‘భైరవం’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో అందరి దృష్టీ మంచు మనోజ్ మీదే నిలిచింది. ఒకప్పుడు టాలీవుడ్ బిజీ హీరోల్లో ఒకడిగా ఉన్న మనోజ్.. ఎనిమిదేళ్ల పాటు తెర మీద కనిపించకపోవడం అంటే షాకింగే. ఎప్పుడో 2017లో ‘ఒక్కడు మిగిలాడు’ చిత్రంతో అతను ప్రేక్షకులను పలకరించాడు. అనివార్య కారణాల వల్ల తన కెరీర్లో చాలా గ్యాప్ వచ్చేసింది. ఇన్నేళ్లకు పునరాగమనం చేస్తుండడం.. మరోవైపు తన కుటుంబ వివాదం వల్ల ఈ సినిమా ఈవెంట్లో మనోజ్ ఏం మాట్లాడతాడా అని అంతా ఆసక్తిగా చూశారు.
ఐతే గత ఈవెంట్లో మాదిరి ఫ్యామిలీ ఇష్యూస్కు సంబంధించి ఇన్ డైరెక్ట్ కామెంట్లేవే చేయకుండా.. పూర్తిగా సినిమాకు సంబంధించిన విషయాల మీదే మాట్లాడాడు మనోజ్. మామూలుగా చాలామంది ఓపెన్ కాని అంశాలను అతను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అందులో ఒకటి దర్శకుడు విజయ్ కనకమేడల పాత ఫేస్ బుక్ పోస్టు మీద చెలరేగిన వివాదం. విజయ్ కూడా మెగా ఫ్యానే అని నొక్కి వక్కాణిస్తూ.. జరిగిన దానికి టీం తరఫున సారీ చెప్పి ఆ వివాదానికి తెరదించే ప్రయత్నం చేశాడు మనోజ్.
ఇక మనోజ్ ప్రస్తావించిన మరో కీలక విషయం.. కులానికి సంబంధించింది. ఈ సినిమా హీరోలందరిదీ ఒకే కులం అని, దర్శకుడూ అదే కులానికి చెందిన వాడని.. ఒక కులం వాళ్లు కలిసి చేస్తున్న సినిమా అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ గురించి మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కులం అనేది ఈ తరంతో అంతరించిపోవాలని, తన పిల్లల వరకు అది వెళ్లకూడదని తాను భావిస్తున్నానని.. అసలు కులం అన్నది చూడకుండా అందరికీ ప్రేమను, డబ్బును ఇచ్చేది సినిమా ఇండస్ట్రీ అని మనోజ్ అన్నాడు.
ఇది కమ్మ సినిమానా, కాపు సినిమానా, రెడ్డి సినిమానా అని చూసి ప్రేక్షకులు థియేటర్లకు రారని.. అలాగే ఇండస్ట్రీలో ఎవరూ కులం చూసి అవకాశాలు ఇవ్వరని మనోజ్ తెలిపాడు. అలాంటి సినిమాకు కులం రంగు పూసి టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని మనోజ్ అభిప్రాయపడ్డాడు. ఎవరినైనా ఈ రోజుల్లో పది వేలు డబ్బులు కావాలని అడిగి చూస్తే రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలని.. కానీ ఇండస్ట్రీలో ఏదీ చూడకుండా కేవలం టాలెంట్ ఆధారంగా నిర్మాతలు అందరికీ డబ్బులు ఇస్తారని.. ఇలాంటి ఇండస్ట్రీ మరేదీ ఉండదని మనోజ్ స్పష్టం చేశాడు.
This post was last modified on May 26, 2025 2:47 pm
తెలుగు సినిమా స్థాయి ఇంటర్నేషనల్ లెవెల్ కి చేరుకుందని ఒకవైపు మురిసిపోతూనే, ఇంకోవైపు చాలా విషయాల్లో ఆందోళన కలిగిస్తున్న పరిణామాలు…
శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును జైల్లో పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ అధినేత జగన్.. అప్పలరాజును…
రాష్ట్రంలో ఎవరి దయాదాక్షిణ్యాలపైనా తాను ముఖ్యమంత్రిని కాలేదని.. 4 కోట్ల మంది ఓటర్లు ఓటేసి తనను గెలిపించుకున్నారని.. వారి ఆశీర్వాదం,…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి... పాలిటిక్స్ తో పాటు ఇతరత్రా అంశాలపైనా ఓ రేంజి అవగాహన కలిగిన నేతగా…
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ యాక్సిడెంట్ చేయడంతో దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందిన సంగతి…
తెలుగులో గత కొన్నేళ్లలో వచ్చిన ఉత్తమ ప్రేమకథా చిత్రాల్లో ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఒకటి. ఎక్కువగా అగ్రెసివ్ క్యారెక్టర్లు…