ఓటిటి వల్ల కేవలం సినిమా థియేటర్లకు మాత్రమే నష్టమనుకుంటే పొరబడ్డట్టే. ఇంతకుముందే ఓటిటి హక్కుల ఎఫెక్ట్ టీవీ ఛానల్స్లో ప్రసారమయ్యే సినిమాలపై పడింది. ఓటిటిలో ఏ సినిమా అయినా యాభై రోజుల లోపే వచ్చేస్తుంది. టీవీ ఛానల్లో ప్రసారం మాత్రం బాగా లేటవుతూ వుంటుంది. దీని వల్ల సాంప్రదాయ టీవీ ప్రేక్షకులు మినహా స్మార్ట్ టీవీలు, ఫోన్లు వున్న ప్రేక్షకులు ఎప్పుడో టెలివిజన్ ప్రీమియర్ కోసం ఎదురు చూడడం మానేసారు.
ఇప్పుడు ఓటిటి కంపెనీలు పెరిగిపోవడంతో కంటెంట్ ప్రొడ్యూస్ చేయడం కీలకంగా మారింది. అందుకని టీవీ ఛానల్స్ కోసం చేసే టాక్ షోలను కూడా ఓటిటి కంపెనీలే నిర్మిస్తున్నాయి. టీవీ ఛానల్స్ కంటే ఆకర్షణీయమయిన ఆఫర్లు ఇస్తూ వుండడంతో స్టార్లు ఓటిటిల కోసం టాక్ షోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
సమంత ఫస్ట్ ఎవర్ టాక్ షోను ఆహా సంస్థ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో టీవీ ఛానల్స్ కి గుబులు పట్టుకుంది. నెమ్మదిగా గేమ్ షోలను కూడా ఓటిటి కంపెనీలు లాక్కుపోతే ఛానల్స్ ఇక్కట్లు పడతాయి. అందుకే తమ దగ్గర రన్ అవుతోన్న షోలకి లాంగ్ రన్ కాంట్రాక్టులు కుదుర్చుకుంటున్నట్టు తెలిసింది.
This post was last modified on November 7, 2020 4:30 pm
ఏప్రిల్ చివరి వారం అంటే పీక్ సమ్మర్.. ఈ టైంలో పెద్ద పెద్ద సినిమాలతో థియేటర్లు కళకళలాడుతుండాలి. రెండు గంటలు…
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని…