Movie News

దర్శకులు లేకపోతే పీకేదేం లేదు – దేవిశ్రీ ప్రసాద్

దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో ఎంత ఊపు ఉంటుందో.. స్టేజ్ ఎక్కి అతను మాట్లాడుతుంటే అంతే ఉత్సాహం ఉంటుంది. సినిమా ఈవెంట్లలో అందరిలా అవతలి వాళ్ల భజన చేయకుండా ఆసక్తికర విషయాలు మాట్లాడుతుంటాడతను. కొన్నిసార్లు గట్టిగా కౌంటర్లు కూడా వేస్తుంటాడు. ‘పుష్ప-2’ ప్రమోషనల్ ఈవెంట్లో అతడి వ్యాఖ్యలు ఎంత చర్చనీయాంశం అయ్యాయో తెలిసిందే. తానుండగా.. వేరే సంగీత దర్శకులతో కొన్ని సీన్లకు సుకుమార్ నేపథ్య సంగీతం చేయించుకోవడంతో దేవిశ్రీ ఫైర్ అయిపోయాడు. సుక్కును ఏమీ అనకుండా నిర్మాతలను టార్గెట్ చేశాడు.

దీని వల్ల సుకుమార్‌తో అతడికి చెడుతుందా.. తర్వాతి సినిమాలకు వీళ్లిద్దరూ కలిసి పని చేయరా అన్న సందేహాలు కూడా కలిగాయి. కానీ తర్వాత అంతా సర్దుకున్నట్లే కనిపించింది. తాజాగా దేవిశ్రీ ప్రసాద్ ఒక సినిమా ఈవెంట్లో.. సుకుమార్ అని కాకుండా దర్శకులందరి మీద ప్రశంసలు కురిపించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. కర్ణాటక రాజకీయ నాయకుడు గాలి జనార్దనరెడ్డి తనయుడు కిరీటి హీరోగా పరిచయం అవుతున్న ‘జూనియర్’ సినిమాకు దేవినే సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ సాంగ్ లాంచ్ బెంగళూరులో జరిగింది. ఈ వేడుకలో దేవి దర్శకులను ఆకాశానికెత్తేశాడు.

‘‘ఒక సినిమా చేయాలంటే దర్శకుడే అత్యంత కీలకం. నటీనటులను ఎంచుకుని, నిర్మాతను ఒప్పించి.. టెక్నీషియన్లను సెట్ చేసుకుని తొలి రోజు నుంచి రిలీజ్ వరకు కష్టపడేది దర్శకుడే. ప్రతి దర్శకుడికీ మనం ప్రేమ, గౌరవం ఇవ్వాలి. కొత్త దర్శకుడైనా సరే, పెద్ద దర్శకుడైనా సరే.. ఫెయిల్యూర్ వస్తే దర్శకుడినే మనం ముందుగా నిందిస్తాం. అలాగే ఏ కష్టం వచ్చినా ముందు దర్శకుడే పడాలి. దర్శకుల కష్టం వల్లే మనందరం ఇక్కడ ఉన్నాం. ఒక దర్శకుడు కథను క్రియేట్ చేసి అందరినీ ఒప్పించి ట్రాక్‌లో పెడితే తప్ప.. మనందరం ఎంత టాలెంట్ ఉన్నా సరే పీకేదేం లేదు. నా స్టూడియోలో నేను పాటలు కొట్టుకోవాలి. మీ కెమెరాలో మీరు చూసుకోవాలి. అందమైన కథలు చెబుతూ మన జీవితాలను ఇంకా అందంగా మారుస్తున్న దర్శకులందరికీ హ్యాట్సాఫ్‌’’ అని దేవి అన్నాడు.

This post was last modified on May 19, 2025 2:22 pm

Share

Recent Posts

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

9 minutes ago

త్రినాధ్ సంభవాన్ని తక్కువంచనా వేశారా

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…

13 minutes ago

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

2 hours ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

3 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

3 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

3 hours ago