హీరో విలన్ రెండు పాత్రలు ఒకే స్టార్ హీరో చేయడం కొత్తేమి కాదు. మానవుడు దానవుడులో శోభన్ బాబు, అంతం కాదిది ఆరంభంలో కృష్ణ, సుల్తాన్ లో బాలకృష్ణ, రోబోలో రజనీకాంత్, కాష్మోరాలో కార్తీ ఇలా ఎందరో చేశారు. కానీ వీటిలో సక్సెస్ లు ఏనున్నాయో ఫెయిల్యూర్స్ కూడా అన్నే కనిపిస్తాయి. అందుకే ఇలాంటి వాటిని హీరోలు రిస్క్ గా భావిస్తారు. ఇటీవలే ప్రకటించిన ప్యాన్ ఇండియా మూవీలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేస్తున్న విషయం ఆల్రెడీ లీకుల రూపంలో బయటికి వచ్చేసింది. ఒకటి నెగటివ్ షేడ్ ఉంటుందని స్పష్టమైన సమాచారం. ఇప్పుడు సూర్య కూడా ఈ రూటులో వెళ్ళబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న భారీ చిత్రంలో సూర్య హీరో, విలన్ రెండు రూపాల్లో దర్శనమివ్వబోతున్నాడని ఇన్ సైడ్ టాక్. అఫీషియల్ గా చెప్పలేదు కానీ సోర్స్ అయితే బలంగా ఉంది. గతంలో ఈ ఎక్స్ పరిమెంట్ సూర్య 24లో చేశాడు. అందులో ఆత్రేయగా తను ఇచ్చిన అద్భుతమైన పెర్ఫార్మన్స్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు వెంకీ అట్లూరి కూడా అలా వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ ని స్పెషల్ గా డిజైన్ చేశాడట. దీనికి సంబంధించిన గెటప్పులు , మ్యానరిజం ఉహించని స్థాయిలో డిఫరెంట్ గా ఉంటాయని టీమ్ సభ్యులు ఊరిస్తున్నారు.
మమిత బైజు హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జానర్ ఏంటనేది ఇంకా బయటికి రాలేదు. సార్, లక్కీ భాస్కర్ లాగే ఎనభై తొంభై దశకంలోనే ఈ కథ సాగుతుందట. తొలుత ప్రచారం జరిగినట్టు మారుతీ ఇంజిన్ కనిపెట్టిన ఇంజినీర్ కథ కాదని విశ్వసనీయ సమాచారం. కంగువా, రెట్రో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లతో సూర్య మార్కెట్ బాగా డ్యామేజ్ లో ఉంది. ఆర్జె బాలాజీతో చేస్తున్న సినిమా కనక బ్లాక్ బస్టర్ సాధించకపోతే ఆ బాధ్యత వెంకీ అట్లూరి మీద పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ పరచనని, సూర్య కెరీర్ లోనే బెస్ట్ అనిపించుకునే మూవీ ఇస్తానని వెంకీ తన సన్నిహితులతో అంటున్నారు. అది జరిగితే మంచిదేగా.
This post was last modified on May 26, 2025 3:37 pm
సినిమాల్లో సక్సెస్ కోసం కిందా మీద పడుతున్నాడు కానీ సిద్దార్థ్ కు డిజిటల్ స్పేస్ లో మంచి కంటెంట్ దొరుకుతోంది.…
నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించనప్పటికీ టాక్సిక్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కి టికెట్ రేట్ల పెంపు తీసుకుంటారనే టాక్ బయటికి…
అయ్యప్ప స్వామి భక్తులు పాడుకునే పాటల్ల ో ‘మల్లెపూల పల్లకి’కి ఉన్న ఆదరణే వేరు. అయ్యప్ప మాల సీజన్ మొదలైందంటే ఈ పాట ఊర్లలో మార్మోగిపోతుంటుంది.…
నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసులో చిక్కుముడి వీడింది. ఇద్దరు పదో…
ఒకప్పటితో పోలిస్తే తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపుకి సంబంధించి అంత తేలిగ్గా జీవోలు రావట్లేదు. ఓవైపు ప్రభుత్వం అంత తేలిగ్గా జీవోకు అంగీకరించట్లేదు. ఇంకోవైపు…
సినీ హీరోల మీద ఫ్యాన్స్ వీరాభిమానానికి సంబందించి ఎన్నో ఉదంతాలు చూశాం. కానీ ఇది చాలా చిత్రమైన వ్యవహారం. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు…