సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్లలో నయనతార రూటే వేరు. ఆమెకు స్టార్ ఇమేజ్ వచ్చినప్పటి నుంచి తనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకుని అందుకు అనుగుణంగానే పని చేసుకుంటూ వెళ్తోంది. తాను సినిమా ప్రమోషన్లకు రానని ఆమె ఖరాఖండిగా చెప్పేస్తుంది. అది ఎంత పెద్ద సినిమా అయినా సరే.. తన అవసరం ఎంతున్నా సరే.. ఈ విషయంలో రాజీ పడదు. తెలుగులో ‘సైరా’ సహా ఎన్నో భారీ చిత్రాల్లో నటించిన నయన్.. ఒకట్రెండు చిత్రాలను మించి ప్రమోట్ చేయలేదు. ‘శ్రీరామరాజ్యం’ తన సినిమా చివరి సినిమా అవుతుందన్న అంచనాతో ఆ చిత్ర ఆడియో వేడుకకు మాత్రమే హాజరైంది.
తమిళంలో తన మనసుకు బాగా దగ్గరైన, తాను ప్రొడక్షన్లో భాగమైన కొన్ని సినిమాలను మాత్రమే ప్రమోట్ చేసింది.
అలాంటి హీరోయిన్ ఇప్పుడు ఓ సినిమా మొదలు కాకముందే.. దాని ప్రమోషన్లో భాగం కావడం అందరికీ పెద్ద షాకే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి రూపొందించనున్న చిత్రంలో నయన్ కథానాయికగా ఎంపికైంది. ఈ విషయాన్ని నయన్ భాగమైన ఒక ఫన్నీ ప్రమోషనల్ వీడియో ద్వారా అనౌన్స్ చేశారు.
ఇందులో నయన్ తెలుగులో మాట్లాడ్డం.. మెగాస్టార్తో కలిసి నటించడం పట్ల ఎగ్జైట్ కావడం.. అనిల్ స్క్రిప్టును పొగడ్డం.. ఇలా ప్రతిదీ ఆశ్చర్యకరమే. సినిమా రిలీజ్ టైంలో కూడా ప్రమోషన్లకు రాని నయన్తో అనౌన్స్మెంట్తోనే ఇలాంటి వీడియో చేయించడం అనిల్ రావిపూడికే చెల్లింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రమోషన్ల విషయంలో ట్రెండ్ సెట్ చేసిన అనిల్.. ఇప్పుడు మెగాస్టార్ మూవీని ఇంకో లెవెల్కు తీసుకెళ్లేలా కనిపిస్తున్నాడు. అసలు నయన్ను ఇలా ఎలా ఒప్పించాడని ఇండస్ట్రీ జనాలు సైతం ఆశ్చర్యపోతున్నారు.
This post was last modified on May 18, 2025 7:21 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…