ఓటిటి వల్ల కేవలం సినిమా థియేటర్లకు మాత్రమే నష్టమనుకుంటే పొరబడ్డట్టే. ఇంతకుముందే ఓటిటి హక్కుల ఎఫెక్ట్ టీవీ ఛానల్స్లో ప్రసారమయ్యే సినిమాలపై పడింది. ఓటిటిలో ఏ సినిమా అయినా యాభై రోజుల లోపే వచ్చేస్తుంది. టీవీ ఛానల్లో ప్రసారం మాత్రం బాగా లేటవుతూ వుంటుంది. దీని వల్ల సాంప్రదాయ టీవీ ప్రేక్షకులు మినహా స్మార్ట్ టీవీలు, ఫోన్లు వున్న ప్రేక్షకులు ఎప్పుడో టెలివిజన్ ప్రీమియర్ కోసం ఎదురు చూడడం మానేసారు.
ఇప్పుడు ఓటిటి కంపెనీలు పెరిగిపోవడంతో కంటెంట్ ప్రొడ్యూస్ చేయడం కీలకంగా మారింది. అందుకని టీవీ ఛానల్స్ కోసం చేసే టాక్ షోలను కూడా ఓటిటి కంపెనీలే నిర్మిస్తున్నాయి. టీవీ ఛానల్స్ కంటే ఆకర్షణీయమయిన ఆఫర్లు ఇస్తూ వుండడంతో స్టార్లు ఓటిటిల కోసం టాక్ షోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
సమంత ఫస్ట్ ఎవర్ టాక్ షోను ఆహా సంస్థ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో టీవీ ఛానల్స్ కి గుబులు పట్టుకుంది. నెమ్మదిగా గేమ్ షోలను కూడా ఓటిటి కంపెనీలు లాక్కుపోతే ఛానల్స్ ఇక్కట్లు పడతాయి. అందుకే తమ దగ్గర రన్ అవుతోన్న షోలకి లాంగ్ రన్ కాంట్రాక్టులు కుదుర్చుకుంటున్నట్టు తెలిసింది.
విద్యాశాఖ మంత్రిగా టీడీపీ యువ నాయకుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్.. నారా లోకేష్ దూకుడు చూపిస్తున్నారు. నిజానికి విద్యా శాఖ…
రాష్ట్రంలో కూటమిప్రభుత్వంఏర్పడి జూన్ 12కు రెండేళ్లు పూర్తయ్యాయి. 2024లో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు జనసేన అధినేత…
ఏపీలో పెను కలకలం రేపిన మద్యం కుంభకోణంలో ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చేసింది. వైసీపీ…
తాను చేసే మాస్ మసాలా సినిమాల విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా, పట్టించుకోకుండా చాలా ఏళ్ల పాటు అదే రూట్లో…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పోరాటం బరిలోకి దిగకుండానే ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆమెకు…
కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మొదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త ఇన్నింగ్స్లో అభిమానుల ఆకాంక్షలు, అంచనాలకు తగ్గ సినిమాలు…