మంచు విష్ణు ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ‘కన్నప్ప’ సినిమా మీద తన ‘సింగిల్’ మూవీ ట్రైలర్లో పరోక్షంగా కౌంటర్ వేసిందుకు ఇటీవల యువ కథానాయకుడు శ్రీ విష్ణు సారీ చెప్పాల్సిన పరిస్థితి రావడం తెలిసిందే. ‘కన్నప్ప’ టీజర్లో మంచు విష్ణు అన్న ‘శివయ్యా’ డైలాగ్ను శ్రీ విష్ణు ‘సింగిల్’లో రీక్రియేట్ చేయడానికి ప్రయత్నించగా.. అది విష్ణు అండ్ టీంను హర్ట్ చేసింది. విషయం తెలిసి.. శ్రీ విష్ణు వెంటనే సారీ చెప్పాడు. సినిమా నుంచి కూడా ఆ డైలాగ్ తీసేశాడు.
ఐతే ఇటీవల ‘భైరవం’ ప్రి రిలీజ్ ఈవెంట్లో స్వయంగా విష్ణు తమ్ముడే అయిన మంచు మనోజ్ సేమ్ డైలాగ్తో అన్నకు కౌంటర్ ఇచ్చాడు. ‘శివయ్యా’ అని పిలిస్తే శివుడు రాడంటూ వెటకారం చేశాడు. దీనిపై విష్ణు నుంచి ఏ రియాక్షన్ లేదు. కానీ ఈలోపే మంచు మనోజ్ తప్పు తెలుసుకుని సారీ చెప్పడం విశేషం. ‘కన్నప్ప’ సినిమా కోసం ఎంతో మంది పని చేశారని.. తన అన్న మీద కోపంతో తాను ఆ డైలాగ్ మీద వెటకారం ఆడడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతూ.. ‘కన్నప్ప’ టీంకు మనోజ్ సారీ చెప్పాడు. అంతే కాక.. ‘కన్నప్ప’ బాగా ఆడాలంటూ అతను విషెస్ కూడా చెప్పాడు.
“నేనేదో ఎమోషన్లో శివయ్యా అన్నాను. కానీ ఆ సినిమాకు కూడా డైరెక్టర్, కెమెరామన్, మ్యూజిక్ డైరెక్టర్, ప్రభాస్ గారు, మోహన్ లాల్ గారు.. ఇలా చాలామంది పని చేశారు. ఆ హీరోలకు ఫ్యాన్స్ ఉన్నారు. ఒక్కరు చేసిన తప్పుకి నేను ఇంతమందిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు అని భాధ పడ్డాను. నేను అన్నదానికి ఆ చిత్ర కాస్ట్ అండ్ క్రూ నన్ను క్షమించండి. నేను అలా అని ఉండకూడదు. సినిమా ఒక్కడిది కాదు. అందరిదీ. నేను ఈ రోజు నుంచి అలాంటి కామెంట్లు చేయను. కన్నప్ప సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని మనోజ్ తెలిపాడు.
This post was last modified on May 24, 2025 5:29 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…