ఓటిటి వల్ల కేవలం సినిమా థియేటర్లకు మాత్రమే నష్టమనుకుంటే పొరబడ్డట్టే. ఇంతకుముందే ఓటిటి హక్కుల ఎఫెక్ట్ టీవీ ఛానల్స్లో ప్రసారమయ్యే సినిమాలపై పడింది. ఓటిటిలో ఏ సినిమా అయినా యాభై రోజుల లోపే వచ్చేస్తుంది. టీవీ ఛానల్లో ప్రసారం మాత్రం బాగా లేటవుతూ వుంటుంది. దీని వల్ల సాంప్రదాయ టీవీ ప్రేక్షకులు మినహా స్మార్ట్ టీవీలు, ఫోన్లు వున్న ప్రేక్షకులు ఎప్పుడో టెలివిజన్ ప్రీమియర్ కోసం ఎదురు చూడడం మానేసారు.
ఇప్పుడు ఓటిటి కంపెనీలు పెరిగిపోవడంతో కంటెంట్ ప్రొడ్యూస్ చేయడం కీలకంగా మారింది. అందుకని టీవీ ఛానల్స్ కోసం చేసే టాక్ షోలను కూడా ఓటిటి కంపెనీలే నిర్మిస్తున్నాయి. టీవీ ఛానల్స్ కంటే ఆకర్షణీయమయిన ఆఫర్లు ఇస్తూ వుండడంతో స్టార్లు ఓటిటిల కోసం టాక్ షోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
సమంత ఫస్ట్ ఎవర్ టాక్ షోను ఆహా సంస్థ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో టీవీ ఛానల్స్ కి గుబులు పట్టుకుంది. నెమ్మదిగా గేమ్ షోలను కూడా ఓటిటి కంపెనీలు లాక్కుపోతే ఛానల్స్ ఇక్కట్లు పడతాయి. అందుకే తమ దగ్గర రన్ అవుతోన్న షోలకి లాంగ్ రన్ కాంట్రాక్టులు కుదుర్చుకుంటున్నట్టు తెలిసింది.
This post was last modified on November 7, 2020 4:30 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…