‘భైరవం’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో అందరి దృష్టీ మంచు మనోజ్ మీదే నిలిచింది. ఒకప్పుడు టాలీవుడ్ బిజీ హీరోల్లో ఒకడిగా ఉన్న మనోజ్.. ఎనిమిదేళ్ల పాటు తెర మీద కనిపించకపోవడం అంటే షాకింగే. ఎప్పుడో 2017లో ‘ఒక్కడు మిగిలాడు’ చిత్రంతో అతను ప్రేక్షకులను పలకరించాడు. అనివార్య కారణాల వల్ల తన కెరీర్లో చాలా గ్యాప్ వచ్చేసింది. ఇన్నేళ్లకు పునరాగమనం చేస్తుండడం.. మరోవైపు తన కుటుంబ వివాదం వల్ల ఈ సినిమా ఈవెంట్లో మనోజ్ ఏం మాట్లాడతాడా అని అంతా ఆసక్తిగా చూశారు.
ఐతే గత ఈవెంట్లో మాదిరి ఫ్యామిలీ ఇష్యూస్కు సంబంధించి ఇన్ డైరెక్ట్ కామెంట్లేవే చేయకుండా.. పూర్తిగా సినిమాకు సంబంధించిన విషయాల మీదే మాట్లాడాడు మనోజ్. మామూలుగా చాలామంది ఓపెన్ కాని అంశాలను అతను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అందులో ఒకటి దర్శకుడు విజయ్ కనకమేడల పాత ఫేస్ బుక్ పోస్టు మీద చెలరేగిన వివాదం. విజయ్ కూడా మెగా ఫ్యానే అని నొక్కి వక్కాణిస్తూ.. జరిగిన దానికి టీం తరఫున సారీ చెప్పి ఆ వివాదానికి తెరదించే ప్రయత్నం చేశాడు మనోజ్.
ఇక మనోజ్ ప్రస్తావించిన మరో కీలక విషయం.. కులానికి సంబంధించింది. ఈ సినిమా హీరోలందరిదీ ఒకే కులం అని, దర్శకుడూ అదే కులానికి చెందిన వాడని.. ఒక కులం వాళ్లు కలిసి చేస్తున్న సినిమా అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ గురించి మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కులం అనేది ఈ తరంతో అంతరించిపోవాలని, తన పిల్లల వరకు అది వెళ్లకూడదని తాను భావిస్తున్నానని.. అసలు కులం అన్నది చూడకుండా అందరికీ ప్రేమను, డబ్బును ఇచ్చేది సినిమా ఇండస్ట్రీ అని మనోజ్ అన్నాడు.
ఇది కమ్మ సినిమానా, కాపు సినిమానా, రెడ్డి సినిమానా అని చూసి ప్రేక్షకులు థియేటర్లకు రారని.. అలాగే ఇండస్ట్రీలో ఎవరూ కులం చూసి అవకాశాలు ఇవ్వరని మనోజ్ తెలిపాడు. అలాంటి సినిమాకు కులం రంగు పూసి టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని మనోజ్ అభిప్రాయపడ్డాడు. ఎవరినైనా ఈ రోజుల్లో పది వేలు డబ్బులు కావాలని అడిగి చూస్తే రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలని.. కానీ ఇండస్ట్రీలో ఏదీ చూడకుండా కేవలం టాలెంట్ ఆధారంగా నిర్మాతలు అందరికీ డబ్బులు ఇస్తారని.. ఇలాంటి ఇండస్ట్రీ మరేదీ ఉండదని మనోజ్ స్పష్టం చేశాడు.
This post was last modified on May 26, 2025 2:47 pm
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…