ఏపీ, తెలంగాణలో జూన్ 1 నుంచి సినిమా హాళ్లలో ప్రదర్శనలు ఉండబోవని.. సినిమా హాళ్లను మూసేస్తామని ప్రకటించిన ఎగ్జిబిటర్ల సంఘం తాజాగా వెనక్కి తగ్గింది. జూన్ 1 నుంచి ఎలాంటి బంద్ ఉండబోదని.. సినిమా హాళ్లు యధావిధిగా పనిచేయనున్నాయని ప్రకటించింది. అంతేకాదు.. దీనిపై స్పష్టత వచ్చిందని కూడా ప్రకటించింది. తాజాగా ఎగ్జిబిటర్ల సంఘం, ఫిలించాంబర్ సభ్యులు హైదరాబాద్లో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా జూన్ 1 నుంచి సినిమా హాళ్లను బంద్ చేస్తామని గతంలో చేసిన ప్రకటనపై వారు చర్చించారు. వాస్తవానికి సినిమాల పై ఎగ్జిబిటర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. తమ సమస్యలు పరిష్కరిం చాలని కూడా డిమాండ్ చేస్తోంది. గతంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను సినీ ప్రముఖులు కలిసి వెళ్లారు. అయినా.. వారి సమస్యలు పరిష్కారం కాలేదన్నది వారి వాదన. ఈ నేపథ్యంలోనే బంద్కు పిలుపునిచ్చారు.
అయితే.. దీని వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమా హరి హర వీరమల్లు జూన్ 12 న విడుదల అవుతున్న నేపథ్యంలోనే బంద్కు పిలుపునిచ్చారని.. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. జనసేన నాయకులు కూడా దీనిపై స్పందించారు. ఇది కుట్రపూరిత నిరసన అని.. దీని వెనుక రాజకీయ ప్రమేయం ఉందని కూడా.. నాయకులు వ్యాఖ్యానించారు.
మరో వైపు మంత్రి కందుల దుర్గేష్. .. అసలు ఈ బంద్ నిర్ణయం వెనుక ఏం జరిగిందో వెలికి తీయాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిణామాలు ముదురుతున్న నేపథ్యంలో శనివారం ఉదయం హైదరాబా ద్లో భేటీ అయిన ఫిలిం చాంబర్.. జూన్ 1 నుంచి ఎలాంటి బంద్ ఉండబోదని.. యధావిధిగా హాళ్లు రన్ అవుతాయని ప్రకటించింది. అయితే.. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాలతో చర్చిస్తామని తెలిపింది.
This post was last modified on May 24, 2025 2:21 pm
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్ను సాగిస్తున్న…
అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…
బలంగా మాట్లాడాలి. మాటకు మాట కౌంటర్ ఇవ్వాలి. అది వింటే ప్రత్యర్థులు నోరు అప్పగించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…