ఏపీ, తెలంగాణలో జూన్ 1 నుంచి సినిమా హాళ్లలో ప్రదర్శనలు ఉండబోవని.. సినిమా హాళ్లను మూసేస్తామని ప్రకటించిన ఎగ్జిబిటర్ల సంఘం తాజాగా వెనక్కి తగ్గింది. జూన్ 1 నుంచి ఎలాంటి బంద్ ఉండబోదని.. సినిమా హాళ్లు యధావిధిగా పనిచేయనున్నాయని ప్రకటించింది. అంతేకాదు.. దీనిపై స్పష్టత వచ్చిందని కూడా ప్రకటించింది. తాజాగా ఎగ్జిబిటర్ల సంఘం, ఫిలించాంబర్ సభ్యులు హైదరాబాద్లో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా జూన్ 1 నుంచి సినిమా హాళ్లను బంద్ చేస్తామని గతంలో చేసిన ప్రకటనపై వారు చర్చించారు. వాస్తవానికి సినిమాల పై ఎగ్జిబిటర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. తమ సమస్యలు పరిష్కరిం చాలని కూడా డిమాండ్ చేస్తోంది. గతంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను సినీ ప్రముఖులు కలిసి వెళ్లారు. అయినా.. వారి సమస్యలు పరిష్కారం కాలేదన్నది వారి వాదన. ఈ నేపథ్యంలోనే బంద్కు పిలుపునిచ్చారు.
అయితే.. దీని వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమా హరి హర వీరమల్లు జూన్ 12 న విడుదల అవుతున్న నేపథ్యంలోనే బంద్కు పిలుపునిచ్చారని.. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. జనసేన నాయకులు కూడా దీనిపై స్పందించారు. ఇది కుట్రపూరిత నిరసన అని.. దీని వెనుక రాజకీయ ప్రమేయం ఉందని కూడా.. నాయకులు వ్యాఖ్యానించారు.
మరో వైపు మంత్రి కందుల దుర్గేష్. .. అసలు ఈ బంద్ నిర్ణయం వెనుక ఏం జరిగిందో వెలికి తీయాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిణామాలు ముదురుతున్న నేపథ్యంలో శనివారం ఉదయం హైదరాబా ద్లో భేటీ అయిన ఫిలిం చాంబర్.. జూన్ 1 నుంచి ఎలాంటి బంద్ ఉండబోదని.. యధావిధిగా హాళ్లు రన్ అవుతాయని ప్రకటించింది. అయితే.. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాలతో చర్చిస్తామని తెలిపింది.
This post was last modified on May 24, 2025 2:21 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…