ఈ నెల 30 విడుదల కాబోతున్న భైరవం దర్శకుడు విజయ్ కనకమేడల ట్రోలింగ్ బారిన పడ్డారు. ఎప్పుడో దశాబ్దం క్రితం తన సోషల్ మీడియా పేజీలో మెగా హీరోలను అవమానపరిచినట్టుగా కొన్ని స్క్రీన్ షాట్లు బయటికి రావడం మెగాభిమానులకు ఆగ్రహం కలిగించింది. దీంతో బాయ్ కాట్ భైరవం అంటూ ట్రెండింగ్ మొదలుపెట్టారు. దీని వల్ల కలుగుతున్న డ్యామేజ్ పెద్దదవ్వడంతో విజయ్ కనకమేడల స్వయంగా స్పందించారు. ఎవరో హ్యాక్ చేసి ఉద్దేశపూర్వకంగా ఆ పోస్టులను పోస్ట్ చేశారని, ఇప్పుడు వాటితో తన సినిమాను చంపే ప్రయత్నం చేస్తున్నారని సుదీర్ఘమైన సందేశం విడుదల చేశారు.
విజయ్ కనకమేడలకు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ కు పని చేసిన అనుభవం ఉంది. సాయి ధరమ్ తేజ్ తో అన్నా అని పిలిపించుకునేంత చనువు ఉంది. తనకు సరిపడా కథ ఉంటే సినిమా చేద్దాం తీసుకురమ్మని సాయి చెప్పడం గురించి ఆయన ప్రస్తావించారు. అంతే కాదు చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తూ పెరిగిన తాను మెగాభిమానులను దూరం చేసుకునే పనులు ఎందుకు చేస్తానని, కాకపోతే హ్యాక్ జరిగింది నా పేజీలోనే కాబట్టి ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని, ఫ్యాన్స్ ని క్షమాపణ కోరుతూ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.
దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. హీరోలు దర్శకులు ఇప్పటి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే సరిపోదు. గతంలో తాము పెట్టిన పోస్టులు ట్వీట్లలో ఏమైనా హ్యాక్స్ జరిగాయా లేక ట్రోలింగ్ అయ్యిందాని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. అప్పుడెప్పుడో పాతవి ఎవరు గుర్తు పెట్టుకుంటారని అనడానికి లేదు. అందరూ మర్చిపోయిన గతాన్ని తవ్వితీసి మరీ ఇలాంటివి బయట పెడుతుంటారు. విజయ్ కనకమేడల అన్నట్టు బాధ్యత మాత్రం సదరు అకౌంట్ హోల్డర్ దే అవుతుంది. దీనికి మెగా ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉండబోతోందో చూడాలి. ప్రస్తుతానికి ముగింపు పడినట్టే అనుకోవాలి.
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…