సినిమాల్లో సక్సెస్లు అనుకున్నంత లేకపోవచ్చు కానీ… టాలీవుడ్లో చాలా అన్యోన్యంగా ఉండే కుటుంబాల్లో ఒకటిగా మంచు వారికి చాలా మంచి పేరుండేది. మంచు విష్ణు, మంచు మనోజ్ వేర్వేరు తల్లులకు పుట్టిన కొడుకులు అనే విషయం చాలామందికి తెలియనట్లుగా చాలా బలంగా ఉండేది వాళ్ల బాండింగ్. అలాంటిది ఇప్పుడు ఇద్దరూ బద్ధ శత్రువుల్లా మారిపోవడం మంచు ఫ్యామిలీ అభిమానులకే కాదు.. సామాన్య ప్రేక్షకులకు కూడా పెద్ద షాక్. వీళ్లిద్దరి మధ్య తలెత్తింది చిన్న గొడవే అని.. కొన్ని రోజుల్లో అంతా సర్దుకుంటుందని అంతా అనుకున్నారు.
కానీ నెలలు గడుస్తున్నా పరిస్థితి ఏం మారలేదు. పైగా అంతకంతకూ విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకుని రచ్చకెక్కుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మీడియా ఇంటర్వ్యూల్లో, స్టేజ్ల మీద పరస్పరం కౌంటర్లు వేసుకుని.. పరోక్షంగా కుటుంబ గౌరవాన్ని తగ్గించే పరిస్థితి తలెత్తుతోంది. మొన్న మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘రక్త పంచుకుని పుట్టిన వాళ్లే మన పతనాన్ని కోరుతుంటే..’’ అంటూ మనోజ్ను టార్గెట్ చేశాడు. ఇటీవలి పరిణామాలతో తాను హర్ట్ అయ్యాను అంటే అది చిన్న మాటే అవుతుందని విష్ణు అన్నాడు. తన తండ్రి గౌరవం గురించి మాట్లాడుతున్నపుడు విష్ణులో ఆవేదన స్పష్టంగా కనిపించింది.
విష్ణు మాటలు వింటే.. మనోజ్ ఇలా ఎందుకు చేస్తున్నాడు. అన్నతో సఖ్యంగా ఉండొచ్చు కదా అనిపించింది.
ఇక లేటెస్ట్గా మనోజ్ మరింత ఎమోషనల్ అయ్యాడు. తన ఏవీ చూస్తూ కన్నీటి పర్యంతం అయ్యాడు. స్టేజ్ మీద కూడా కళ్లలో నీళ్లతోనే మాట్లాడాడు. ఇల్లు, కార్లు తీసేసుకుని.. తనను, తన పిల్లల్ని రోడ్డు మీదికి లాగేశారంటూ ఆవేదనను వెళ్లగక్కాడు. మనోజ్ ఆవేదన కూడా అభిమానులను కరిగించింది. విష్ణు తమ్ముడితో ఇంత కఠినంగా ఉన్నాడేంటి అనుకుంటున్నారు అందరూ.
ఐతే ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అన్నది పక్కన పెడితే.. అన్నదమ్ముల గొడవ వల్ల మంచు ఫ్యామిలీ ప్రతిష్ట దెబ్బ తింటోందన్నది వాస్తవం. మామూలుగా మంచు ఫ్యామిలీని ట్రోల్ చేసేవాళ్లు కూడా ఈ తీవ్రత చూశాక.. ఈ గొడవ వీలైనంత త్వరగా సమసిపోయి మళ్లీ ఆ కుటుంబం అన్యోన్యంగా ఉంటే బాగుండనే కోరుకుంటున్నారు. ఈ గొడవ ఎలా ఉన్నప్పటికీ.. విష్ణు, మనోజ్ ఇద్దరూ కూడా తమ తండ్రి మీద అపారమైన ప్రేమ, గౌరవ మర్యాదలను చాటుతున్న నేపథ్యంలో ఆయన కోసమైనా కలిసిపోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో?
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…