హిందీలోనే కాదు తెలుగులోనూ పరిచయం అక్కర్లేని పేరు పరేష్ రావల్. మనీ, క్షణ క్షణం, శంకర్ దాదా ఎంబిబిఎస్, రిక్షావోడు, గోవిందా గోవిందా లాంటి ఎన్నో సూపర్ హిట్స్ లో మర్చిపోలేని పాత్రలు చేశారు. ఇక బాలీవుడ్ సంగతి సరేసరి. కొన్ని వందల సినిమాల్లో గొప్ప క్యారెక్టర్లతో తనదైన ముద్ర వేశారు. అలాంటి నటుడు ఒక వేషం వదులుకుంటే 25 కోట్లు చెల్లించాని లీగల్ నోటీస్ అందుకోవడం విచిత్రమేగా. కానీ ఇది నిజం. హేరాఫేరీ 3 నుంచి తప్పుకున్నందుకు గాను అంత మొత్తం కట్టాలంటూ నిర్మాణ సంస్థ కేప్ అఫ్ గుడ్ ఫిలింస్ నోటీస్ పంపినట్టుగా ముంబై మీడియాలో వస్తున్న రిపోర్ట్స్ షాకిస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే హేరాఫేరీ 3 నిర్మించాలని నిర్ణయించుకున్నప్పుడు దానికి సంబంధించిన అన్ని అనుమతులను కేప్ అఫ్ గుడ్ ఫిలింస్ సంస్థ పొందింది. ముందు రెండు భాగాలకు సంబంధించిన లెక్కలు, అప్పులు తీర్చడానికి భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టింది. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టితో పాటు ఇతర తారాగణం ఒకే చెప్పాక అనౌన్స్ మెంట్ కోసం ఒక ప్రోమో వీడియో షూట్ చేసింది. ఇందులో పాటు పరేష్ రావల్ కూడా పాల్గొన్నారట. ఇదయ్యాక రెండు రోజులు గడవటం ఆలస్యం తాను ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు, ఇప్పుడు ఆసక్తి లేదనే తరహాలో పరేష్ రావల్ చెప్పడం సదరు బ్యానర్ కు షాక్ ఇచ్చింది.
దర్శకుడు ప్రియదర్శన్ ఇంకా దీని గురించి స్పందించాల్సి ఉంది. ఇంత సీరియస్ గా వ్యవహారం ముదరడానికి కారణం లేకపోలేదు. పరేష్ రావల్ పోషించిన గణపత్ రావు బాబురావు ఆప్టే పాత్రను ఆయన తప్ప ఇంకెవరు పోషించినా తెరమీద తేలిపోతుంది. ఆ మాటకొస్తే ఇద్దరు హీరోల కన్నా తనకే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ఒకవేళ ఈ క్యారెక్టర్ ని పూర్తిగా తీసేసి సినిమా తీస్తే ఉన్న బజ్ పోయి ఓపెనింగ్స్ రిస్క్ లో పడే ప్రమాదముంది. ఈ నోటీస్ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి. అక్కడి మీడియా వర్గాలు రాజీ కుదరొచ్చని, ఒకవేళ పరేష్ బలవంతం మీద ఒప్పుకున్నా మునుపటి మేజిక్ చేయలేరేమోనని అంటున్నారు.
This post was last modified on May 20, 2025 3:19 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…