వచ్చే ఏడాది కేవలం ఒక్క రోజు గ్యాప్ లో విడుదల కాబోతున్న ది ప్యారడైజ్, పెద్దిలు క్యాస్టింగ్ విషయంలోనూ నువ్వా నేనాని పోటీ పడుతున్నాయి. రామ్ చరణ్ కు ధీటైన విలన్ కావాలనే ఉద్దేశంతో దర్శకుడు బుచ్చిబాబు ఏరికోరి మరీ దివ్యేందు శర్మని తీసుకొచ్చాడు. మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో తన నటనతో హడలెత్తించిన ఈ వర్సటైల్ యాక్టర్ పెద్దిలో కూడా టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నాడని ఆల్రెడీ టాక్. ఇప్పుడు ప్యారడైజ్ కోసం శ్రీకాంత్ ఓదెల గత ఏడాది కిల్ లో క్రూరమైన హంతకుడిగా మెప్పించిన రాఘవ్ జుయెల్ ని తీసుకొచ్చినట్టు లేటెస్ట్ అప్ డేట్. లుక్ టెస్ట్ పూర్తి చేసి త్వరలో ఫస్ట్ లుక్ వదులుతారట.
గతంలో తెలుగు సినిమాల ప్రతినాయకుల కోసం ముంబై నుంచి షియాజీ షిండే, అశుతోష్ రానా, ముఖేష్ ఋషి లాంటి వాళ్ళను తీసుకొచ్చి వాళ్లకు బ్రహ్మాండమైన కెరీర్ ఇచ్చారు మన దర్శకులు. ఆ బ్యాచ్ తరం అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్త నెత్తురు అవసరమవుతోంది. అందులో భాగంగా దివ్యేందు, రాఘవ్ జుయెల్ లాంటి చాయిసులను ఎంచుకుంటున్నారు. లుక్స్ లోనే కాదు నటనతోనే భయపెట్టే ఇలాంటి వాళ్లకు టాలీవుడ్ లో సరైన హిట్ దక్కాలే కానీ ఆఫర్లు వర్షంలా కురుస్తాయి. ఎక్కువ సినిమాలకు టెంప్ట్ చేసేలా భారీ పారితోషికాలు తలుపులు తడతాయి. పెద్ది, ప్యారడైజ్ రెండూ ఆ కోవలోనే ఉన్నాయి.
ఇప్పటికైతే షూటింగ్ ప్రోగ్రెస్ పరంగా పెద్దినే ముందుంది. ముప్పై శాతం పూర్తయిపోగా కొత్త షెడ్యూల్ ని ఇటీవలే మొదలుపెట్టారు. ది ప్యారడైజ్ సెట్లలో నాని వచ్చే నెల నుంచి అడుగు పెట్టబోతున్నాడు. లేట్ అయినా పక్కా ప్లానింగ్ తో అనుకున్న టైంకే పూర్తి చేసేలా శ్రీకాంత్ ఓదెల సర్వం సిద్ధం చేసుకుని పెట్టాడట. కాకపోతే అనిరుద్ రవిచందర్ సహకారం చాలా అవసరం. టైంకి పాటలు ఇవ్వడంతో పాటు నేపధ్య సంగీతానికి తగినంత సమయం కేటాయించాలి. వచ్చే ఏడాది మార్చ్ ఇంకా చాలా దూరంలో ఉన్నట్టు అనిపిస్తోంది కానీ ఇప్పటి మే మినహాయించి లెక్కేసుకుంటే కేవలం పది నెలలే ఉంది.
This post was last modified on May 19, 2025 6:04 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…