Movie News

OG విలన్ తెచ్చిన కొత్త సమస్య

పవన్ కళ్యాణ్ అభిమానులు సెప్టెంబర్ 25 ఎప్పుడు వస్తుందాని కళ్ళను దీపాలు చేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. బ్యాలన్స్ షూటింగ్ ఇటీవలే ముంబైలో మొదలైన సంగతి తెలిసిందే. చిత్రీకరణ జరుగుతున్న ప్రాంతంలో తీసిన మొబైల్ ఫుటేజ్ లో పవన్ రెట్రో గెటప్ చూసి ఫ్యాన్స్ మాములు ఎగ్జైట్ అవ్వడం లేదు. బెల్ బాటమ్ ప్యాంటుతో అల్ట్రా స్టైలిష్ గా ఉన్న పవర్ స్టార్ ని చూసి తెగ మురిసిపోతున్నారు. దీని తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం మొదలైంది. అయితే ఓజి విలన్ గా నటిస్తున్న ఇమ్రాన్ హష్మీ వల్ల ఊహించని సమస్య ఒకటొచ్చిందని బాలీవుడ్ టాక్.

ఆరే కాలనీలో ఉన్న గోరెగావ్ ప్రాంతంలో షూట్ చేస్తున్నప్పుడు అక్కడి వాతావరణం వల్ల ఇమ్రాన్ హష్మీకి డెంగ్యూ జబ్బు వచ్చిందట. లక్షణాలు తీవ్రం కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి వెళ్తే డాక్టర్లు కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకోమని సూచించడంతో తన భాగం వరకు కొంత బ్రేక్ ఇవ్వక తప్పడం లేదని అంటున్నారు. నిజానికి ఇంతకు ముందు పవన్, ఇమ్రాన్ కాంబోలో ఎలాంటి షూట్ జరగలేదు. తాజా షెడ్యూల్ లోనే అది మొదలయ్యింది. ఈలోగా డెంగ్యూ ట్విస్టు ఇవ్వడంతో ఇంట్లోనే రెస్ట్ తీసుకునే పరిస్థితి వచ్చింది. దర్శకుడు సుజిత్ ప్రస్తుతం ఇతర ఎపిసోడ్లను ప్లాన్ చేసుకునే పనిలో ఉన్నాడు.

ఎట్టి పరిస్థితుల్లో ప్రకటించిన డేట్ కే విడుదల చేసేలా డివివి ఎంటర్ టైన్మెంట్స్ సర్వ సన్నద్ధంగా ఉంది. దానికి అనుగుణంగానే పవన్ డేట్స్ ఇస్తానని హామీ ఇవ్వడంతో పాటు వెంటనే రంగంలోకి దిగారు. రాజకీయ కార్యకలాపాలు చూసుకుంటూనే వీలైనంత వేగంగా తన భాగాన్ని తీసేందుకు సహకరిస్తున్నట్టు తెలిసింది. ఓజి ఒక భాగమా లేక సీక్వెల్ ఉంటుందా అనేది మాత్రం బయటికి రావడం లేదు. తొలుత పార్ట్ 2 ఉందన్నారు కానీ ఉస్తాద్ భగత్ సింగ్ అయ్యాక హరిహర వీరమల్లు 2 తప్ప మరో సినిమా చేసే ఆలోచనలో పవన్ లేడని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. క్లారిటి అయితే ఇప్పట్లో వచ్చే ఛాన్స్ లేదు.

This post was last modified on May 28, 2025 6:06 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

8 minutes ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

35 minutes ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

1 hour ago

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

2 hours ago

పందెం రాయుళ్లకు తిప్పలు తప్పవా…?

సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…

2 hours ago

అమరావతిపై 48 గంటల్లో టోన్ మార్చిన వైసీపీ!

ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని…

2 hours ago