గత కొన్నేళ్లలో తెలుగులో బాగా వైరల్ అయిన పాటల్లో ‘చుట్టమల్లే చుట్టేసిందే..’ పాట ఒకటి. ‘దేవర’ సినిమా కోసం అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ఒక శ్రీలంక పాటను కాపీ కొట్టాడంటూ విమర్శలు వచ్చినా సరే.. అవేవీ ఈ పాట వైరల్ కాకుండా ఆపలేకపోయాయి. ఇక రిలీజ్ టైం వచ్చేసరికి ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్లో ఎక్కడ చూసినా ఈ పాటే కనిపించింది. ఈ పాట వినసొంపుగా ఉండడమే కాదు.. కనువిందుగానూ అనిపించింది. మెలోడీ సాంగే అయినప్పటికీ.. ఇందులో సింపుల్గా సాగిన స్టెప్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఐతే ఇంత హిట్ అయిన ఈ పాట విషయంలో తనకు రావాల్సిన క్రెడిట్ రాలేదంటూ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ ఫీలవుతున్నాడు. బాలీవుడ్లో ఫేమస్ అయిన బోస్కో.. తెలుగులో చేసిన ఏకైక పాట ఇది. ఈ పాటలో స్టెప్స్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చినప్పటికీ.. టీం మాత్రం తన గురించి ఎక్కడా మాట్లాడలేదని బోస్కో ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశాడు.
మిగతా వాళ్ల సంగతి ఎలా ఉన్నా.. ప్రమోషన్ల సమయంలో జాన్వీ కపూర్ అయినా తన గురించి మాట్లాడుతందని ఆశించానని.. కానీ ఆమె కూడా తన తన ప్రస్తావనే తేకపోవడం బాధించిందని బోస్కో తెలిపాడు. ‘బ్యాడ్ న్యూస్’ సినిమాలో ఎంతో పాపులర్ అయిన ‘తౌబా తౌబా’ పాటకు తానే కొరియోగ్రఫీ చేశానని.. ఆ సినిమా ప్రమోషన్లలో హీరో విక్కీ కౌశల్ మాత్రం తన గురించి గొప్పగా మాట్లాడాడని బోస్కో అన్నాడు. ఏదైనా పాట పాపులర్ అయినపుడు కొరియోగ్రాఫర్కు తగిన గుర్తింపు ఇవ్వాలని.. కానీ ఇండస్ట్రీలో ఇది కొరవడిందని అతను ఆవేదన వెలిబుచ్చాడు. బాలీవుడ్లో జూమ్ జో పఠాన్, కాలా చష్మా లాంటి పాటలకు బోస్కో చేసిన కొరియోగ్రఫీకి మంచి పేరే వచ్చింది.
This post was last modified on May 18, 2025 7:19 am
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్ను సాగిస్తున్న…
అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…
బలంగా మాట్లాడాలి. మాటకు మాట కౌంటర్ ఇవ్వాలి. అది వింటే ప్రత్యర్థులు నోరు అప్పగించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…