు 2 తప్ప మరో సినిమా చేసే ఆలోచనలో పవన్ లేడని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. క్లారిటి అయితే ఇప్పట్లో వచ్చే ఛాన్స్ లేదు.

This post was last modified on May 28, 2025 6:06 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

4 minutes ago

క్రింజ్ కామెంట్ల‌పై రావిపూడి ఏమ‌న్నాడంటే?

అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అంద‌రూ హిట్ మెషీన్ అంటారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…

7 minutes ago

100 కోట్లు ఉన్నా ప్రశాంతత లేదా? ఎన్నారై స్టోరీ వైరల్!

అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…

28 minutes ago

ట్రెండుకు భిన్నంగా వెళితే ఎలా జగన్?

బ‌లంగా మాట్లాడాలి. మాట‌కు మాట కౌంట‌ర్ ఇవ్వాలి. అది వింటే ప్ర‌త్య‌ర్థులు నోరు అప్ప‌గించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…

3 hours ago

మహిళా డాక్టర్ హిజాబ్ ను తొలగించిన సీఎం

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…

5 hours ago