ఓటిటి వల్ల కేవలం సినిమా థియేటర్లకు మాత్రమే నష్టమనుకుంటే పొరబడ్డట్టే. ఇంతకుముందే ఓటిటి హక్కుల ఎఫెక్ట్ టీవీ ఛానల్స్లో ప్రసారమయ్యే సినిమాలపై పడింది. ఓటిటిలో ఏ సినిమా అయినా యాభై రోజుల లోపే వచ్చేస్తుంది. టీవీ ఛానల్లో ప్రసారం మాత్రం బాగా లేటవుతూ వుంటుంది. దీని వల్ల సాంప్రదాయ టీవీ ప్రేక్షకులు మినహా స్మార్ట్ టీవీలు, ఫోన్లు వున్న ప్రేక్షకులు ఎప్పుడో టెలివిజన్ ప్రీమియర్ కోసం ఎదురు చూడడం మానేసారు.
ఇప్పుడు ఓటిటి కంపెనీలు పెరిగిపోవడంతో కంటెంట్ ప్రొడ్యూస్ చేయడం కీలకంగా మారింది. అందుకని టీవీ ఛానల్స్ కోసం చేసే టాక్ షోలను కూడా ఓటిటి కంపెనీలే నిర్మిస్తున్నాయి. టీవీ ఛానల్స్ కంటే ఆకర్షణీయమయిన ఆఫర్లు ఇస్తూ వుండడంతో స్టార్లు ఓటిటిల కోసం టాక్ షోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
సమంత ఫస్ట్ ఎవర్ టాక్ షోను ఆహా సంస్థ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో టీవీ ఛానల్స్ కి గుబులు పట్టుకుంది. నెమ్మదిగా గేమ్ షోలను కూడా ఓటిటి కంపెనీలు లాక్కుపోతే ఛానల్స్ ఇక్కట్లు పడతాయి. అందుకే తమ దగ్గర రన్ అవుతోన్న షోలకి లాంగ్ రన్ కాంట్రాక్టులు కుదుర్చుకుంటున్నట్టు తెలిసింది.
This post was last modified on November 7, 2020 4:30 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…